13, మే 2024, సోమవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 11 - శ్రీ రామ చంద్ర మిషన్ గురుపరంపర

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 11 
శ్రీ రామ చంద్ర మిషన్  గురుపరంపర 

లాలాజీ        బాబూజీ         చారీజీ            దాజీ 

పూజ్య బాబూజీ రూపొందించిన సహజ మార్గ ఆధ్యాత్మిక పథాన్ని మానవాళికి ఉచితంగా అందించడం కోసం మాత్రమే స్థాపించబడిన సంస్థ శ్రీ రామ చంద్ర మిషన్ అనే లాభాపేక్ష లేని ఒక ఆధ్యాత్మిక సంస్థ. దీన్ని 1945 లో స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు బాబూజీ, తన గురుదేవులైన, ఫతేగఢ్, ఉత్తర ప్రదేశ్ కి చెందిన సమర్థ గురు శ్రీ రామ చంద్ర జీ మహారాజ్ (అందరూ ప్రేమగా లాలాజీ అని పిలుస్తారు) పేరునివ్వడం జరిగింది. బాబూజీ తన గురుదేవులకు గురుదక్షిణగా వారి పేరున శ్రీ రామ చంద్ర మిషన్ అనే ఆధ్యాత్మిక సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సంస్థకు ఆది-గురుదేవులు, పూజ్య లాలాజీ. 
1983 లో పూజ్య బాబూజీ మహాసమాధి పొందిన తరువాత, ఆయన వారసునిగా, బాబూజీ ఆధ్యాత్మిక ప్రతినిధిగా, శ్రీ రామ చంద్ర మిషన్ కు అధ్యక్షులుగా చెన్నై, తమిళనాడుకు చెందిన పూజ్యశ్రీ పార్థసారథి రాజగోపాలాచారీజీని నియమించడం జరిగింది. పూజ్య చారీజీ 2014 లో పరపపదించిన తరువాత, పూజ్యశ్రీ కమలేష్ డేశాయ్ భాయ్ పటేల్ (అందరూ ఆప్యాయంగా దాజీ అని పిలుస్తారు) గారిని బాబూజీ తరువాతి ఆధ్యాత్మిక ప్రతినిధిగానూ, చారీజీ వారసునిగానూ, శ్రీ రామ చంద్ర మిషన్ అధ్యక్షులుగానూ, హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన పద్ధతికి మార్గదర్శిగానూ బాధ్యతలను చేపట్టడం జరిగింది. 

సంస్థ విస్తరణ 
1945 నుండి 2024 వరకూ 160 దేశాలకు పైగా ఈ సంస్థ విస్తరించింది. భారత దేశంలో ఇంచుమించుగా అన్నీ రాష్ట్రాల్లోనూ, అనేక జిల్లాల్లోనూ ఈ సంస్థకు సంబంధించిన ధ్యాన కేంద్రాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 250 కు పైగా ఆశ్రమాలున్నాయి. ఈ పద్ధతిలో ప్రవేశం కల్పించి, ప్రాణాహుతి ప్రసరణ ద్వారా ఆధ్యాత్మిక శిక్షణనందించే ప్రశిక్షక గణం 17000 కు పైగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఈ ప్రశిక్షకులనే ప్రిసెప్టర్లనీ, హార్ట్ఫుల్నెస్ ట్రైనర్లనీ కూడా అంటారు. ఈ ప్రశిక్షకులు నేరుగా సంస్థ అధ్యక్షులు, గురుదేవులు వారి నుండే శిక్షణ పొందుతారు. ఆ తరువాతనే వారిని ప్రశిక్షకులుగా నియమించడం జరుగుతుంది. వీరందరూ స్వంచ్ఛందంగా ఉచితంగా సేవలనందించడానికి ముందుకు వచ్చినవారే. అందరూ గృహస్థులే; అందరూ వారి వారి బాధ్యతలున్నవారే; గురువు పట్ల కృతజ్ఞతా భావంతో వారి సమయాననిచ్చి మానవాళి సేవలో ఉన్నవారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ హార్టఫుల్నెస్  సహజ మార్గ అభ్యాసాన్ని అనుసరిస్తున్నారు. 

కాన్హాశాంతి వనం 

హార్ట్ఫుల్నెస్ సంస్థ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాదు శివార్లలో బెంగుళూరు హైవే మీద, షంషాబాద్ విమానాశ్రయానికి గంట దూరంలో, చేగూరు గ్రామ వద్ద, నందిగామ మండలంలో కాన్హా 
శాంతి వనం అనే గ్రామంలో ఉంది. ఇది 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూతల స్వర్గం. 
హార్ట్ఫుల్నెస్ సంస్థ అన్నా, శ్రీరామ చంద్ర మిషన్ అన్నా రెండూ నిజానికి ఒక్కటే. 
హార్ట్ఫుల్నెస్ అనేది సహజ మార్గాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళే విధానం; సహజ్ మార్గ్ అనేది ధ్యాన పద్ధతి; శ్రీ రామ చంద్ర మిషన్ అనేది ఒక ఆధ్యాత్మిక సంస్థ.  

సాధన ప్రారంభించు విధానం  
ఈ ఆధ్యాత్మిక సాధనను అభ్యాసం ప్రారంభించాలనుకున్నవారు సమీప ప్రశిక్షకులను గాని, సమీప హార్ట్ఫుల్నెస్ ధ్యాన కేంద్రాన్ని గాని, వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చు. (www. heartfulness. org) వారితో ముఖాముఖి  రోజుకొక గంట సేపు చొప్పున వరుసగా 3 రోజులు ధ్యానంలో శిక్షణ తీసుకోవాలసి ఉంటుంది. మిగిలిన వివరాలు ప్రశిక్షకులు తెలియజేయడం జరుగుతుంది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అలసత్వం - బద్ధకం

  అలసత్వం - బద్ధకం  బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయ...