పాయింట్ ఎ, పాయింట్ బి
(పైన చిత్రం: రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథంలోనీది.)
పూజ్య బాబూజీ చేసిన అనేక ఆధ్యాత్మిక ఆవిష్కరణల్లో పాయింట్ ఎ, పాయింట్ బి అనే ఉపబిందువులు చాలా ప్రధానమైనవి. బాబూజీ ప్రకారం అనేక ఉపబిందువులున్నాయి కానీ, అభ్యాసి సాధనకు సంబంధించినంత వరకూ ఇవి చాలా ముఖ్యం అన్నారు. ఈ బిందువులు ప్రతి మనిషికీ ఎక్కడుంటాయో చెప్పడం జరిగింది. ఎడమ చనుమొన నుండి 2 వేళ్ళ వెడల్పు కుడివైపుకు తీసుకుని, అక్కడి నుండి 3 వేళ్ళ వెడల్పు నిటారుగా క్రిందకు తీసుకుంటే ఉండేది పాయింట్ ఎ ఉపబిందువు. అక్కడి నుండి 2 వేళ్ళ వెడల్పు క్రిందకు వస్తే ఉండేది పాయింట్ బి ఉపబిందువు.
సహజమార్గ ఆధ్యాత్మిక పథం ప్రకారం పాయింట్ ఎ పై ధ్యానం కొద్ది నిముషాలు, పాయింట్ బి శుద్ధీకరణ కొద్ది నిముషాలు ప్రతి రోజూ సాధకుడు చేయవలసి ఉంటుంది.
పాయింట్ ఎ వద్ద ప్రాపంచిక చింతలకు సంబంధించిన ముద్రలు ఏర్పడతాయి; పాయింట్ బి వద్ద ఇంద్రియాకర్షణకు సమబంధించిన ముద్రలు ఏర్పరచుకుంటూ ఉంటాడు అభ్యాసి. పైన చెప్పిన సాధన వల్ల యే రోజుకారోజు ఏర్పడిన ముద్రలను తొలగించుకోవడం వల్ల ఒక ఉన్నత కోవకు చెందిన చేతనం సహజంగా పెంపొందడం జరుగుతుంది. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యపడుతుందని చెప్తారు బాబూజీ. సహజమార్గ సాధనలో ఈ ప్రక్రియలు చాలా ముఖ్యం.
మరిన్ని వివరాలకు పైన చెప్పిన బాబూజీ వ్రాసిన రాజయోగము దృష్ట్యా సహజమార్గ ప్రభావము అనే గ్రంథాన్ని అధ్యయనం చేయగలరు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి