17, మే 2024, శుక్రవారం

బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16 - 'A' పాయింట్ ధ్యానం

 


బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16 
'A' పాయింట్ ధ్యానం 



పాయింట్ A అనేది ప్రాపంచిక చింతలకు నిలయం. ప్రతి రోజూ ఒక్కసారి రాత్రి ప్రార్థనా-ధ్యానం కంటే పూర్వం 5-7 నిముషాలు చేయవలసిన ప్రక్రియ. 
విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన మనలో పెంపొందడానికి మనం పాయింట్ A పై ధ్యానిస్తాం. అదే అందరిలో ఐకమత్యం రావడానికి దారి తీస్తుంది. ఈ ధ్యానాన్ని రాత్రి పడుకోబోయే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం కంటే ముందు అయిదు నుండి ఏడు నిముషాలకు మించకుండా చేయాలి. 
పురుషులకు 
పాయింట్ A పై దృష్టిని నిలిపి, ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ మీ సోదరసోదరీమణులని భావించుకోవాలి. పాయింట్ A పై ధ్యానిస్తున్నప్పుడు ఈ ఆలోచన సత్యము అన్న విశ్వాసంతో మనసును నిలపాలి. ఈ ప్రక్రియను గనుక హృదయపూర్వకంగా చేసినట్లయితే, దీని ప్రభావం వెనువెంటనే కనిపిస్తుంది. ఈ ప్రభావం శాశ్వతంగా ఉంటుంది కూడా. 
స్త్రీలకు 
దివ్య కానుకలన్నీ మీకు అందుబాటులో ఉన్నాయని భావించాలి. అలాగే ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ తమను తాము సోదరసోదరీమణులుగా భావిస్తున్నారని, మీ ఆలోచన కూడా వారి ఆలోచనతో ఏకీభవిస్తున్నట్లుగా భావించాలి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నిరంతర స్మరణ

  నిరంతర స్మరణ  అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి? బాబూజీ: నిరంతర స్మరణ.  నిరంతర స్మరణ అంటే ఏమిటి?   సహజ మార్గ గురువులు...