ధ్యానంలో కలిగే స్థితులు - 6
ఉదయం ధ్యానంలో కూర్చున్నప్పుడు సాధారణంగా ఆ రోజు మనం చెయ్యవలసిన పనుల జాబితా మన ముందుకొస్తుంది. వీటిని గురించి తెలియకుండానే ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. హృదయంలో దివ్య వెలుగు గాకుండా మనం వీటిని గురించి ఆలోచిస్తాం. కానీ ఇలా ఆలోచించడంలో ఆ జాబితాలోని అనవసరమైన పనులేమిటో గుర్తించి అక్కడికక్కడే ఆ జాబితా లో నుండి మానసికంగానే తొలగించేస్తాం. అప్పుడు అవసరమైన పనులు మాత్రమే ధ్యాసలో ఉంటాయి. ఆ విధంగా ఎంతో సమయం ఆదా అవడమే గాక సమయాన్ని సృష్టించుకోగలుగుతాం; అలాగే ఒత్తిడి లేకుండా పని చేయగలగడం, సమర్థవంతంగా పనిచేయగలగడం జరుగుతుంది. అలా ధ్యానం మన అమూల్యమైన సమయాన్నితగిన విధంగా వినియోగించుకునేలా చేస్తుంది. ధ్యానం సమయం ఆదా చేస్తుంది, సమయాన్ని సృష్టిస్తుంది కూడా. సమయం లేదనుకునే వారికి ఇది శుభవార్త.
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత మనసు తేలికగా హృదయంలోని దివ్య జ్యోతిపై కేంద్రీకరించగలగడం జరుగుతుంది. ఇంతకు ముందు వ్యాసాలలో చెప్పుకున్న అనేక సూక్ష్మ స్థితులు కలగడం వల్ల మన సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతుంది. ధ్యానం మనసుకు అతీతంగా తీసుకువెళ్ళి నిగూఢమైన, తీక్ష్ణమైన అంతరంగ స్థితులకు దారి తీస్తుంది. సూక్ష్మ శరీరాల శుద్ధి జరుగుతున్న కొద్దీ చేతనంలో సమూల మార్పులు కలుగుతాయి. చేతనంలో కలిగే సమూల మార్పుల వల్ల మనిషిలో కొంచెం-కొంచెంగా పరివర్తన కలుగుతుంది. ఇదీ మన హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యానం చేయడంలో మర్మం. మార్పులు నెమ్మదిగా వచ్చినా కచ్ఛితంగా వస్తాయి, సమూల మార్పులు కలుగుతాయి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి