5, జనవరి 2024, శుక్రవారం

బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 3

 



బాబూజీ ఆధ్యాత్మిక శిక్షణ - 3

బాబూజీ బోధన అంతా బీజరూపంలో ఉండేది. తనను తాను బీజం నాటే వ్యక్తిగా చెప్పుకునేవారు. తన ప్రాణాయాహుతి ప్రసరణ ద్వారా ఆ బీజాన్ని నాటుటఊండెవయారు. అది మన లోలోతుల్లో అంతరంగంలో వికసించి, పుష్పించేది. అలా పుష్పించగా వెదజల్లిన పరిమళం ద్వారా ఇతరులు సహజమార్గం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలనీ, ఆ విధంగా సహజమార్గ అభ్యాసి ప్రవర్తన ఉండాలని అనేవారు. సహాజమార్గ ప్రచారం మరో విధంగా చేయవలసిన అవసరం లేదనీ అనేవారు. 
మాస్టర్ పని మన అంతరంగంలో మనకు తెలియకుండా జరిగి, లోపల నుండి వికాసం జరిగేలా చేస్తుంది. మార్పు తరువాత బయట పడుతుంది. ఆయన సంభాషణ చాలా మృదుమధురంగా  ఉండేది. ఎన్నడూ ఉపన్యాసాలు ఇవ్వడం జరగలేదు. వారి వద్దకు ఎటువంటి వ్యక్తి వచ్చినా ఆతని గతాన్ని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎటువంటివారిలోనైనా మార్పు సాధించేవారు. అలా వచ్చినవారిలో ఉన్న నమ్మకాలతో, వాళ్ళ అవగాహనలతో, ఎప్పుడూ జోక్యం చేసుకోకుండా, వాళ్ళు అనుసరిస్తున్న పద్ధతులను గాని, విధానాలను గాని విమర్శించకుండా, వాళ్ళ స్వేచ్ఛను గౌరవిస్తూనే వారిలో మార్పును తీసుకురాగలిగేవారు. అంటే ఆయన ఎంత కష్టపడేవారో ఊహించవచ్చు. 
బాబూజీ తాను చేసే పని మీద, తన శక్తిసామర్థ్యాలపైన ముఖ్యంగా తన గురుదేవులైన పూజ్య లాలాజీ పైన, అపారమైన విశ్వాసం ఉండేది. అందుకే ఆయన సాధన బాధ్యత, అభ్యాసిదయితే, ఆధ్యాత్మిక ప్రగతి బాధ్యత మాస్టర్ ది అనేవారు. ఇంతకు ముందెన్నడూ ఇటువంటి సాధనాపద్ధతి లేదు. సహజమార్గం ద్వారా బాబూజీ గురు-వ్యవసత్యకే కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. 
బోధించకుండా బోధించడం అనేది బాబూజీ ప్రత్యేకత. తన వద్దకు వచ్చే అభ్యాసులు రకరకాలుగా ప్రవర్తించేవారు. కొందరు సిగరెట్లు త్రాగి, పీకాలను అక్కడే పడేసినా, మరికొందరు మరుగుదొడ్లు వాడి నీళ్ళు పొయ్యకపోయినా, కాగితం ముక్కల్లాంటి చెత్తను ఎక్కడపడితే అక్కడే పడేసినా, తల్లి ఎలాగైతే చిందవందరగా మార్చేసిన ఇంటిని చక్కగా సర్దుకుంటుందో, అదే విధంగా బాబూజీ కూడా, ఆ పీకాలను తీసి దూరంగా పారవేయడం, మారుగుదొడ్లను నీళ్ళు పోసి శుభ్రం చేయడం, లైట్లు ఆర్పడం మరచిపోతే వాటిని ఆర్పడం, వంటివి స్వయంగా చేసేవారు. ఆ పనులు చేస్తున్నప్పుడు వారిలో విసుగు గాని, కోపం గాని కనిపించేది కాదు. ఆ విధంగా వారు పని చేయడం చూసిన అభ్యాసులు అయ్యో మనకి ఆ ఆలోచన తట్టలేదే, అన్నీ వారే స్వయంగా చేసుకుంటున్నారే అని బాధపడి, తమలో కొంతమంది పాశ్చాత్తాపంతో మార్పులు చేసుకునేవారు. చెప్పడం కంటే చేసి చూపించడమే బాబూజీ శిక్షణానిచ్చే పద్ధతి. 
బాబూజీ అభ్యాసుల్లో మార్పు రావడం కోసం ఎంత కష్టపడేవారన్నదానికి, అర్థం చేసుకోవడానికి ఒక్క ఉదాహరణ చాలు. తన వద్దకు వచ్చేవారికి ఎటువంటి నియమనిబంధనలు, ఎటువంటి అర్హతలు చూడలేదు. ఆయనను చూసి ఆకర్శింపబడినవారందరినీ ఆయన స్వాగతించారు. ఆ విధంగా వచ్చినవారిలో అత్యంత దుస్సాధ్యమైన ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవాలన్న ఆకాంక్షకు సంబంధించిన బీజాన్ని వాళ్ళల్లో నాటేవారు.  అంతేకాదు ఆ తపన వాళ్ళల్లో వికాశిస్తూ ఉండటానికి ప్రాణాహుతి ప్రసరణను కొనసాగిస్తూనే ఉండేవారు. ఆయన వద్దకు వచ్చినవాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ అవసరాలను కూడా తీరచేవారు; రకరకాల అవసరాలతో వస్తూండేవారు - కొందరికి అనారోగ్యమైతే, మారికొందరికి ఆర్థిక ఇబ్బందులు, ఇంకొంతమండికి పేరుప్రఖ్యాతులు వగైరా. ఇంకా క్రీడి స్థాయిలో చిన్న-చిన్న కోరికలు కూడా ఉండేవి, వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేసేవారు. సంస్కారాల ప్రభావం ఉధృతయాన్ని తగ్గించడానికి శుద్ధీకరణ చేసేవారు. ఈ విధంగా బాబూజీ ఎంతో శ్రమ పడేవారని అర్థమవుతుంది.
అత్యల్పమైనదాన్ని అర్థం చేసుకునే ముందు అత్యుత్తమమైనదాన్ని అర్థం చేసుకోవాలన్నదే వివర్త సిద్ధాంతం. ఆయన ప్రాణాహుతి ప్రసరణ ఎలా పని చేస్తుందంటే మాస్టర్ యొక్క ఆధ్యాత్మిక అస్తిత్వం మనలోకి ప్రసరించి, మనం ఆయనలాగే ఎడగడాన్ని, ఆయనలాగే మారడాన్ని సాధ్యం చేస్తుంది. తద్వారా వారి బోధనలను అర్థం చేసుకునేలా చేస్తుంది. అందుకే వారి ప్రాణాహుతిని స్వీకరించడం అంత ముఖ్యం. అప్పుడే మనం అర్థం చేసుకోలేనివి, అర్థం చేసుకోలేనివి, గ్రహించలేనివి, కనుగొనలేనివి అయిన సూక్ష్మ విషయాలను మనలోకి ప్రసరించడం జరుగుతుంది. అటువంటి గురువునే సమర్థగురువు అని అంటాం. 
సత్యం కంటే, ఆధ్యాత్మికత కంటే, అత్యంత ముఖ్యమైనది ఏదైనా ఉండీ అంటే, అది మాస్టరే. దాన్ని ప్రసాదించేది కూడా మాస్టరే. 
(సశేషం .. )  



1 కామెంట్‌:

  1. వివర్త సిద్ధాంతం చకాగా చెప్పారు. అసలు ఆధ్యాత్మిక సాధన మాస్టర్ మనచేత ఎలా చేయిస్తారో చక్కగా వర్ణించారు.

    రిప్లయితొలగించండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...