బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16
'A' పాయింట్ ధ్యానం
పాయింట్ A అనేది ప్రాపంచిక చింతలకు నిలయం. ప్రతి రోజూ ఒక్కసారి రాత్రి ప్రార్థనా-ధ్యానం కంటే పూర్వం 5-7 నిముషాలు చేయవలసిన ప్రక్రియ.
విశ్వమానవ సౌభ్రాతృత్వ భావన మనలో పెంపొందడానికి మనం పాయింట్ A పై ధ్యానిస్తాం. అదే అందరిలో ఐకమత్యం రావడానికి దారి తీస్తుంది. ఈ ధ్యానాన్ని రాత్రి పడుకోబోయే ముందు చేసే ప్రార్థనా-ధ్యానం కంటే ముందు అయిదు నుండి ఏడు నిముషాలకు మించకుండా చేయాలి.
పురుషులకు
పాయింట్ A పై దృష్టిని నిలిపి, ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ మీ సోదరసోదరీమణులని భావించుకోవాలి. పాయింట్ A పై ధ్యానిస్తున్నప్పుడు ఈ ఆలోచన సత్యము అన్న విశ్వాసంతో మనసును నిలపాలి. ఈ ప్రక్రియను గనుక హృదయపూర్వకంగా చేసినట్లయితే, దీని ప్రభావం వెనువెంటనే కనిపిస్తుంది. ఈ ప్రభావం శాశ్వతంగా ఉంటుంది కూడా.
స్త్రీలకు
దివ్య కానుకలన్నీ మీకు అందుబాటులో ఉన్నాయని భావించాలి. అలాగే ప్రపంచంలో ఉన్న స్త్రీపురుషులందరూ తమను తాము సోదరసోదరీమణులుగా భావిస్తున్నారని, మీ ఆలోచన కూడా వారి ఆలోచనతో ఏకీభవిస్తున్నట్లుగా భావించాలి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి