31, జనవరి 2024, బుధవారం

బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 3

 


బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 3 

అందుకే బాబూజీ, సమర్థుడైన గురువు లభించి, సాధకుడు అటువంటి గురువుతో అనుసంధానం ఏర్పరచుకున్నట్లయితే ఇది ఒక్క జన్మలోనే సుసాధ్యం అంటారు. బాబూజీ తనకు అందుబాటులో ఉన్న అనంతమైన దివ్యయశక్తితో అభ్యాసిలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తులను మేలుకొల్పడం చేస్తారు. ఈ విధంగా, శుద్ధీకరణ ప్రక్రియ సహాయంతో ఈ స్థూల శరీరంలోని ప్రతీ అణువణువునూ పునర్నిర్మిస్తూ అస్సలు భౌతికత్వం జాడ లేకుండా ఉండేంతవరకూ, ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. ఆ విధంగా ఆ శరీరం కనిపించడానికి మామూలుగానే ఉండి, శరీర ధర్మాలు కూడా ఎప్పటిలాగే ఉన్నప్పటికీ, నిజానికి మాత్రం ఇప్పుడది పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం అయిపోతుంది. అటువంటి పరిశుద్ధ శరీరం పంచకోశాల శరీరానికి అతీతమైనది. అటువంటి శరీరమే ముక్తి కలిగిన ఆత్మ తన నివాసంగా ఏర్పరచుకో గలిగిన  శరీరం. ఆ విధంగా సదేహ ముక్తి లభించడం జరుగుతుంది. సహజమార్గ సాంప్రదాయంలో అటువంటి సదేహముక్తి లభించిన ఆత్మ ఈ ఆధ్యాత్మిక శరీరంలో భూమ్మీద ఉండవలసినంత కాలం ఉండగలుగుతుంది. కాబట్టి సహజమార్గంలో ముక్తి కోసం, మృత్యువు ఆసన్నమయ్యే వరకూ వేచి ఉండనక్కర్లేదు. ఈ అసాధ్యాన్ని బాబూజీ తన ప్రాణాహుతి శక్తి ద్వారా సుసాధ్యం చేస్తారు. 

మరొక గంభీరమైన పరిశోధన - "భగవంతునికి మనస్సు లేదు" అనడం. భగవంతునికి మనసు ఉన్నట్లయితే ద్వంద్వాలున్నట్లే; అంటే భగవంతుడు కూడా కర్మకు గురైనట్లే; కర్మకు గురవడమూ అంటే జన్మమృత్యువులకు లోనైనట్లే. ఇది అర్థం లేనిది కాబట్టి భగవంతునికి మనసు లేదు అన్నది వారి అనుభవపరమైన సత్యం. అందుకే ప్రకృతి కార్య నిర్వహణకు స్వచ్ఛమైన, పవిత్రమైన మనస్సు గల మానవుడు ప్రకృతికి అవసరమవుతాడు. ఆయన భగవంతుని పరికరమవుతాడు. 

ఈ విధంగా బాబూజీ ఆధ్యాత్మిక రంగంలో చేసిన పరిశోధనలు అనేకం ఉన్నాయి. అవన్నీ మాటల్లో వ్యక్త చేయడం అసాధ్యం. అవి కేవలం 'అనుభవశక్తి' పరంగా మాత్రమే అనుభవంలోకి వస్తాయి. 

బాబూజీ ఆవిష్కరించిన విప్లవాత్మక శోధనలు అయిదు గ్రంథాలలో శాశ్వతంగా నిక్షిప్తమై ఉన్నాయి - 1) సత్యోదయం, 2) రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము, 3) సహజమార్గ దశనియమాలపై వ్యాఖ్య, 4) అనంతము వైపు, 5) సహజమార్గ దర్శనం, అనే అయిదు ఉద్గ్రంథాలు. వారి ప్రకారం వీటిని భవిష్యత్తులో వచ్చే మానవుల కోసం వ్రాసినవి; వారికే అర్థమవుతాయట. బహుశా ఆ భవిష్యత్తు వచ్చేసినట్లుంది. పూజ్య దాజీ ఈ గ్రంథాలను మనందరమూ  సరళంగా అర్థం చేసుకునేలా "స్పిరిచ్యువల్ అనాటమీ" అనే గ్రంథాన్ని తేలికగా అర్థమయ్యే భాషలో వ్రాసి అనుగ్రహించారు. తప్పక ఆధ్యాత్మిక సాధకులందరూ చదివి కృతార్థులవ్వాలని ప్రార్థిస్తున్నాను. 

బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 2

 


బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 2

మానవుడు తాను ప్రయాణించవలసిన ఆధ్యాత్మిక యాత్రను అర్థం చేసుకోవడానికి 23 వలయాలపరంగా వివరించారు. మన గమ్యాన్ని ఈ 23 వలయాల మధ్య ఉన్న కేంద్రంగా సూచించారు. మొదటి వలయంలో అడుగు పెట్టినప్పుడే 'యాత్ర' మొదలవుతుంది. ఒకటిన్నర వలయాలు దాటితే ముక్తి. మొదటి 5 వలయాలు దాటితే హృదయక్షేత్రం దాటినట్లు. ఆ తరువాతి 11 వలయాలు దాటితే మనోక్షేత్రం దాటినట్లు. ఆ తరువాతి 7 దేదీప్యమానమైన వలయాలు దాటితే కేంద్రీయ క్షేత్రం దాటినట్లు. ఆ తారువాట అనంతంగా, ఆ ఆనంద మహాసాగరంలో  కేంద్రమవైపుగా యాత్ర కొనసాగుతూ ఉంటుంది. దీనినే బాబూజీ 'ఈత' అంటారు - 'స్విమ్మింగ్'. సృష్టిలోని మొట్టమొదటి మహర్షి ఇంకా ఇక్కడ ఈదుతూనే కేంద్రం వైపుగా తన యాత్రను కొనసాగిస్తూనే ఉన్నాడని చెప్తారు బాబూజీ. 


మన ఆధ్యాత్మిక యాత్ర 👆
బాబూజీ అవతరించేంత వరకూ మానవుడు సాధించగల అత్యున్నత స్థితి మానవాళికి అందుబాటులో లేదు. మొదటి ఒకటిన్నర వలయాలకే జన్మరాహిత్యం అంటే, ఆ కేంద్రాన్ని చేరడానికి తరువాత కొనసాగించవలసిన ఆధ్యాత్మిక యాత్ర ఎంత ఉందో, ఊహించవచ్చు. ఇప్పటి వరకూ వచ్చిన యోగుల్లో మహా అయితే మూడవ వలయం వరకూ ప్రయాణం సాధించగలిగారట. కానీ, దానికే వారు చాలా సాధించారనుకోవడం చాలా దురదృష్టకరం. కానీ, ఇప్పటి వరకూ వచ్చిన ప్రాచీన ఋషుల్లో కబీర్ ఒక్కరే 16 వలయం చేరుకున్నట్లుగా బాబూజీ సత్యోదయం అనే గ్రంథంలో వ్రాయడం జరిగింది. 
ఇటువంటి యాత్రను ఏ సహాయం లేకుండా, పూర్తి చేయడం అసాధ్యంగా కనిపిస్తుంది. బాబూజీ ప్రకారం మొదటి బిందువు నుండి రెండవ బిందువుకు చేరుకోడానికి స్వప్రయత్నం ద్వారా (కఠోర తపస్సు ద్వారా) 45 సంవత్సరాలు పడుతుందట. రెండు నుండి మూడవ బిందువుకు 45 x 5 అంటే 225 సంవత్సరాలు పడుతుంది. అలా ప్రతీ బిందువుకూ అయిదింతలు సమయం పడుతుంది. మరి మానవుడి జీవితకాలం సగటున 60 సంవత్సరాలనుకున్నా ఒక్క బిందువు యాత్ర పూర్తి చేయడా కూడా అసాధ్యమే. 
(సశేషం ..) 

బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 1

 


బాబూజీ ధ్యాన ముద్రలో 

బాబూజీ - విశిష్ఠ ఆధ్యాత్మిక పరిశోధనలు - 1

ప్రతీ సమాజంలోనూ, ప్రతీ దేశంలోనూ, ప్రతీ నాగరికతలోనూ అందరూ  'మార్పును' ఆకాంక్షించేవారే. ఆ మార్పు ఎటువంటిదో తెలియకుండానే దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమలోనే ముందుగా మార్పు రావాలన్న విషయం మరచిపోయి, అక్కడ తప్ప అన్నీ చోట్లా, అన్నీ పరిసరాల్లోనూ, ఇతరుల్లోనూ ఈ మార్పును ఆశీస్తూంటారు. కానీ ఈ 'మార్పు' ఏమిటి, ఎక్కడి నుండి రావాలి; 'మార్పు' పరమార్థం ఏమిటి?

ఈ ప్రశ్నలకు సమాధానమే బాబూజీ స్పెషల్ పర్సనాలిటీగా, ఈ విశ్వంలోనే 'మార్పు' తీసుకురావడానికి అవతరించిన ప్రకృతి వరప్రసాదం. ప్రకృతి తనను తాను ప్రక్షాళనం చేసుకోడానికి, తిరిగి క్రమబద్ధం చేయడానికి తన పరికరాన్ని తానే తయారు చేసుకుంటుంది. పవిత్ర లక్ష్యాన్ని కార్యాన్వితం చేయడానికి అవసరమైనది, స్వఛ్ఛమైన, పవిత్రమైన మనస్సు గల మానవుడు. ఎందుకంటే మనస్సు లేనిదే ప్రణాళికా కార్యరూపం దాల్చలేదు. ఆ విశిష్ఠ వ్యక్తిత్వమే మన బాబూజీ మహారాజ్. ప్రకృతి ప్రణాళిక ప్రకారం 'మార్పును' సంభవింపజేయడానికి విచ్చేసిన స్పెషల్ పరసనాలిటీ - బాబూజీ మహారాజ్.  

మానవేతర లోకాల్లో బాబూజీ ఏ విధంగా మార్పు తీసుకువస్తున్నదీ అవగాహన కాకపోయినా, మానవాళి పరిణామానికి వారే విధంగా తన జీవితాన్ని వెచ్చించినదీ కొంతవరకూ అవగాహన చేసుకోవచ్చను, అది కూడా కష్టమే అయినప్పటికీ. 
సమాజం వ్యక్తుల సమూహమని, వ్యక్తి మారనిదే  సమాజంలో మార్పు అసంభవమని అందరికీ తెలిసినదే. ఆ వ్యక్తిలో రావలసిన మార్పే ఆధ్యాత్మికంగా రావలసిన మార్పు. అటువంటి వ్యక్తిగత మార్పు కోసం కృషి చేసే సంస్థ శ్రీరామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థలు. 

ప్రస్తుత మానవుడున్న కల్లోల స్థితి నుండి, మూల స్థితికి తీసుకువెళ్ళాడానికి అవసరమైన మార్పును సంభవింపజేస్తూ, మార్గదర్శకుడిగా ఉన్న సమర్థ గురువు శ్రీ బాబూజీ మహారాజ్. ఈ ఆధ్యాత్మిక మార్పును బాబూజీ ప్రాణాహుతి ద్వారా సమర్థవంతంగా సంభవింపజేస్తున్నారు. ప్రాణాహుతి అంటే మానవ పరిణామానికి ఉపయోగించే దివ్యశక్తి. 

మానవుడు తన మూలనివాసాన్ని చేరుకునే సుగమమైన మార్గం లేక కొట్టూమిట్టాడుతున్న సమయంలో బాబూజీ, తన గురుదేవులైన పూజ్య లాలాజీ పునఃవ్యవస్థీకరించిన ప్రాణాహుతి ప్రక్రియను మెరుగుపరచి, ఆధునిక పరిస్థితుల్లో ఉన్న మానవునికనుగుణంగా, అందరూ అనుసరించగలిగే, సరళమైన సహజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చాలా జాగ్రత్తగా రూపొందించారు. ఇదే సహజమార్గ రాజయోగధ్యాన పద్ధతి. ఈ పద్ధతి ద్వారా మానవాళికి, సరైన సరళమైన జీవనవిధానం అందివ్వడమే గాక, ఆత్మసాక్షాత్కారం అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చారు. 

ఇప్పటివరకూ మానవజన్మ ప్రయోజనం మోక్షసాధ్యనే అనుకుంటున్నా మానవాళికి, ఆ తరువాత ఎంత ఆధ్యాత్మిక యాత్ర చేయవలసి ఉన్నదో తన ఆధ్యాత్మిక పరిశోధనల ద్వారా వెల్లడించారు. ముక్తికీ, మోక్షానికీ గల వ్యత్యాసం ఏమిటో స్పష్టం చేశారు. మోక్షం అంటే తాత్కాలికంగా జననమరణాలు ఆగడం అని, మరలా జన్మ తప్పదని, ముక్తి అంటే ఇక భూమిపై పునర్జన్మ ఉండదని, స్పష్టతనిచ్చారు. 

(సశేషం....) 
  




30, జనవరి 2024, మంగళవారం

బాబూజీ ఛలోక్తులు

బాబూజీ ఛలోక్తులు 


బాబూజీ ఛలోక్తులు విసిరినప్పుడు, చుట్టూ ఉన్న వాళ్ళు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వేవారు. బాగా నవ్వీస్తూండేవారు. కానీ, తన ఛలోక్తుల్లో కూడా సందేశం ఇమిడి ఉంటుందనేవారు. కేవలం కాలక్షేపం కోసం చేసే హాస్యం కాదది. బాబూజీ మాటల్లో చెప్పాలంటే, 

"నేను అనవసరంగా మాట్లాడను - నేనేదయినా హాస్యంగా మాట్లాడినా, అందులో ఎప్పుడూ యేదోక అర్థం ఉంటుంది."

కానీ, ఈ హాస్యం ద్వారా మాత్రం ఏ సంతోషమూ కలుగదనీ, తాను ఛలోక్తులు విసిరేది కేవలం మనం విసుగు చెందకుండా ఉండటానికేనని కూడా చెప్పారు బాబూజీ. అయినా వారి హాస్య స్వభావం ఎలా ఉండేదంటే, నవ్వి నవ్వి ప్రాణాలు పోతాయేమోనన్నట్లుగా ఉండేది ఒక్కోసారి. 

కొన్ని హాస్య సందర్భాలు:

నిర్వచనానికి నిర్వచనం

ఒకరోజు బాబూజీ, నిర్వచనానికి నిర్వచనం ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు. పడే పడే "నిర్వచనానికి నిర్వచనం ఏమిటి" అంటూ ఉన్నారు. 

ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఆయన కూడా చెప్పలేదు. సాధారణంగా ఆయనే చెప్పేస్తూండేవారు. అప్పుడు మనం ఎంత మూర్ఖులమో అర్థమయ్యేది. అకస్మాత్తుగా ఒక అభ్యాసి, "నిర్వచనానికి నిర్వచనం కాలం వృథా చేయడమే" అన్నాడు. దానికి బాబూజీ ఇతను చెప్పింది నిజం అన్నారు. 

భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?

అభ్యాసి: భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడు?

బాబూజీ: 1) భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు అక్కడ నువ్వు లేవు, లేకపోతే నువ్వు ఆపేసేవాడివి. 

2) ప్రపంచాన్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన జీవించాలి గనుక. 

మీకు వాచీ అవసరం ఏమిటి?

అభ్యాసి: బాబూజీ మీకు వాచీ అవసరం ఏమిటి?

బాబుజీ: కొత్తవాళ్ళతో ఎంత సమయం వ్యర్థమయ్యిందీ, లేక సాధకులు కానివారితో ఎంత సమయం వృథా అయ్యిందీ చూసుకోవడానికి. 

బాబూజీ, మీరు రోజంతా ఏం చేస్తూంటారు?

నవ్వుతూ, సంతోషంగా, హాయిగా గడిపేస్తూంటాను. 

చాలా ప్రశ్నలతో వచ్చాను. 

అభ్యాసి: బాబూజీ నేను మీ వద్దకు చాలా ప్రశ్నలతో వచ్చాను. కానీ ఇప్పుడు ఒక్కటి కూడా లేదు. 

బాబూజీ: నువ్వు చాలా ప్రశ్నలతో వచ్చావు. అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు "నువ్వు" మాత్రమే మిగిలావు.  

సముద్రంపై ధ్యానించవచ్చా?

బాబూజీ: మనం దేని మీద ధ్యానిస్తామో దాని సారమే మనకు ఫలితంగా లభిస్తుందని నా అభిప్రాయం. కాబట్టి నువ్వు సముద్రంపై ధ్యానిస్తే నీకు లభించేది ఉప్పు మాత్రమే. 

ఆలోచనారహితస్థితిని ఇస్తారా?

బాబూజీ: నా వద్దకు ఒక వ్యక్తి వచ్చి నాకు ఆలోచనారహిత స్థితి ఇస్తారా అని అడిగాడు. నేను సరదాగా, "అలాగే, అయితే ఒకషరతు; నాకు నువ్వు ఆలోచనలతో కూడిన స్థితిని ఇస్తే, నేను నీకు ఆలోచనలు లేని స్థితిని ఇస్తాను" అన్నాను. 




29, జనవరి 2024, సోమవారం

ఒక నూతన మానవాళి - దాజీ

 


ఒక నూతన మానవాళి - దాజీ 

ఆదివారం, జనవరి 28, 2024 - కాన్హా శాంతి వనం 
అందరికీ నమస్తే. 
మనం ఒక గొప్ప నూతన ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం; ఆ ఉత్సవం మన గురుపరంపరలోని మాస్టర్లు గంటున్న ఒక నూతన మానవాళి అనే కలను బలపరచడానికి అవసరమైన ప్రేరణను కలిగించబోతోంది. ఇలా మానవరూపంలో ఈ ఖైదులో  కొనసాగడానికి వీల్లేదు. అతీతంగా మానవీయంగా తయారవ్వాలి; ఆ తరువాతి మెట్టు ఏమిటో అప్పటికే తెలిసిపోతుంది. అంటే దివ్యంగా తయారవడం అనేది వారి బాధ్యత అవుతుంది.  (గురుపరంపరది). అంటే కాదు, దివ్యత్వాన్ని కూడా దాటి పరమ పరిపూర్ణ స్థితికి చేరుస్తామని కూడా మన గురుపరంపర వాగ్దానం చేయడం జరిగింది. ఇదీ మన హార్ట్ఫుల్నెస్ విధానంలో జరిగే సహాజమార్గ యాత్ర.
బాబూజీ ఇలా అంటున్నారు: దాని కోసం సంసిద్ధులవడానికి చిత్తశుద్ధిగల, తమలో పరివర్తన కలగాలని పరితపించే ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరూ కూడా ఆనందంగా, పరమానందంగా ఆధ్యాత్మికతను వ్యాపింపజేసే దూతలుగా మరింత ఉత్సాహంగా తీవ్ర నిష్ఠతో పాల్గొందురుగాక. 
మనం ఈ విధంగా ప్రారంభిద్దాం: శ్రద్ధాసక్తులతో, అతిగా అలసిపోయేంతగా, తమను తాము ఇబ్బందిపెట్టుకోకుండా, సాధ్యమైనంతగా తమను తాము మార్చుకోవాలన్న తపన కలిగిన అభ్యాసులు, భండారాకు ముందు, ఈ రోజుతో మొదలుకొని,  ప్రిసెప్టర్ల నుండి ముఖాముఖి తీసుకోవడం మంచిది.ఈ రోజు ఒక సిట్టింగు, రేపు రెండు సిట్టింగులు, ఇలా కొనసాగించండి. భాండారాలో కూడా సిట్టింగులు తీసుకోవడం కొనసాగించవచ్చు. ఎన్ని సిట్టింగులాయినా తీసుకోవచ్చు; కానీ అలసిపోయేంతగా అవసరం లేదు. రోజుకి ఒకటో రెండో సిట్టింగులు చాలు; ఒక్కొక్కటి కేవలం అరగంటసేపు మాత్రమే. 
ఈ పని చేసే ముందు, మీ అంతరంగా ఆధ్యాత్మిక స్థితిని, ఉద్వేగస్థితిని  పరిశీలించుకోండి. అంటే కాదు, మీకున్న బాధలనీ, కష్టాలనీ బాబూజీ తన భుజస్కంధాలపై ఉంచేయమంటున్నారు. మీ బాధలనీ, కష్టాలనీ నేను తీసుకోడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు; నాకిచ్చేయండి అంటున్నారు; అన్నిటి నుండీ విడుదలైపోమమంటున్నారు, బాబూజీ. 
కానీ అది ఎలా చేస్తారు? "బాబూజీ, ఈ సమస్యలన్నీ మీవి" అన్నంత తేలికా? అవును తేలికే. ప్రయత్నించి చూడండి, ఏమి జరుగుతుందో. 
ఈ సందేశం నన్ను పరవశింపజేసింది. అదే వారి ఉదారత, అదే వారి వాగ్దానం కూడా. ధన్యవాదాలు. 












26, జనవరి 2024, శుక్రవారం

ఏది తెలుసుకుంటే ఈ సర్వమూ తెలుసుకోగలుగుతాం?


ఏది తెలుసుకుంటే ఈ సర్వమూ తెలుసుకోగలుగుతాం?


ఆధ్యాత్మికతలో, సత్యాన్వేషణలో సమాధానాల కంటే ప్రశ్నలే ముఖ్యం అంటారు పెద్దలు. పరమ సత్యాన్ని తెలుసుకునే క్రమంలో యేదొక ఆధ్యాత్మిక పాఠాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అనుభవాలు గడిస్తున్నప్పటికీ, అడుగడుగునా ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. సాధకుడికి వీటినే అస్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలని (Existential questions) కూడా అంటారు. ఉదాహరణకు, నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎందుకు మరణిస్తాను? జీవిత ప్రయోజనం ఏమిటి? పుట్టుకకు, మృతువుకు మధ్య చేయవలసినది ఏమైనా ఉందా? లేక కేవలం మరణించే వరకూ జీవించడమే జీవితమా?జీవితానికి ఏమైనా పరమార్థం ఉందా? ఇలా అనేకమైన ప్రశ్నలు యేదోక దశలో ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. వీటికి సరైన సమాధానాలు వచ్చే వరకూ ఆత్మ, సంతృప్తి చెందదు. స్వతఃసిద్ధంగా ప్రతీ ఆత్మకు కలిగేటువంటి ప్రశ్నలు. 

ఇటువంటి ప్రశ్నలు ఆత్మ ఆస్తిత్వంలోకి వచ్చినప్పటి నుండీ వస్తూనే ఉన్నాయి, గతంలోనూ వచ్చాయి, ఇప్పుడూ వస్తున్నాయి, ఇక ముందు భవిష్యత్తులో కూడా వస్తూనే ఉంటాయి. వీటికి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ ఏ ఆత్మా సుఖంగా విశ్రమించలేదు. ఈ ప్రశ్నలకు నిశ్శబ్దంగా సమాధానాలు వెతుక్కోవడమే మనిషి మనుగడ. ప్రయత్నపూర్వకంగా, సంపూర్ణ స్పృహతో వీటిని అన్వేషించడమే ఆధ్యాత్మిక జీవనం. మిగిలినవారు అంటే సాధన చేయనివారు, తెలియకుండా, స్పృహ లేకుండా పరోక్షంగా వీటి సమాధానాలు రకరకాల మార్గాల ద్వారా వెతుక్కుంతు  ఉంటారు. సాధన చేయనివారికి, చేసేవారికి ఉన్న తేడా అంతే. 

ఈ ప్రశ్నలే సాధకుడి తపనను తీవ్రతరం చేస్తాయి; లోలోతుల్లోకి వెళ్ళేలా ప్రేరణ కలిగిస్తాయి. సమాధానం కోసం వేచి ఉండే అద్భుతమైన నిరీక్షణను, తద్వారా తపనతో కూడిన సహనాన్ని అలవాటు చేస్తాయి. ఈ విధంగా అబ్బే లక్షణాలన్నీ ఈ సంసార సాగరాన్ని ఈదడంలో గొప్పగా సహాయపడుతూ ఉంటాయి. ఇటువంటి ప్రశ్నలు, అనుమానం వల్ల కలిగే ప్రశ్నలు కావు; జిజ్ఞాస వల్ల కలిగే ప్రశ్నలు. వీటికి తప్పక సమాధానాలు లభిస్తాయి. అటువంటి అద్భుతమైన ప్రశ్న ఒకటి ముండక ఉపనిషత్తులో దర్శనమిస్తుంది. అది ఈ క్రింది విధంగా ఉంది:


शौनको ह वै महाशालोऽङ्गिरसं विधिवदुपसन्नः पप्रच्छ ।

 कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति ॥ 1.1.3 ॥

శౌనకో హ వై మహాశాలోంగీరసం విధివదుపసన్నః  పప్రచ్ఛ | 

కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి ||1.1.3.||


పైన పేర్కొన్న శ్లోకం ముండకోపనిషత్తులోని మొదటి ఖండంలోని 3 వ శ్లోకం. ఇక్కడ శౌనకుడనే గొప్ప గృహస్థుడు అంగీరస మహర్షిని సమీపించి అడిగిన అద్భుతమైన ప్రశ్న - ఓ భగవాన్, ఏది తెలుసుకుంటే ఈ సర్వాన్నీ  తెలుసుకోగలుగుతాం? 

ఇది శిష్యుడికి కలిగిన అద్భుతమైన ప్రశ్న. ఇటువంటి ప్రశ్నే ఆదిశంకరులవారు రచించిన వివేకచూడామణి గ్రంథంలో కూడా ఒక శిష్యుడు గురువును ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు ఎవరికి వారు సమాధానం వెతుక్కుందాం. 


 



24, జనవరి 2024, బుధవారం

బాబూజీ ఆధ్యాత్మిక జీవనం

 


బాబూజీ ఆధ్యాత్మిక జీవనం 

బాబూజీ 1922 వ సంవత్సరంలో జూన్ 3 న గురుదేవులు లాలాజీ పాదాల చెంతకు  చేరి మొట్టమొదటిసారిగా  ప్రాణాహుతి ప్రసరణ స్వీకరించడం జరిగింది. దాని ప్రభావం చేత అలౌకిక వాతావరణంలోకి ప్రవేశించి, ఆ స్థితిని కూడా దాటి వెళ్ళిన అనుభూతిని చెందారు. ఈ స్థితి ఇలాగే కొన్ని రోజులు కొనసాగింది. 

గురుదేవుల రూపాన్ని హృదయంలో దర్శిస్తూ ధ్యాన సాధన ప్రారంభించారు. ఈ సంకల్పం వారిలో సహజంగా స్వాభావికంగా తనంతట తానుగా కలిగింది. దానినే కొనసాగించారు. 

ఈ ధ్యానసాధనను మనస్ఫూర్తిగా అనుసరించిన ఆరు నెలలలోనే వారి హృదయమంతా వెలుగుతో నిండినట్లు ధ్యానంలో దర్శించారు. మరొక ఆరు నెలల తరువాత విచిత్రంగా వారి హృదయం 'ఓం' కార జపం చేయడం ప్రారంభించింది. దీన్నే 'అజపం' అంటారు. కొందరు ఈ ఆజపాన్ని హృదయంలో అనేకమార్లు మంత్రజపం చేసి సాధిస్తారు. ఇది కృత్రిమమైన పద్ధతి. గురువుకు ప్రాణాహుతి శక్తి ఉన్నప్పుడే నిజమైన 'అజపం' అవస్థ లభించగలదు. 

బాబూజీలో 'అజపం' సిద్ధించిన గర్వం కలుగగానే, గురుదేవులు వారిలో జ్ఞానోదయం కలుగజేసిన తరువాత ఆధ్యాత్మికంగా ఎంత అగాథ సాగరాన్ని ఈదవలసి ఉందో అర్థమయ్యింది. 

1924 లో చేతన-అచేతన పదార్థాల్లోనూ, అణువణువునా, అంతటా వ్యాపించి ఉన్న శక్తిని అనుభూతి చెందారు. పగటి వెలుగులా పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నడన్న సత్యాన్ని అనుభవించారు. 

ధ్యానకాలంలో వారి అంతరంగంలో జరిగిన మరొక మార్పు - పరమాత్మను గురించిన భావం తొలగిపోయి, ఆ స్థానంలో కేవలం తన గురుదేవులకు మాత్రమే స్థానం ఏర్పడటం, ఆ తరువాత వారికి వారి గురుదేవులు లాలాజీ తప్ప మరొకరు లేరు ఆయన జీవితంలో. వారిలో మరి ఏ భావానికి తయావుండేది కాదు. చివరికి లాలాజీ మాటల్లో బాబూజీ సాధించిన స్థితి ఎలాంటిదంటే: 

"నేను 'నీవుగా' అయిపోయాను. నీవు 'నేనుగా' అయిపోయావు. ఇక నేను 'నీవు' గాక, నీవు 'నేను' గాక వేరని ఎవ్వరూ అనలేరు."

బాబూజీ ప్రతి సంవత్సరం జరిపే ఆధ్యాత్మిక సమ్మేళనంలో లాలాజీ స్థితి వంటి బ్రహ్మైక్య స్థితిని సాధించారు. అటువంటి దివ్యానుభవం బాబూజీకి మూడు మార్లు జరిగింది. 

లాలాజీ బాబూజీకి ప్రాణాహుతి ప్రసరణ చేసిన మొదటి రోజు నుండి వారి స్మరణ ప్రారంభమైపోయింది. వారి సాధనలో మూడు పనులు ఒకేసారి జరుగుతూ ఉండేవి. 
1) గురుదేవుల నిరంతర స్మరణ 
2) గురుదేవులకున్న లయావస్థకు అనుగుణంగా వారిని వారు సవరించుకోవడం 
3) తాను ప్రస్తుతం ఉన్న స్థితిని తెలుసుకుని, దాని అనుభూతిని పొందడం. 

కొంతకాలం తన గురుదేవుల రూపం, మరికొంతకాలం తరువాత రూపం పోయి, భావనగా మారి, మరికొంతకాలం తరువాత ఆ భావన కూడా అదృశ్యమై కేవలం బీజమాత్రపు భావనగా మారిపోయింది. ఇవన్నీ బాబూజీ, సహజంగా పొందిన అనుభూతులే. చివరి స్థితిలో తానే 'మాస్టర్', ఈ శరీరం, అవయవాలు మొదలైనవన్నీ 'ఆయనవి' అన్న స్థితి. ఆ తరువాత స్థితిలో ఇవన్నీ కూడా తనవి కావని, తన ఆత్మ తన మాస్టర్ యందే ఉందన్న స్థితి. ఈ స్థితిలో శారీరక చేతన ఉండేది కాదు. ఆత్మ చేతన కూడా ఉండేది కాదు. సర్వత్రా, రాళ్ళల్లోనూ, చెట్లు, చేమల్లోనూ, కూడా దివ్యత్వాన్ని దర్శించగలుగుతూ, ముళ్లను సైతం హత్తుకోగలిగే స్థితి ఉండేది. 

1931, ఆగష్ట్ 15, ఉదయాన, బాబూజీ లోనికి అద్వితీయ శక్తిని, బలాన్ని, తన గురుదేవులు ప్రవేశింపజేసిన అనుభూతిని పొందడం జరుగుతుంది. ఆ రోజే లాలాజీ మహాసమాధి పొందిన రోజు. అందుకే లాలాజీ శక్తులన్నీ బాబూజీలో లయమవడం వారికి ఆ అనుభూతి కలిగింది. 

బాబూజీలో లాలాజీ లయమైన తదనంతరం, కొన్ని నెలల తరువాత, లాలాజీ బాబూజీకి ప్రాణాహుతి ప్రసరణ చేసినందువల్ల, తనలోని అణువణువులోనూ లాలాజీని దర్శించగలిగారు. ఇది అత్యంత ఉన్నత స్థితి. ఈ స్థితి కోసమే మహర్షులందరూ తపించేవారు. ఇది బాబూజీ తన మాస్టరులో సంపూర్ణంగా లయమైన స్థితి. 

బాబూజీ ఇల్లు - వాతావరణం


బాబూజీ ఇల్లు - వాతావరణం 

బాబూజీ ఇల్లు ఉత్తర ప్రదేశ్ లోని, షాజహానుపూర్ ఊరు చివర కేరు గంజ్, మోహల్లా దివాన్ జోగ్ రాజ్ అనే ప్రాంతంలో ఉంది. బాబూజీ పూర్వీకులది జమీందారి కుటుంబం. ఆ ఇంటికి ఎత్తైన ప్రహరీ ఉండేది. 

బాబూజీ ఇంటి ద్వారంలోకి ప్రవేశించగానే వాతావరణ మారిపోయి చాలా ప్రత్యేకంగా ఉండేది. ద్వారం బయటి వాతావరణానికి, లోపల వాతావరణానికి గల వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపించేది. వచ్చినవారు ఎంత సున్నితస్వభావులైతే, అంతా స్పష్టంగా ఈ వాతావరణాన్ని అనుభూతి చెందేవారు. "ఈ వాతావరణ ఇలా ఉండటానికి కారణం కేవలం లాలాజీ అనుగ్రహమే. ఇటువంటి వాతావరణంలో ఆధ్యాత్మికంగా ఎవరైనా తవారగా ఎదగగలరు" అని అంటూండేవారు బాబూజీ. "ప్రతీ అభ్యాసి ఈ వాతావరణం తాను ఎక్కడికి వేడితే అక్కడ తన చుట్టూ సృష్టించుకోవాలి. అప్పుడు బాహ్యమైన ఆలోచనలు గాని, పరిసరాల ప్రభావం గాని, మనలను స్పర్శించలేవు. ఇది ఒక కవచంలా కాపాడుతుంది" అని కూడా అనేవారు బాబూజీ. 

ఆ వాతావరణాన్ని వదిలి తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయంలో ప్రతీ హృదయంలోనూ తెలియని ఆవేదన, విరహాబాధ కలిగి అమదరూ చిన్నపిల్లల్లా కంటనీరు పెట్టుకునేవారు. అభ్యాసులకు బాబూజీతో ఎంత స్వల్పకాల సంబంధమైనా సరే, అందరూ ఈ విధంగా అనుభూతి చెందినవారే. అందరికీ వారి నిజమైన నివాసం ఆదేనన్న భావం కలుగుతూ ఉండేది. 

"అభ్యసికి మాస్టరుతో మానవ సంబంధం కలిగిన క్షణం నుండి ఆ సాధకునిపై మాస్టర్ పని ప్రారంభమవుతుంది" అని అంటూండేవారు చారీజీ. 



 

బాబూజీ గృహస్థ జీవనం

 




బాబూజీ గృహస్థ జీవనం 

పక్షి రెండు రెక్కలతో ఎగిరినట్లుగా మనిషి కూడా ఆధ్యాత్మిక జీవనం, భౌతిక జీవనం అనే రెండు రంగాలలో జీవితగమ్యాన్ని సాధించాలన్న సహజమార్గ మూల సిద్ధాంతానికి సజీవ ఉదాహరణగా, స్వయంగా జీవించి చూపించారు, బాబూజీ.

బాబూజీ వివాహం చేసుకుని అందరిలాగే గృహస్థ జీవనంలో ఉండే బాధ్యతలన్నీ స్వీకరించారు. మనం మన జీవితాల్లో అనుభవించే ఆనందం, విచారం, కష్టాలూ, వియోగం, అన్నీ వారు కూడా అనుభవించారు. గృహస్థ జీవనం అంతా పరిపూర్ణంగా జీవిస్తూ కూడా, అదే సమయంలో తనలో ఆధ్యాత్మిక మాస్టరుగా తయారవడానికి అవసరమైన దివ్య సామర్థ్యాలను కూడా పెంపొందించుకోగలగడం చాలా అద్భుతమైన విషయం. 

"భగవంతుడు బ్రహ్మచారికి ఇరవై అడుగుల దూరంలోనూ, సన్న్యాసికి ముప్ఫై అడుగుల దూరంలోనూ ఉంటే, గృహస్థుడి విషయంలో మాత్రం ఆయన అతని హృదయంలోనే నివసిస్తూ ఉంటాడు" అన్న కబీర్ వాక్యానికి సరైన సార్థకత బాబూజీ జీవితం. "మనం ఎప్పుడూ అన్ని వేళల్లోనూ కూడా భగవంతునితో కూడి, భగవంతునిలో ఉండాలి. ఒక్క క్షణం కూడా విడిచి ఉండకూడదు. ఈ స్థితిలో గనుక ఉన్నట్లయితే మనం అన్నీ వేళలా వైరాగ్యంలో ఉన్నట్లే. కాబట్టి భగవంతునితో అనుబంధం, ప్రపంచంతో నిజమైన వైరాగ్యభావాన్ని కలిగిస్తుంది" అని అంటూండేవారు బాబూజీ. 

మన జీవితాల్లో, మన జీవితం ఒక వలయం అనుకుంటే, మన కుటుంబం కేంద్రమయితే, సాధారణంగా మన జీవిత వలయ పరిధీ, కేంద్రము, రెండూ ఒక్కటే - అదే మన కుటుంబం కానీ, బాబూజీ విషయంలో కేంద్రం కుటుంబమే అయినా, వారి వలయ పరిధి మాత్రం యావత్ విశ్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. ఇదీ, మన జీవితాలకు, ఆయన జీవితానికి గల వ్యత్యాసం. 

బాబూజీ జీవితం చూస్తే, ఢాతృత్వం, ఉదారత, ధర్మం, వైరాగ్యం, అనే పదాలకు మనకు అర్థం తెలుసుననుకోవడం మూర్ఖత్వమే అనిపిస్తుంది. మన దగ్గరున్న చిల్లర అడుక్కునేవాళ్ళకిచ్చేసి, కొన్ని రూపాయలు విరాళంగా ఇచ్చేసి, మనకు అక్కరలేని, చినిగిపోయిన దుస్తులిచ్చేసి, మనం దానం చేశామన్న భావనలు మిగుల్చుకుంటాం. అలాగే హోదా కోసం, స్థోమత లేకపోయినా దానం చేస్తాం. ఈ దుస్థితికి కారణాలేమయినా, సరైన మార్గదర్శకత్వం కోసం కొట్టుమిట్టాడుతున్న మానవాళికి, సరైన దిశ, మార్గదర్శకత్వం చూపుతూ బాబూజీ స్వయంగా జీవించి ఆదర్శమయ్యారు. 

ఇటువంటి విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ విధంగా అన్నారొకసారి, "మీరు దానం వేయాలనుకున్నారనుకోండి, దానివలన మీ కుటుంబ కష్టాలకు గురవుతున్నప్పుడు, దాన్ని దానం అని ఎలా అనగలరు?  దానిని నేను మూర్ఖత్వమనే అంటాను. గృహస్థుడిగా నీ ధర్మం ఏమిటి? వివాహం చేసుకుని, గృహస్థునిగా బాధ్యతలఉ స్వీకరించినప్పుడు, నీవు నిర్వర్తించవలసిన కొన్ని ధర్మాలున్నాయి. అవి అనివార్యమైనవి. కాబట్టి మీరు చేసే దానం వల్ల కుటుంబం కష్టాలకు గురవుతోందంటే, అది దానమే కాదు. నిజానికి అటువంటి దానం చేస్తే మీరే స్వయంగా మీ కుటుంబాన్ని దోచుకున్నవారావుతారు. మరి దోపిడీని దానం అని ఎలా అనగలం?" "మరి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆ దానానికి అంగీకరిస్తే, అది సరైన దానం అవుతుందా?" అని చారీజీ ప్రశ్నిస్తారు. "కాదు, అయినా సరే అది సరైన దానం కాదు. ఏ హిందూ స్త్రీ తన భారత కోరికలకు భిన్నంగా వ్యవహరిస్తుంది? అందులోనూ ధార్మిక విషయాలకు అస్సలు అడ్డు చెప్పాడు. నీ ధర్మ ఏమిటో నిర్ణయించుకోవలసినది నువ్వే. ఇతరులను సంప్రదించామంటే, ఆ బాధ్యత ఇతరుల మీద నెట్టే ప్రయత్నమే" అన్నారు బాబూజీ బదులిస్తూ. 

"మరి బిచ్చగాళ్ళకిచ్చే చిన్న-చిన్న దానాల సంగతేమిటి?" అని చారీజీ ఒకసారి ప్రశ్నించారు. బాబూజీ చిరునవ్వు నవ్వేసి, "దాన్ని దానం అంటారా? పేదవారికి అన్నం పెట్టడం, తోటి సోదరులకు బట్టాలివ్వడం, దానం అనిపించుకోడు. అది నీ ధర్మం. కష్టాల్లో ఉన్న నీ సోదరీసోదారులను ఆదుకోవడం మానవులుగా అది మన ధర్మం. దీన్ని ధాతృత్వం, దానం అనడం అనేది సిగ్గుపడవలసిన విషయం."

బాబూజీ 24 గంటలూ కూడా అనూహ్యమైన ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండేవారు. మామూలు స్థితికి వారు అవసరానికి అనుగుణంగా స్పందించేవారు. అటువంటి ఉన్నతస్థితిలో ఉంటూ కూడా గృహస్త ధర్మాలలోనూ, వారి బాధ్యతా నిర్వహణలోనూ ఏ లోటూ చేయలేదు, విస్మరించలేదు. వారికి ఆరుగురు సంతానం. నలుగురు పుత్రులు - ప్రకాష్ చంద్ర సక్సేనా (న్యాయ పట్టభద్రులు), దినేష్ చంద్ర సక్సేనా (మెట్రిక్ వరకూ చదివారు, విధివశాన ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చింది), ఉమేష్ చంద్ర సక్సేనా (ఛార్టర్డ్ అకౌంటెంట్), సర్వేష్ చంద్ర సక్సేనా(పట్టభద్రులు). కుమార్తెలిద్దరు - ఛాయ, మాయ. బాబూజీ అందరినీ చదివించారు, అందరికీ వివాహాలు జరిపించారు. 

బాబూజీ అలవాట్లన్నీ మితంగానే ఉండేవి. భోజనం చేయడంలోనూ, మాట్లాడటంలోనూ, ఖర్చుపెట్టడంలోనూ, మరే ఇతర విషయంలోనైనా సరే, మితం తప్పనిసరిగా పాటించేవారు. జీవితంలో ప్రతీ విషయంలోనూ మితం చాలా ప్రధాన మన్నది వారి ముఖ్య బోధన. వారి జీవితం నుండి మనం ముఖ్యంగా నేర్చుకోవాలసిన అంశం - మితం. 

ఇంట్లో ఖర్చులు, అవసరాలు, అన్నీ స్వయంగా బాబూజీయే  చూసుకునేవారు. వారి ఆతిథ్యం అద్వితీయంగా ఉండేది. అతిథులతో వారు ప్రవర్తించే తీరు, అనుభవించినవారు సౌభాగ్యవంతులు. వారి దగ్గరకు వచ్చినవారిలో ఎక్కువగా వారి ఆధ్యాత్మిక మార్గదర్శకతవాణ్ణే కోరి వచ్చినా, వారందరికీ ముందు కనీస సౌకర్యాలు, వసతి కల్పించేవారు. ప్రాంతాన్ని బట్టి, వారి ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఆతిథ్యం ఇచ్చేవారు. ఉదాహరణకు, దక్షిణాది నుండి వచ్చే అభ్యాసుల కోసం, పెరుగు తెప్పించేవారు, అన్నం వండించేవారు. విదేశీయుల కోసం వేన్నీళ్ళు ఏర్పాటు చేసేవారు. వాళ్ళు తినే పదార్థాలను ప్రత్యేక శ్రద్ధతో అమర్చేవారు. కొంతమంది అభ్యాసుల  రుచులను కూడా దృష్టిలో పెట్టుకుని భోజనం వడ్డించేవారు. కొంతమంది వెల్లుల్లి, ఉల్లి తినేవారు కాదు; వాళ్ళకి అవి లేకుండా వండించేవారు. ఇతరుల అన్నీ రకాల అవసరాలను అతి వేగంగా గ్రహించేవారు. మనుషుల అవసరాలే కాదు, ఇతర జీవరాసుల అవసరాలు కూడా ఇట్టే గమనించేవారు. వెంటనే అందించవలసిన సేవనందించేవారు. ఆయనకోక కుక్క ఉండేది, దానికి భోజనం స్వయంగా ఆయనే పెట్టేవారు. చలికాలంలో దక్షిణాది నుండి వచ్చిన అభ్యాసులకు స్వెటర్లతో సహా  అన్నీ ఇచ్చేవారు. షాజహానుపూర్ ఆశ్రమ నిర్మాణానికి పూర్వం నలుమూలల నుండి వచ్చే అభ్యాసులందరూ ఆయన ఇంట్లోనే ఉండేవారు. ఖర్చులన్నీ వారే భరించేవారు. 






 





23, జనవరి 2024, మంగళవారం

బాబూజీ ఉద్యోగ పర్వం

 


బాబూజీ ఉద్యోగ పర్వం 

జనవరి 1925 వ సంవత్సరంలో సహాజహానుపూర్ జడ్జీ కోర్టులో, గుమాస్తాగా చేరి, 1956 లో రికార్డు కీపర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఉత్తరభారతదేశంలో గుమాస్తానీ 'బాబు" అంటారు. అందుకే రామచంద్ర 'బాబూజీ' అయ్యారు. 'జీ' అంటే గౌరవ సూచకం. 

బాబూజీ నిజాయితీని, సమగ్రమైన సౌశీల్యాన్ని, పనిత్యనాన్ని చూసి, ఉన్నతాధికారులందరూ సంతోషించేవారు. ఆయన పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించేవారు. తోటి గుమాస్తాలతో వారి ప్రవర్తన అసాధారణమైన మంచితనంతో కూడి ఉండేది. 

బాబూజీ ఎప్పుడూ తన స్వలాభం కంటే న్యాయానికి ఉన్నత స్థానం ఇచ్చేవారు. ఉదాహరణకు, వారి సహోద్యోగికి రావలసిన ప్రమోషన్ బాబూజీకి ఇచ్చారు. అప్పుడా ఉద్యోగి తన సీనియారిటీని, ఉద్యోగం భర్తీ అయిన తేదీ నుండి గణించాలనీ, ఆ విధంగా చూసినట్లయితే, ప్రమోషన్ తనకే రావాలని అర్జీ పెట్టుకున్నాడు. బాబూజీ అంటే మక్కువా, సదభిప్రాయము ఉన్న ఉన్నతాధికారులు బాబూజీని పిలిచి అభిప్రాయం అడుగుతారు. ఆ ప్రమోషన్ వల్ల ఆయనకు గణనీయమైన లాభం ఉన్నా కూడా, అర్జీ పెట్టుకున్న ఆ ఉద్యోగయికే ఆ ప్రమోషన్ దక్కడమే న్యాయం అని బాబూజీ చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ ఉద్యోగికి ప్రమోషన్ ఇస్తారు. అప్పటి నుండి బాబూజీ అంటే ఆ ఉద్యోగికి అమితమైన గౌరవం ఏర్పడుతుంది. 

వారికేదైనా సమస్య వస్తే, క్రింద నుండి పై అధికారుల వరకూ అందరూ వారికి సహకరించేవారు. బాబూజీ యేదైనా వ్రాస్తే, అధికారులు చదవకుండానే నిస్సంకోచంగా సంతకాలు పెట్టేసేవారు. బాబూజీ కూడా చాలా జాగ్రత్తగా, విశ్వాసంతో డ్రాఫ్టు చేసేవారు. 

బాబూజీ తనకు ద్రోహం తలపెట్టిన వ్యక్తి పట్ల కూడా ఎటువంటి శతృత్వం లేకుండా, అతనితో ఎప్పటిలాగే అందరితో ప్రవర్తించినట్లే వ్యవహరిస్తూండేవారు. నిజానికి ఆ వ్యక్తి పట్ల ప్రేమ కూడా ఉండేది. "ఎవరైనా వారి ధర్మం వారు నిర్వహించకపోతే, నేను వారి పట్ల నిర్వహించవలసిన ధర్మాన్ని ఎందుకు విస్మరించాలి?" అన్న సిద్ధాంతం వారిది. 

నేను మీ పట్ల చేస్తున్నది నా ధర్మం, మీరు నా పట్ల ఏమి చేయడం లేదో అది మీ ధర్మం - అని అంటూండేవారు బాబూజీ. దీన్ని అనేకరకాలుగా అర్థం చేసుకోవాలి. 

"ఎవరైనా ఏదైనా మేలు చేస్తే, ఆ ఋణం తీర్చుకోడానికి ప్రయత్నించేవాడిని. కానీ పొందిన మేలుకు నేనెంతగా తిరిగి చేసినా, ఆ ఋణం అలాగే ఉంటుంది" అని అనుకునే స్వభావం బాబూజీది. 

బాబూజీపై ఉన్నతాధికారులు వారి సచ్ఛీలతను గురించి అధికారిక పుస్తకాలలో వ్రాసినవి ఈ విధంగా ఉన్నాయి:
"ఆయన పనితనం నాకు పూర్తిగా సంతృప్తినిచ్చింది. ఆయన నెమ్మదిగా ఉండే వ్యక్తి. పని చాలా బాగా చేస్తాడు." 
"ఇతను చాలా సమర్థుడు; శ్రమజీవి. అతని పని నాకు సంతృప్తికరంగా ఉంది. అతనిలో నిజాయితీ, మంచి పేరు, అసూయ కలిగించేంతగా ఉన్నాయి."
"రికార్డు కీపర్ గా అతను చేసిన పని చాలా సంతృప్తికరంగా ఉంది. అతను శ్రమజీవి, జాగ్రత్తగా పని చేసే వ్యక్తి. అతనికి మంచి నిజాయితీపరుడని పేరు కూడా ఉంది."
"సమర్థుడు, నిగర్వి, నిజాయితీపరుడన్న పేరు గలవాడు."
"సాధుజీవనం అంటే విశ్వాసం గలవాడు. అంతేగాక ఈ సూత్రాన్ని అధికారిక జీవనంలో కూడా అమలు జరిపిన వ్యక్తి."
"నిగర్వి, నిశ్శబ్దంగా పని చేసుకుపోయే ఉద్యోగి. సాధుజీవనం గడిపే పేరున్న వ్యక్తి."
"ఇతను సాధుజీవనం గడుపుతూ, నిత్యజీవిత వ్యవహారాలలో కూడా ఉన్నతమైన సిద్ధాంతాలకు బద్ధుడై జీవించేవాడు. రికార్డు కీపర్ గా తన కర్తవ్యాలన్నీ తెలిసినవాడు. రికార్డు రూమును, సక్రమంగా ఉంచడంలో సమర్థుడు. అతని పని నాకు పూర్తిగా సంతృప్తినిచ్చింది."
పదవీ విరమణ సమయంలో, "ఇతరుల్లో అసూయమ కలిగించేమతగా నిజాయితీ, క్రమశిక్షణ గలవాడని పేరు సంపాదించిన వ్యక్తి. చాలా జాగ్రత్తగా అస్సలు గర్వం లేకుండా పని చేసేవారు. మిగిలిన సిబ్బందికి వారు ఒక ఆదర్శ ఉద్యోగి అని చెప్పాలి. వారి పదవీ విరమణ, సిబ్బందిలో తీరని లోటును కలిగిస్తుంది."







22, జనవరి 2024, సోమవారం

యువ బాబూజీ

 


యువ బాబూజీ 

బాబూజీ వయసు 14 సంవత్సరాలున్నప్పుడే తనలో ఒక వింతైన ఘ్రాణ శక్తి పెంపొందడం గమనించారు. తాను ధరించే దుస్తులను కేవలం వాసనతో గుర్తు పట్టేసేవారు. ఈ శక్తి మరింతగా పెరిగి, మనిషి స్వభావాన్ని, అతని తత్త్వాన్నీ వారి శ్వాస నుండి వచ్చే వాసనతో కనిపెట్టేసేవారు. 

కొంతకాలం తరువాత వేదాంతం అంటే ఆసక్తి పెరిగి, మనిషి ఉనికికి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను తనదైన రీతిలో ఆలోచించడం ప్రారంభించారు. 15 సంవత్సరాల వయసులోనే వారికి తాత్త్విక గ్రంథాలను చదవాలన్న సంకల్పం కలిగింది. మిల్ అనే ఆంగ్లేయుడు వ్రాసిన "యుటిలిటేరియానిజం" అనే గ్రంథాన్ని తెప్పించుకున్నారు. దానిలో కొన్ని పుటలు చదవగానే వారికోక ఆలోచన వచ్చింది. "నేను గనుక ఈ విధంగా చదువుకుంటూ పోతే, నా సహజమైన ఆలోచనా ధోరణిపోయి, ఇతరుల భావాలు ఉటంకించడమే సరిపోతుంది" అన్న నిర్ధారణకు వచ్చి, ఆ గ్రంథాన్ని మూసేసి, తన స్వంత ఆలోచనా శక్తిని పెంపొందించుకోసాగారు. 

వారి చిన్నప్పటి నుండీ వారిని చూసినవారు, అది బంధువులు కావచ్చు, ఇతరులు కావచ్చు, ఆయనను 'మొద్దు' అనుకునేవారు. బాబూజీ సాధు స్వభావులు. పెద్దయిన తరువాత వారిని సరళ స్వభావం కలిగిన మనిషి అనేవారందరూ. 

వారి విద్యాభ్యాస సమయంలో మెస్మరిజం తెలిసిన స్నేహితుడు తన విద్యతో రోగాలు నయం చేస్తూండేవారు. అది చూసి దాని గురించి ఆలోచించడం ప్రారంభించారు. ఏకాగ్రతతో, ఆలోచనాశక్తి సహాయంతో శక్తిని కదిలిస్తారని, ఆ విద్య గురించి అర్థమయ్యింది. తాత్త్విక చింతనతో నిండిన మనస్సుతో, సాధారణంగా సరైన నిర్ధారణకు రాయగలిగే సమర్థత అప్పటికే ఏర్పడినందువల్ల, ఆ మనసు సహాయంతో వారు రోగుల వ్యాధులు నయం చేయడం ప్రారంభించారు. 

ఒకసారి పాఠశాలలో వారి హెడ్ మాస్టర్ గారికి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తే, బాబూజీ తన బ్రొటనవేళ్ళతో ఆ హెడ్ మాస్టర్ బ్రొటనవేళ్ళు నొక్కుతూ, "మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు" అన్న ఆలోచనతో ' విద్యుచ్ఛక్తి ప్రసారం చేశారు. వెంటనే నొప్పి పోయి, ఆ హెడ్మాస్టర్ నిద్రలోకి జారుకున్నారు. అప్పటి నుండి స్కూల్లో పిల్లలకు గాని, పెద్దలకు గాని ఏదైనా అయితే, "రామచంద్ర వద్దకు వెళ్ళండి, ఆయన నయం చేస్తాడు" అనేవారు ఆ హెడ్ మాస్టర్. 

బాబూజీ చిన్నతనంలో మంచి హాకీ ఆటగాడు. తన క్లాసు జట్టుకు కెప్టెన్ గా ఉండేవారు. ఒకసారి స్కూల్లో తీరిక సమయంలో ఆడుకోవడానికి సామాను ఇవ్వమంటే, హెడ్ మాస్టర్ తిరస్కరించడం జరుగుతుంది. దానితో బాబూజీ ఆటలకు స్వస్తి చెప్పడం జరుగుతుంది. అది కూడా తన మంచికే జరిగిందనుకున్నారు బాబూజీ. 

బాబూజీ ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్షలో ఉత్తీర్ణులై జనవరి 12, 1925 లో సహాజహానుపూరులో కోర్టులో గుమాస్తాగా ఉద్యోగంలో చేరారు. 19 సంవత్సరాల వయసులోనే వారికి భగవతి అనే యువతితో వివాహం జరిగింది. ఆమెకు కోపం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో బాబూజీకి కూడా కోపం ఎక్కువగానే ఉండేది. కానీ, ఆమె సహచర్యంలో సహనం బాగా అలవడిందని అంటూండేవారు. అది వారి ఆధ్యాత్మిక పురోగతికి కూడా బాగా దోహదం చేసిందని అంటూండేవారు. 

బాబూజీ బాల్యం

 

బాబూజీ బాల్యం 

1899 వ సంవత్సరం ఏమప్రిల్ 30 వ తేదీన, ఉదయం 7 గంటల 26 నిముషాలకు సహాజహానుపూర్ లో, ఒక కాయస్థా కుటుంబంలో జన్మించారు శ్రీరామచంద్రజీ. వారి తండ్రిగారి పేరు రాయబహద్దూర్  శ్రీ బడరీ ప్రసాద్ జీ; ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గా పని చేసేవారు. 

శ్రీరామచంద్రజీ ఆధ్యాత్మిక తృష్ణ ఆరు సంవత్సరముల ప్రాయంలోనే కనపించింది. వారి తల్లిగారు సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూండేవారు. పూజలు ఎలా చేయాలో ఆమెను అడిగి తెలుసుకుంటూ ఉండేవారు. అప్పుడు వారి తల్లిగారు బాబూజీ నుదుటిమీద గంధం పూస్తూ ఉండేవారు. బాబూజీ పూజ చేసినంతగా ఆనందించేవారు. అలా కొంతకాలం సాగింది. 

తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఈ సృష్టికి మూలకారణమైన ఆ మూల తత్త్వాన్ని, పరతత్త్వాన్ని తెలుసుకోవాలన్న ఆధ్యాత్మిక తృష్ణ తీవ్రంగా కలిగింది ఆయనలో. నీటిలో మునిగిపోతున్నవాడు ప్రయాణం కోసం ఎంతగా పరితపిస్తాడో, ఆ సత్యతత్త్వాన్ని తెలుసుకోవాలన్న తపన వారిలో అంతా తీవ్రంగా ఉండేది. ఆ తరువాత భగవద్గీత చదవడం ప్రారంభించారు. కానీ, వారు తపిస్తున్న విషయం అందులో కూడా కనిపించ లేదు. 

సాక్షాత్కారం కోసం వారి కుటుంబ పురోహితుని ఏదైనా ఆరాధనా పద్ధతిని సూచించమని కోరారు. ఆ పురోహితుడు రామనామం జపించమని సూచించాడు. నిర్దిష్ట సమయంలో ఏడు రోజులు ఈ జపాన్ని కొనసాగించారు. ప్రయోజనం లేకపోయింది. తనలో పరివర్తన కనబడకపోవడంతో ఆపేశారు. 

ఆ తరువాత విగ్రహారాధన ప్రారంభించారు. దీని వలన పురోగతికి బదులుగా తిరోగతిని గమనించి, దానిని కూడా విడిచిపెట్టారు. 

ఈ ప్రక్రియలేవీ కూడా వారి తృష్ణను తృప్తి పరచలేదు. ఈ అయోమయ గందరగోళ పరిస్థితి వారికి 14 సంవత్సరాలు వచ్చే వరకూ కొనసాగింది. సరైన సమర్థుడైన గురువు కోసం 24 గంటలూ ప్రార్థిస్తూ ఉండేవారు. అంతే కాదు, ఎవరి వద్దకయినా ఈ భావంతో గనుక వెళ్ళడం జరిగితే, వారినే తన మాస్టరుగా స్వీకరించాలని సంకల్పించుకున్నారు. 



అనంత శ్రీరామ తత్త్వ ధ్యానం

 




అనంత శ్రీరామ తత్త్వ ధ్యానం 

అయోధ్యలో 5 శతాబ్దాల తరువాత శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగే ఈ శుభసందర్భాన, భారతదేశమే గాక సకల విశ్వమూ రాముని ధ్యాసలో నిమగ్నమైన తరుణంలో, మర్యాదా -పురుషోత్తం రామ్ అని పిలవబడే శ్రీరామచంద్రుని, రామో విగ్రహవాన్ ధర్మః అన్న శ్రీరాముని అపూర్వమైన, అమేయమైన, అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని, సనాతనమైన శ్రీరామ తత్త్వాన్ని   ధ్యానించే ప్రయత్నం చేద్దాం. 
శ్రీరాముని తత్త్వాన్ని, ఆయన సద్గుణాలను, వ్యక్తిత్వాన్ని, ధర్మనిష్ఠను, ఆయన స్థితప్రజ్ఞత్వాన్ని, అన్నిపరిస్థితుల్లోనూ తన మానసిక సంతులనాన్ని కోల్పోకుండా ఆ సమత్వ స్థితిలో ఉండటాన్ని, క్షమ, కరుణ ఇత్యాది గుణాలను,  ప్రాణ ప్రతిష్ఠ కంటే కూడా, ప్రాణాహుతి సహాయంతో ధ్యానించడం ద్వారా మనలో అలవడే   అవకాశం ఉందంటున్నారు మన పూజ్య గురుదేవులు దాజీ. 
శ్రీరాముడు పితృవాక్య పరిపాలనా దక్షుడైన ఒక తనయుడిగా, తన రాజ్యంలో పరిపూర్ణ సామరస్యం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పణంగా పెట్టిన అపూర్వ చక్రవర్తిగా, పరిపాలకుడిగా,  శత్రువును కూడా క్షమించి అక్కున జేర్చుకోగలిగిన విశాల హృదయుడిగా, ఒక ఆదర్శ భర్తగా, తండ్రిగా, అన్నగా ఇలా అన్నీ పాత్రల్లోనూ ఆదర్శంగా ఉండినటువంటి లక్షణాలను మనం ధ్యానం ద్వారానే మన చేతనలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు దాజీ. ప్రధానంగా హార్ట్ఫుల్నెస్  యౌగిక ప్రక్రియలు ఆధునిక మానవులకు, ఈ సంసార సాగరాన్ని తేలికగా ఈదడానికి, జీవిత పరమార్థాన్ని సాధించడానికి, యథార్థ జీవిత గమ్యాన్ని చేరుకోడానికి, అందరికీ అవసరమయ్యే ఈ సద్గుణాలను సరళంగా అందుబాటులోకి తీసుకు వస్తాయంటారు మన మాస్టర్లు. ప్రతీ పౌరుడూ రాముడిలా ఉన్నప్పుడే అందరూ కోరుకునే రామరాజ్యం సాధ్యపడుతుంది. నిజమైన అర్థంలో ఆ దిశగానే మన హార్ట్ఫుల్నెస్ ఉద్యమం తన వంతు కృషి కొనసాగిస్తున్నది। 
వారి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని, వారిలోని దివ్యత్వానికి తోడ్పడిన యోగవాసిష్ఠం, (దీన్నే వశిష్ఠ సంహిత అని కూడా అంటారు)  శ్రీరాముడు స్వయంగా బోధించిన రామగీత, ప్రతీ సాధకుడూ అధ్యయనం చేయవలసిన, మనకు అందుబాటులో ఉన్న ఉద్గ్రంథాలు.  
సంపూర్ణ ప్రయత్నం చేసి చూద్దాం. 

19, జనవరి 2024, శుక్రవారం

బాబూజీ భౌతిక స్వరూపం

 


బాబూజీ భౌతిక స్వరూపం 

బాబూజీ స్వరూపం అతి సామాన్యంగానూ, నిరాడంబరంగానూ, దివ్యంగానూ, అణువణువునా సరళయత్వం ఉట్టిపడుతూ ఉండేది. ఆయనది 5 అడుగులకు కొంచెం ఎత్తుగా ఉండే విగ్రహం. విశాలమైన నుదురు, పెద్ద చెవులు, గడ్డం, మీసం, బట్టతల, తలవెనుక ఒక చిన్ని పిలక, అతీసున్నితమైన గులాబీరంగులో ఉండే పాదాలు, కుడిచేతికి రెండు ఉంగరాలు, క్రింద పంచే, పైన లాల్చీ, చాలికాలమైతే ఆ లాల్చీపైన ఒక చిన్న కోటు కానీ, స్వెటరు గాని వేసుకునేవారు. ఇదీ అందరికీ కనిపించే బాబూజీ విగ్రహం. 
బాబూజీ కళ్ళు చాలా ప్రత్యేకంగా ఉండేవి. వాటిని చారీజీ మాటల్లోనే వివరించాలి. "నేను చూసిన అతిలోతైన కళ్ళవి. సాధారణంగా మనుషుల కళ్ళల్లోని లోతుకు ఒక హడదుంటుంది. కొన్ని కళ్ళయితే ఏమాత్రం పారదర్శకత లేకుండా ఉంటాయి. పై కనుగుడ్డు తప్ప మరేమీ కనిపించదు. కానీ, బాబూజీ కళ్ళు మాత్రం, వాటిని చూస్తే, ఆ కళ్ళ వెనుక ఉన్నది ఒక దివ్యప్రపంచానికి దారేమో అన్నట్లుగా ఉండేవి. ఆయన కళ్ళల్లోకి చూస్తే, స్పష్టమైన నీలి ఆకాశాన్ని చూస్తున్న హాయి కలిగేది. ఆయన కళ్ళల్లోనే మొత్తం సృష్టి అంతా ఇమిడి ఉన్నట్లుగా నాకు తోచింది. కృష్ణుని నోట్లో యశోదా మాట సృష్టి మొత్తం చూసిందనే పురాణ గాథలు నిజమేనని తేలికగా నమమేటలుగా ఉన్నాయి ఆ కళ్ళు."
బాబూజీ ఎక్కువగా తెల్లాడుస్తులే ధరించేవారు. చాలా సాధారణ దుస్తులే అయినప్పటికీ పరిశుభ్రమైన దుస్తులే వేసుకునేవారు. చూడటానికి అతిసామాన్యంగా, నిరాడంబరంగా, సరళంగా ఉండేవారు. ప్రత్యేకమైన సందర్భాల్లోనూ, ఎవరినైనా కాలవాలనుకున్నప్పుడు, ఉన్నత హోదా కలిగిన వ్యక్తులు వారిని కలవడానికి వచ్చినప్పుడు, తలపై తెల్ల టోపీ, మెడ దగ్గర నుండి మోకాళ్ళ వరకూ ఉండే కోటు, క్రింద పైజామా లేక ప్యాంటు వేసుకుని మర్యాదగా హుందాగా కనిపించేవారు. 
బాబూజీ శరీరం అతి మృదువైన, అతి మెత్తనాయిన శరీరం. పాదాలను 'పాదపద్మములు' అని ఎందుకు వర్ణిస్తారో అర్థమయ్యే విధంగా, వారి పాదాలు తామరరేకుల్లా చాలా మెత్తగా ఎర్రగా ఉండేవి. చుట్టూ ఉన్నవారిలోనే గాక, వాతావరణంలో కూడా పులకరింతను కలిగించేది వారి చిరునవ్వు. వారి చేతిలో హుక్కాయతో, వాలుకుర్చీ మీద కూర్చొని హుక్కా పీలుస్తూ ఉంటే, అది మనసుకు ఆధ్యాత్మికానందాన్ని కలుగజేసే దివ్యదృశ్యంగాఉండేది. బాబూజీ నిరంతర సాంగత్య భాగ్యం కలిగిన ఆ హుక్కా అదృష్టం ఎంతటిదో! 



బాబూజీ స్పష్టీకరణలు - 11


బాబూజీ స్పష్టీకరణలు - 11 

I serve in a corrupt organization. Everywhere I am surrounded by corrupt people. How can I practice this spiritual path?
These are individual problems, and individual solutions are to be worked out.
Feel yourself interested with higher things and the lower ones will go away automatically. Put your will on the achievement of the higher and the lower will drop off.
నేను ఆవినీతితో నిండిన సంస్థలో పని చేస్తున్నాను. నా చుట్టూ ఆవినీతిపరులే  ఉన్నారు. నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎలా అనుసరించగలుగుతాను? 
ఇవి వ్యక్తిగత సమస్యలు, వీటిని వ్యక్తిగతంగానే పరిష్కారాలు వెతుక్కోవాలి. 
ఉన్నతమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకోండి; అల్పమైనవి వాటంతట అవే తొలగిపోతాయి. ఉన్నతమైన వాటిపై దృష్టిని నిలిపితే, సంకల్పాన్ని ఉంచితే, అల్పమైనవి వాటంత అవే రాలిపోతాయి.  
*
I am surrounded by material life throughout the day. I cannot focus my mind on the higher thought. What should I do?
Have the company of saintly persons. 
నా చుట్టూ రోజంతా భౌతిక జీవనమే ఉంటుంది. ఉన్నత విషయాలపై దృష్టిని నిలపలేను. నేనేం చేయాలి?
సాధుస్వభావం గల వ్యక్తుల సాంగత్యంలో ఉండటానికి ప్రయత్నించు. 
*
I cannot get the company of such saintly persons.
Have the company of the Personality who has no personality.
అటువంటి సాధఊపురుషుల సాంగత్యం నాకు లభించదు.  
వ్యక్తిత్వమే లేని వ్యక్తిత్వం యొక్క సాంగత్యంలో ఉండు. 
*
That comes only by God's grace.
Then pray for it. You have answered your question yourself.
అది భగవదనుగ్రహం వల్లే  ఏర్పడాలి. 
అయితే ప్రార్థించు. నీ ప్రశ్నకు నీవే స్వయంగా సమాధానం చెప్పుకున్నావు. 
*


 

18, జనవరి 2024, గురువారం

బాబూజీ స్పష్టీకరణలు - 10

 


బాబూజీ స్పష్టీకరణలు - 10 

How universal love can be achieved?
The real thing is to transfer all love to God. Remembrance of one brings remembrance of all. If I love you, I love your children also. There is a society which has been preaching Universal love for the last 40 years, but there is no success. Why? It is because of hatred in the heart. Remove hatred and love will develop by itself. So you should not work on it, but on its base.
విశ్వసౌభ్రాతృత్వం సాధించాలంటే ఎలా?
అసలు విషయం ఏమిటంటే మన ప్రేమనంతటినీ భగవంతునిపై బదిలీ చేయాలి. ఒకరిని స్మరిస్తే అందరూ స్మరణలోకి వస్తారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తే, మీ పిల్లలను కూడా ప్రేమిస్తాను.  గత 40 సంవత్సరాలుగా ఒక సంస్థ విశ్వమానవ ప్రేమను బోధిస్తూ ఉంది, కానీ సఫలం కాలేదు. ఎందుకని? హృదయంలో ద్వేషం ఉండటం వల్ల. ద్వేషాన్ని తొలగించేస్తే ప్రేమ తనంతతానుగా పెంపొందుతుంది. కాబట్టి దాని మీద పని చేయడం కాదు, దాని మూలం మీద పని చెయ్యాలి.  
*
What is the purpose of human being, of human existence?
The purpose is only Realisation, or to realise one's own nature which is Divine.
మనిషి ప్రయోజనం ఏమిటి, మనిషి అస్తిత్వం యొక్క ప్రయోజనం ఏమిటి? 
సాక్షాత్కారమే అసలు ప్రయోజనం. తన నిజ స్వభావమైన దివ్యత్వాన్ని సాక్షాత్కరించుకోవాడమే మనిషి ప్రయోజనం 
*
What is life?
Well, there are many definitions. But I tell my own definition. Life in life is the real life. 
జీవితం అంటే ఏమిటి?
చాలా నిర్వచనాలున్నాయి కానీ నేను నా స్వంత నిర్వకహనం చెప్తాను. జీవంలో జీవమే నిజమైన జీవితం. 
*
The words "Freedom" and "to be free", what do they mean?
Freedom is when you are free from freedom. Yes, the real freedom is when you are free from freedom.
"విముక్తి", "స్వేచ్ఛగా ఉండటం" వీటి అర్థం ఏమిటి?
విముక్తి నుండి విడుదలవడమే విముక్తి. అవును, నిజమైన విముక్తి అంటే మీరు విముక్తి నుండి విడుదలవడమే. 
*
What is the moral of man? 
To think of higher things - that is the moral of man. When you think of it you will also have it. Try for it. I feel that civilisation in all countries must be modified withing 10 years. Can you tell me what is the greatest foolishness of man? I will tell you. We always think of the past but forget to build the future. That is our great foolishness.
మనిషి యొక్క నీతి ఏమిటి?
ఉన్నత విషయాలను గురించి ఆలోచించడం - అదే మనిషి యొక్క నీతి. ఆలోచిస్తే దాన్ని పొందుతారు కూడా. ప్రయత్నించండి. రానున్న 10 సంవత్సరాలలో నాగరికత మారబోతోంది. మనిషిలో ఉండే అతి పెద్ద మూర్ఖత్వం ఏమిటో చెప్పగలరా? నేను చెప్తాను. ఎప్పుడూ గతాన్ని గురించే ఆలోచిస్తూ భవిష్యత్తును నిర్మాణం చేసుకోపోవడం. అదే మనలో ఉండే గొప్ప మూర్ఖత్వం. 
*
Are will and desire different?
Desire at its own place is bad, but if it is properly moulded it is good. We are using desire wrongly. Will is the process to obtain the object of desire.
సంకల్పము, కోరిక - రెండూ వేర్వేరా? 
కోరిక తన స్థానంలో చూస్తే చెడడదే, కానీ దాని సక్రమంగా మాలచుకోగలిగితే మంచిదే అవుతుంది. మనం కోరికను తప్పుడు విధంగా ఉపయోగిస్తున్నాం. కోరికను నెరవేర్చుకునే ప్రక్రియను సంకల్పం అంటారు.  
*
What is wisdom?
It is the proper utlisation of the power of God.
విజ్ఞత అంటే ఏమిటి? 
దైవశక్తిని సక్రమంగా వినియోగించడమే విజ్ఞత. 
*
What is your opinion about Sannyasa?
Sannayasa is not necessary. 
సన్న్యాసంపై మీ అభిప్రాయం? 
సన్న్యాసం అవసరం లేదు. 
*
Master, what about eating?
I am giving you a cooperative reply. I allow it till you can stop these things.
మాస్టర్, మాంసాహారం సంగతేమిటి?
మీకు సహకరించే సమాధానం ఇస్తాను. మీరు ఆపగలిగే వరకూ అనుమతినిస్తున్నాను. 
*



17, జనవరి 2024, బుధవారం

బాబూజీ స్పష్టీకరణలు - 9

 


బాబూజీ స్పష్టీకరణలు  - 9 

Are you a Guru?
I do not think like that. I think myself to be only one of the associates of my own association.
మీరు గురువా? 
నేను అలా అనుకోను. నా స్వంత సమూహంలో ఉన్న సహచరుల్లో నేను కూడా ఒకడినని అనుకుంటాను. 
*
But I think that many people regard you as the Guru or the Master?
Well, they will have to use some word when referring to me. They prefer this word, which I do not like.
కానీ మిమ్మల్ని చాలా మంది గురువు అని, మాస్టర్ అని సంబోధిస్తున్నారు కదా?
సంబోధించడానికి ఏదోక పదం వాడాలి కదా? వాళ్ళు ఈ పదాన్ని ఎంచుకున్నారు. ఆ పదం నాకిష్టం లేదు. 
*
Some say the Guru is inside...
I will tell you. God is the only Guru. All the others are working under His guidance and directions. Really speaking if a man says he is a Guru, he is not fit to train others in spirituality. Such a person is really usurping the position of God.
కొంతమంది గురువు లోపలున్నారంటారు... 
నేను చెప్తున్నాను, కేవలం భగవంతుడు మాత్రమే గురువు. మిగిలినవారందరూ ఆయన మార్గదర్శనంలో, వారి ఆదేశాల మేరకు పని చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే, ఒక వ్యక్తి తనను తాను గురువు అని అనుకుంటే, అతను ఆధ్యాత్మిక శిక్షణనివ్వడానికి అర్హుడు కాడు. అటువంటి వ్యక్తి నిజానికి భగవంతుని స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లవుతుంది. 
*
How did you begin this work that you are doing now?
My Master ordered me to do it, and so I started it. 
మీరిప్పుడు చేస్తున్న పని ఎలా ప్రారంభించారు?
నా మాస్టర్ ఆజ్ఞాపించారు కాబట్టి నేను ప్రారంభించాను. 
*
How did you meet your Master?
It was accidental. I had the idea that I must get a good Master and I prayed for it and I got my Master.
మీరు మీ మాస్టరును ఏ విధంగా కలిశారు? 
ఆకస్మికంగా కలవడం జరిగింది. నాకొక మంచి మాస్టర్ లభించాలనుకునేవాడిని; అందుకోసం ప్రార్థించాను; నాకు దొరికారు కూడా. 
*
Was Lalaji born before this life?
No. That is impossible.
ఈ జన్మకు ముందు లాలాజె  జన్మించడం జరిగిందా?
లేదు. అసాధ్యం. 
*
Do you feel any contact with your Master?
There is contact always. 
మీ మాస్టరుతో సంపర్కం అనుభూతి చెందుతూ ఉంటారా?
ఎల్లవేళలా ఆ సంపర్కం ఉంటుంది. 
*
How?
In the way in which it should be. 
ఎలా?
ఉండవలసిన విధంగా. 
*
You are a spiritual Master, but you smoke?
Yes, I smoke. Why do you worry? I may take poison myself, but if I can give you nectar you should take it. 
మీరు ఆధ్యాత్మిక గురువై ఉండీ పొగత్రాగుతున్నారు?
అవును. నేను పొగ త్రాగుతాను. కానీ నీకెందుకు బాధ? నాకు నేను విషం తీసుకోవచ్చు, కానీ నీకు అమృతం ఇస్తున్నప్పుడు నువ్వు గ్రహించాలి. 
*




ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...