30, మే 2024, గురువారం

బాబూజీ దోమలగుడా యోగాశ్రమం ప్రారంభించి 57 సంవత్సరాలు

 
బాబూజీ దోమలగుడా యోగాశ్రమం ప్రారంభించి 
57 సంవత్సరాలు 



పరమపూజ్య బాబూజీ మహారాజ్ 28.5.1967 న మానవాళి సేవకై ప్రారంభించిన దోమలగుడా ఆశ్రమం, ఇప్పటికి 57 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, దోమలగుడా  ఆశ్రమ బృందం 28.5.2024 న ప్రత్యేకమైన కృతజ్ఞతతో, సుమారు 300 అభ్యాసులు ఇక్కడ సమావేశమై సత్సంగంలో పాల్గొన్నారు. 



ఆ తరువాత సమావేశమైన అభ్యాసులందరూ ఒక కుటుంబ సమావేశంలా కూర్చొని, బాబూజీతోనూ, దోమలగుడా ఆశ్రమంతోనూ తమకున్న అనుభవాలను, అనుబంధాన్ని అందరితో పంచుకోవడం జరిగింది. వాతావరణం అంతా ఆత్మీయతతోనూ, ప్రేమతోనూ, పవిత్రతతోనూ, ప్రశాంతంగానూ, తేలికగానూ ఉండటం ప్రతి ఒక్కరూ అనుభూతి చెందడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఈ యోగాశ్రమం ద్వారా జరిగే సంస్థ కార్యకలాపాలు ఎలా ఉండాలి, యే విధంగా ముందుకు సాగాలి అన్న అంశాలపై విస్తృత చర్చ కూడా జరిగింది. 

ఆ తరువాత అందరూ భోజనం చేసి నిష్క్రమించడం జరిగింది. అందరి ముఖాల్లో ఆనందం, ఒక కొత్త వెలుగును గమనించడం జరిగింది. 
హైదరాబాదు ఆధ్యాత్మికంగా ఒక ధన్యమైన నగరం. పరమ పూజ్య బాబూజీ, చారీజీ పలుమార్లు విచ్చేసిన నగరం. దాజీ ఇక్కడే నివాసం ఉండటం ధన్యతలో పరాకాష్ఠ. అంటే కాదు, బాబూజీ, చారీజీ, దాజీలు, ముగ్గురూ తలొక ఆశ్రమ నిర్మాణం ఇక్కడ హైదరాబాదులో చేయడం జరిగింది. ప్రపంచంలో మరెక్కడా, యే నాగరంలోనూ ఇలా నిర్మించడం జరగలేదు. హదరాబాదు అభ్యాసులపై మహత్తరమైన బాధ్యతలనుమచ్చారు మన మాస్టర్లు. ఆ బాధ్యతలకు తగ్గట్టుగా మానందరమూ జీవించాలని, గురుపరంపర మెప్పు పొందే దిశలో మన జీవితాలుండాలని ప్రార్థిస్తున్నాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  Eight Rules for Spiritual Gatherings Master told me the following things to be observed during Bhandara (Spiritual Congregation) Everyone ...