గురువుకి, ఈశ్వరుడికి తేడా ఏమిటి? - బాబూజీ
అభ్యాసి: బాబూజీ, గురువుకి, ఈశ్వరుడికీ తేడా ఏమిటి?
బాబూజీ: ఈశ్వరుడికి మనసు ఉండదు. ఆయనకు కూడా మనసు ఉండుంటే ఆయన కూడా ఈ సంస్కారాల ఉచ్చులో ఇరుక్కుపోయి ఉండేవాడు; జనన-మరణాల బంధాల్లో చిక్కుకుపోయేవాడు.
ఈశ్వరుడు తన వంటి వాడిని మరొకరిని తయారు చేయలేడు. కానీ మనం మనలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని సృష్టించగలం.
అభ్యాసి: బాబూజీ, అభ్యాసి చాలా పుస్తకాలు చదవాల్సి ఉంటుందా?
బాబూజీ: నేను వ్రాసిన ఈ నాలుగు పుస్తకాలు (సత్యోదయం, సహజ మార్గ దృష్ట్యా, రాజా యోగ ప్రభావము, అనంతుని వైపు, సహజ మార్గ దశనియమాల వ్యాఖ్య) పరిపూర్ణమైనవి. వీటిని దాటి యే జ్ఞానమూ లేదు.
అభ్యాసి: బాబూజీ అప్పుడప్పుడు ధ్యానంలో నాకు వెలుగు కనిపిస్తూ ఉంటుంది.
బాబూజీ: యదార్థ తత్త్వం పదార్థంతో సంపర్కమైనప్పుడు ఈ వెలుతురు కనిపిస్తుంది.
ఎవరైతే మహామాయ క్షేత్రాన్ని దాటి ఉంటారో, వాళ్ళు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంలో మాత్రమే అద్భుతాలు చేయగలుగుతారు. అందుకే ప్రాపంచిక విషయాల అవసరం వచ్చినప్పుడు, మేము ఈ పనిని ప్రిసెప్టర్లకు అప్పగిస్తూ ఉంటాం; వాళ్ళు మహామాయ క్షేత్రానికి దిగువన ఉండటం వల్ల.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి