బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 23
సహజమార్గ యాత్ర - చక్రాలు/బిందువులు/గ్రంథులు
బాబూజీ ఆవిష్కరించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథంలో 13 చక్రాలు లేక బిందువులు లేక గ్రంథులు ఉన్నాయి. ఈ మూడు పదాలూ ఒకే వస్తువును సూచిస్తాయి. ఈ 13 బిందువులను ప్రధానంగా 3 క్షేత్రాలుగా విభజించారు - హృదయ క్షేత్రం, మనో క్షేత్రం, కేంద్ర క్షేత్రం అని మూడు క్షేత్రాలు. మొదటి 5 బిందువులు హృదయ క్షేత్రంలోకి వస్తాయి; 6 నుండి 12 బిందువులు మనో క్షేత్రంలోకి వస్తాయి; 13 వ బిందువు కేంద్ర క్షేత్రంలోకి వస్తుంది. ఇవి గాక 10 కి, 11 కి మధ్య సహస్ర దళ్ కమల్ (sdk) అని ఒక స్థానం ఉంటుంది. ఈ 13 బిందువులే గాక ఇంకా అనేక బిందువులు, ఉపబిందువులు, ఉన్నాయి వారి ఆవిష్కరణ ప్రకారం. కేంద్ర బిందువుతో సహాయ మొత్తం 65 బిందువులును ఆవిష్కరించడం జరిగింది బాబూజీ. ఇక బిందువుకు బిందువుకూ మధ్య అసంఖ్యాకమైన బిందువులు ఇంకా ఉన్నాయంటారు దాజీ. ప్రధానంగా మనం 13 బిందువులను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ బిందువుల స్థానాన్ని సూచిస్తున్న ఈ క్రింది చిత్రం గమనించగలరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి