బాబూజీ గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు ప్రాణాహుతి ప్రసరణ
అభ్యాసి: బాబూజీ, మీరు రచించిన గ్రంథాలు ప్రాణాహుతిని ప్రసరిస్తున్నట్లుగా అనిపిస్తుంది.
బాబూజీ: నిజంగా ఇలాంటి అనుభవం నీకు జరిగిందా?
అభ్యాసి: అందుకే కదా మిమ్మల్ని అడుగుతున్నాను బాబూజీ.
బాబూజీ: నీ అనుభవం సరైనదే. అన్నిటికంటే ఎక్కువ నేను వ్రాసిన సహజ మార్గ దశనియమాలపై వ్యాఖ్య అనే పుస్తకం నుండి ఈ అనుభూతి మీకు కలుగుతుంది.
అభ్యాసి: అది నాకు తెలియదు కానీ మీ పుస్తకాలు చదువుతూ ఉంటే మాత్రం ప్రాణాహుతి ప్రసరణ ప్రారంభమైపోతుంది.
బాబూజీ: సహజ మార్గ దశ నియమాల వ్యాఖ్య అనే పుస్తకం నుండే ప్రాణాహుతి ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే ఆ పుస్తకం నేను వ్రాయలేదు కాబట్టి.
అభ్యాసి: ఎందుకని బాబూజీ? అందులో మీ పేరే ఉంది గదా?!
బాబూజీ: విను. ఒకసారి నా గురుభాయ్ పండిత రామేశ్వర ప్రసాద్ మిశ్రా గారు మా ఇంటికి వచ్చారు. అనేక విషయాలు చర్చించిన తరువాత, మిషన్ లోని దశ నియమాలపై వ్యాఖ్యను దయచేసి వ్రాయించండి అని కోరడం జరిగింది. సోదరా, ఇది లాలాజీకి సంబంధించిన విషయం, నేనెలా వ్రాయించగలను? అన్నాను. డానికాయన మీరు కచ్చితంగా వ్రాయించగలరు అన్నాడు. సరే అయితే నాకు కొంచెం ఆలోచించడానికి సమయం కావాలన్నాను. సరే ఎంత సమయం కావాలి? అని అడిగారు. మేము ఆరు నెలల సమయం కావాలన్నాము. వారు తన డైరీలో వ్రాసుకుని, మరికొన్ని సంభాషణల తరువాత ఇంటికి వెళ్ళడం జరిగింది. సరిగ్గా 6 నెలల తరువాత, కాగితం కాలం తీసుకుని వచ్చి, ఇప్పుడు చెప్పండి భాయ్ అన్నారు. ఏమి వ్రాయించమంటారు? అని అడిగాను. మీరే చెప్పారు గదా, ఆరు నెలల తరువాత దశ నియమాలపై వ్యాఖ్య వ్రాయిస్తామని చెప్పారు గదా? అన్నారాయన. సోదరా! నిజంగా నేను మరచిపోయాను. అస్సలు దీని గురించి ఆలోచించలేదు. "అదేమీ కుదరదు, మీరిప్పుడు వ్రాయించవలసినదే" అన్నారాయన. సరే అయితే, వ్రాయండి అన్నాను. అలా నేను చెప్తూ పోయాను, ఆయన వ్రాస్తూ వెళ్ళారు. ఈ విధంగా మూడు సిట్టింగుల్లో దశ నియమాల వ్యాఖ్య వ్రాయించడం జరిగిపోయింది. పై నుండి ఆలోచనలు వస్తూ పోయాయి, మేము చెబుతూ పోయాం; మేము కేవలం ఒక మాధ్యమంగా ఉన్నాం అంతే. దశ నియమాల వ్యాఖ్య వ్రాయడం పూర్తయిన తరువాత ఒక అనుబంధం వ్రాయాలనుకున్నాను. రెండు-మూడు వాక్యాలు అదనంగా వ్రాద్దామనుకున్నాను. కానీ ఒక్క ఆలోచన కూడా రానే లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యిందా?
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి