ఈ బ్లాగులో హృదయ పథం, హార్ట్ పుల్ నెస్, అనే రాజయోగ ధ్యాన పద్ధతిలో నా ప్రస్థానాన్ని గురించిన నా అవగాహనను, కొన్ని అనుభవాలను పంచుకొనే ప్రయత్నం చేస్తున్నాను. తోటి సాధకులకు, ఈ సాధనను ప్రారంభిస్తున్న వారికి, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులందరికీ ఉపకరించాలని ప్రార్థిస్తూ సాహసిస్తున్నాను.
31, మే 2024, శుక్రవారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 24 - సహజమార్గ యాత్ర - సాంప్రదాయపరంగా వివరించే యాత్ర
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 23 - సహజమార్గ యాత్ర - చక్రాలు/బిందువులు/గ్రంథులు
30, మే 2024, గురువారం
బాబూజీ దోమలగుడా యోగాశ్రమం ప్రారంభించి 57 సంవత్సరాలు
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 22 - సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 22
సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?
పరమ పూజ్య బాబుజీ ఆవిష్కరించిన సహజమార్గ యాత్ర ప్రకారం, ఆధ్యాత్మిక యాత్ర అంటే 13 బిందువుల గుండా ఆత్మ చేసే ప్రయాణం. ఈ బిందువులను, చక్రాలని, గ్రంథులనీ కూడా అంటారు.
ఆత్మ కదులుతుందా? కదలదు. మరేం కదులుతుంది? ఇక్కడ, ఆత్మ అంటే ఆత్మ వ్యక్తమయ్యే మాధ్యమం, దాన్నే చేతన అని, చైతన్యమని అంటారు. ఆత్మ, చైతన్యం ద్వారా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ చేతన లేక చైతన్యం పూర్తిగా పరిశుద్ధ చైతన్యంగా మారే వరకూ జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. అప్పటి వరకూ ఆత్మ పరితపిస్తూనే ఉంటుంది. జీవులను నడిపేది ఈ పరితపిస్తున్న ఆత్మే. ఆత్మ దేని కోసం తపిస్తున్నదో అది పరమాత్మ. ఆ పరమాత్మతో కలయిక జరిగే వరకూ, లయమయ్యేవరకూ ఈ యాత్ర కొనసాగుతూనే ఉంటుంది. దీన్నే యోగం అంటారు.
ఈ యోగ సిద్ధి కలగడానికి ప్రధానంగా మూడు మార్గాలు - కర్మయోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం. కానీ ప్రతీ యోగమూ , మూడు యోగాలతోనూ కూడుకుని ఉంటుంది. ఏ యోగం ప్రబలంగా ఉంటే ఆ వ్యక్తిని ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఉదాహరణకు, మనిషిలో భక్తి ఎక్కువగా ఉంటే అతను భక్తియోగాన్ని అనుసరిస్తున్నాడనవచ్చు; అలాగే జ్ఞానం ప్రబలంగా ఉంటే జ్ఞాన యోగి అని, అలాగే కర్మ ద్వారా దైవాన్ని సాధించాలనుకున్నవాడిని కర్మయోగి అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కానీ ముగ్గురూ మూడు యోగాలను అనుసరించవలసినదే. ఈ మూడిటికీ అతీతమైనది రాజయోగం అంటే మనసుతో యోగాన్ని సిద్ధింపజేసుకోవడం. దీన్ని కొందరు మనోయోగం అని కూడా అంటారు. అటువంటి రాజయోగ పద్ధతే మన ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గ పద్ధతి. మనసుతో చేసే యోగం. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల కలయిక ఈ హార్ట్ఫుల్నెస్ సహజమార్గం.
28, మే 2024, మంగళవారం
బాబూజీ ప్రారంభించిన దోమలగుడా యోగాశ్రమం 57 వ వార్షికోత్సవం - 28.5.2024
23, మే 2024, గురువారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 21 - సహజమార్గ యాత్ర - అసలు యాత్ర అంటే ఏమిటి?
ఆత్మ కదులుతుందా? ప్రయాణిస్తుందా? అసలు ఈ యాత్ర అంటే ఏమిటి? నిజంగా యాత్ర జరుగుతుందా? అస్తిత్వానికి సంబంధించిన ఇటువంటి ప్రశ్నలు ప్రతీ ఆత్మకు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు మన సహజ మార్గ పద్ధతిలో మన మాస్టర్ల ద్వారా అనేక సందర్భాలలో వెల్లడి చేయడం జరిగింది. వీటిని మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆత్మ అనేది శుద్ధ చైతన్యం, ఒక ఉనికి, ఆత్మలో వికాసం చెందడానికి యేమీ లేదంటారు. ఇందులో మార్పు చెందవలసినదేదీ లేదంటారు. భౌతిక శరీరంలో అంటే స్థూల శరీరంలో, మార్పులు సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాని దీనికి పరిమితులున్నాయి; శరీరానికి వయసు మీరుతుందే తప్ప పెద్దగా వికాసం యేదీ జరగదు. ఇక కారణ శరీరంలో మార్పులు వచ్చే అవకాశమే లేదని ఇంతకు మూడే చెప్పుకున్నాం. ఇక మిగిలినది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ప్రధానంగా మనసు, బుద్ధి, అహం, చిత్తం. మన ఈ శరీర వ్యవస్థలో మార్పులు చెందేవి ఈ సూక్ష్మ శరీరాలే. సూక్ష్మ శరీర వికాసానికి అసలు ఎటువంటి పరిమితులు లేవు. దీన్నే ఆధ్యాత్మిక వికాసం అంటారు.
ఆత్మ అభివ్యక్తమయ్యేది సూక్ష్మ శరీరం ద్వారా. సూక్ష్మ శరీరం అభివ్యక్తమయ్యేది స్థూల శరీరం ద్వారా.
పుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించేది, మరణించినప్పుడు శరీరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయేది ఆత్మ. కానీ శరీరం విడిచి వెళ్ళేది కేవలం ఆత్మ మాత్రమే కాదు; దానితోపాటు సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోతుంది; స్థూల శరీరం భూమ్మీద మిగిలిపోతుంది. సూక్ష్మ శరీరం పరిశుద్ధంగా తయారయ్యే వరకూ, ఆత్మ మరల-మరల జన్మలు తీసుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీర శుద్ధి జరగడం కోసమే, మనిషి జన్మ తీసుకున్నది. ఇక్కడ కర్మ సిద్ధాంతాల పాత్ర కనిపిస్తుంది. సూక్ష్మ శరీర శుద్ధి జరిగినంత మేరకు, దానిని బట్టి మరుజన్మ లభిస్తూ ఉంటుంది.
ఈ ఆత్మను భగవంతునిలో ఒక అంశగా చెప్తారు. అందుకే ఆత్మను నీటి బొట్టని, భగవంతుడు మహాసముద్రమనీ కబీర్ అభివర్ణిస్తారు. ఈ నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయి ఒకటవడమే యోగం. ఈ నీటి చుక్క సముద్రంలోనిదే కాబట్టి ఒకటవడానికి పరితపిస్తూ ఉంటుంది.
నిజానికి నీటి చుక్క, మహాసముద్రంలో భాగమైనప్పుడు రెండూ వేర్వేరుగా ఉండే అవకాశమే లేదు. కానీ నీటి చుక్క విడిపోయిన భ్రమలో ఉంటుందట. ఆ భ్రమను తొలగించడమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క లక్ష్యం, ప్రయోజనం.
కానీ మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏమిటి? నీటి చుక్క, నీటి చుక్కగా ఉంటే మహాసముద్రంలో తేలికగా ఒక్కటైపోతుంది. అంటే సముద్ర లక్షణాలన్నీ అన్నీ విధాలా నీటి చుక్కలో ఉంటేనే ఒక్కటవుతుంది. అదే నూనె చుక్క మహాసముద్రంలో పడిందనుకోండి. ఎప్పటికైనా మహాసముద్రంలో కలుస్తుందా? ఎప్పటికీ. కలవదు. నీటి చుక్క మహాసముద్రంలోనే ఉన్నా సముద్రంతో ఎటువంటి సంబంధమూ లేకుండా కొనసాగుతూ ఉంటుంది. ఇంతకంటే విషాదకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. నూనె చుక్కలో ఉండే ఆ జిడ్డుతనమే సముద్రంలో కలవనీయదు. మన ఆత్మ విషయంలో ఆ జిడ్డు అంటే ఏమిటి? కోరికలు, సంస్కారాలు, అహంకారము. ఇవే ఆత్మను భగవంతునితో ఐక్యం కానివ్వకుండా చేస్తున్నది. వీటిని సంపూర్ణంగా తొలగించుకున్న తక్షణమే ఆత్మ పరమాత్మలో సంపూర్ణ ఐక్యం పొందుతుంది; ఇదే సహజ మార్గ పరమ లక్ష్యం; ఈ లక్ష్యాన్ని బాబూజీ తన దశ నియమాల్లో కూడా చెప్పడం జరిగింది.
భగవంతునితో విడిగా ఉన్నామన్నది భ్రమ మాత్రమేనని, ఆ భ్రమ ఈ సహజమార్గ జీవన విధానం ద్వారా తొలగిపోతుందంటారు దాజీ. అదే యోగం. ఇదే ఆధ్యాత్మిక యాత్ర పరమగమ్యం. అందరూ ఆ బాటలో ముందుకు సాగుదురుగాక!
21, మే 2024, మంగళవారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 20 - సహజమార్గ యాత్ర - యోగము
1) యోగం అంటే ఏమిటి?
యుజ్యతే ఇతి యోగః – కలయికే యోగం అంటే. రెండుగా ఉన్నవి ఒక్కటిగా మారిపోవడం; నీటి చుక్క సముద్రంలో కలిసినప్పుడు సముద్రంగా మారిపోవడం. ఆత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమాత్మగా మారిపోవడం.
2) ఈ యోగాన్ని సాధించడం ఎలా?
యోగః చిత్తవృత్తి నిరోధః – చిత్తంలోని అనేక రకాల వృత్తులను, అనేక రకాల తత్త్వాలను నిరోధించడమే యోగం. చిత్తం అంటే చైతన్యం; చైతన్యం అనేది ప్రధాన నాలుగు సూక్ష్మశరీరాల్లో ఒకటి; కాని ఇందులోనే మనసు, బుద్ధి, అహంకారం అనే మూడు ఇతర సూక్ష్మశరీరాలుంటాయి. వీటన్నిటినీ శుద్ధి చేస్తే చిత్తశుద్ధి తనంతతానుగా జరుగుతుంది.
3) యోగం సాధిస్తే ఏమిటి ప్రయోజనం?
యోగః కర్మసు కౌశలం – యోగసాధన వల్ల మనం చేసే పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది, కుశలత పెరుగుతుంది, పనితనం పెరుగుతుంది. పనితనం పెరగడం వల్ల అమోఘమైన ఆత్మసంతృప్తి కలుగుతుంది; చేసిన పని సార్థకమవుతుంది; జీవితమే సార్థకమవుతుంది.
4) మనం చేసే పనులు ఏ విధంగా చెయ్యాలి?
యోగస్థః కురు కర్మాణి – యోగసాధన వల్ల కలిగిన యోగస్థితిలో ఉంటూ కర్మలు చేసినప్పుడు సంస్కారాలు/వాసనలు అంటవు. ఏ పనీ మోహంతో చేయడం ఉండదు. యోగస్థితి మనిషికి కనిపించని కవచంలా పని చేస్తుంది; ఈ విధంగా జీవితం కొనసాగినప్పుడు, జన్మరాహిత్యం లేక మోక్షం అనే ఉన్నత ఆధ్యాత్మిక స్థితి, ఆ తరువాత ఆత్మసాక్షాత్కారం అనే అత్యున్నత ఆద్యాత్మిక స్థితి అనుభవంలోకి వస్తాయి.
కాబట్టి యోగసాధన ప్రతి ఒక్కరికీ అనివార్యము. భూమిపై శ్రేష్ఠమైన విధంగా జీవించే జీవన విధానం ఈ యోగవిద్య మనకు నేర్పిస్తుంది. మనిషి మరింత మరింత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలకు ఎదిగే ఏకైక మార్గం యోగం. హార్ట్ ఫుల్ నెస్ యోగ విధానం అనేది ఇటువంటి యోగవిద్యను ఆధునిక మానవుని పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యోగవిద్యనందించే రాజయోగ విధానం. అందరూ ప్రయత్నింతురుగాక!
20, మే 2024, సోమవారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 19 - సహజమార్గ యాత్ర
19, మే 2024, ఆదివారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 18 - శరణాగతి, ప్రేమ, లయావస్థ
శరణాగతి, ప్రేమ, లయావస్థ
సముచితమైన భావంతో మన నిత్య సాధన కొనసాగించ్చినప్పుడు, అంటే ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం మన దినచర్యలో భాగమైపోయినప్పుడు, సహజమైనప్పుడు అది నిరంతర స్మరణగా పరివర్తన చెందడం ప్రారంభిస్తుంది. నిరంతర స్మరణ సాధకుడు తనను తాను మరచిపోయి, ఆ భగవంతుని స్పృహలో జీవించేలా పరిణమిస్తుంది. అదే దివ్య ప్రేమకు దారి తీస్తుంది. శరణాగతి భావం అప్రయత్నంగానే సంభవిస్తుంది. శరణాగతి ప్రయత్నిస్తే వచ్చేది కాదు. తనంతటాబయగా సంభవిస్తుంది. ప్రేమ లేనిదే శరణాగతి లేదు; శరణాగతి లేనిదే ప్రేమ లేదు; అసలు ప్రేమ అంటేనే శరణాగతి. శరణాగతి, ప్రేమ లయావస్థకు దారి తీస్తాయ. ఈ అవస్థలో కేవలం సాధకుడి అస్తిత్వం యొక్క సాక్షి భావం ఒక్కటే ఉంటుంది. నీటి చుక్క మహాసముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దాజీ చెప్పినట్లుగా నీటి చుక్కే సముద్రంగా మారిపోతుంది. నిజానికి "నేను సముద్రంగా మారిపోయాను" అని చెప్పడానికి నీటి చుక్క మిగలదు.
మహాసముద్రంగా మారిపోయిన తరువాత ఈ సాక్షి భావం కూడా కనుమరుగైపోతుందట. పూజ్య దాజీ ఇటీవలే ఇచ్చిన సందేశంలో, అయినప్పటికీ ఈ యాత్ర ఇంకా పూర్తవదంటారు. అప్పుడు వ్యక్తిగత చేతన యొక్క సాక్షి భావం పోయి, విశ్వ చేతనకు సాక్షిగా మారడం జరుగుతుంది. బహుశా అది మహాప్రళయంలో మాత్రమే అంతమవుతుంది.
ఇంత యాత్ర ఈ జన్మలోనే శరీరం ఉండగానే ప్రాణాహుతితో కూడిన సహజ మార్గ సాధన వల్ల సాధ్యమంటారు బాబూజీ, చారీజీ, దాజీ. అవసరమైనడల్లా దారిలో అడ్డు వచ్చే కలుపుమమొక్కలన్నిటినీ ధ్వంసం చేయగలిగే దృఢసంకల్పం, శ్రద్ధాభక్తులు, నిరంతర శ్రమ (తితిక్ష) సాధకుడు అలవరచుకోవలసి ఉందంటారు.
ధ్యానంలో మనం కళ్ళు మూసుకుంటాం, హృదయాలు తెరుస్తాం. తెరచిన హృదయం కానుక అందుకుంటుంది. కానుకను గుర్తించడం కృతజ్ఞత. కృతజ్ఞత ఒక ఆధ్యాత్మిక స్థితిని మన హృదయాలలో కలుగజేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్థితిని కొనసాగించినప్పుడు అది ప్రేమ దిశగా పైకి ఎగుస్తుంది. అంతరంగంలో ఉన్న ప్రేమ, పరమాత్మ పట్ల పూజ్య భావం సృష్టిస్తుంది. పూజ్యభావం మనలో పెరుగుతున్నకొద్దీ, మన హృదయం దైవకృపను ఆకర్షిస్తుంది. కృపా తరంగాలపై పయనిస్తున్న కొద్దీ, సమర్పణ భావం ప్రారంభమవుతుంది. సమర్పణభావం నిర్మలత్వాన్ని సృష్టిస్తుంది. నిర్మలత్వం వల్ల శరణాగతి ప్రారంభమవుతుంది. శరణాగతి లయావస్థకు దారి తీస్తుంది.
- దాజీ, స్పిరిచువల్ అనాటమీ
17, మే 2024, శుక్రవారం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 17 - 'B' పాయింట్ శుద్ధీకరణ
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 16 - 'A' పాయింట్ ధ్యానం
బాబూజీ - సహజమార్గ ఆధ్యాత్మిక పథము - 15 - నిరంతరస్మరణ
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం
ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...
-
గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అంతరంగ శాంతి నుండి ప్రపంచ శాంతి అమెరికాలోని షికాగో నగరంలో 1893 లో మొట్టమొ...
-
సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్రలో మనం ముందుకు సాగుతున్నామో లేదో ఎలా తెలుస్తుంది? పైన చిత్రంలో చూపించిన విధంగా సహజ మార్గ ఆధ్యాత్మిక యాత్ర 13 ప్రధా...
-
ఆది శక్తి మహోత్సవం - ప్రాణాహుతి పునరుద్ధరణోత్సవం పూజ్య దాజీ ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా సామూహిక ధ్యానం తరువాత, కాన్హా శాంతి వనంలో ఒక అ...