శ్లోకం 1
ప్రజాహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనాతుష్ఠః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. //2:55//
ఓ పార్థా, మనసులో ఉద్భవించే కోరికలన్నిటినీ ఎవరైతే త్యజిస్తాడో, ఆత్మసంతృప్తి కలిగి ఉంటాడో, ఆత్మలో సంతుష్ఠుడై అంతరంగంలో స్థిరంగా ఉంటాడో అటువంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడని అంటారు.
శ్లోకం 2
ధ్యాయతో విషయాంపుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోధోపిజాయతే. //2:62//
ఇంద్రియాలపైనే దృష్టిని సారించినవాడు వాటికి ఆకర్షితుడవుతాడు. ఆ ఆకర్షణ
నుండి కోరిక పుడుతుంది; కోరిక నుండే కోపం పుడుతుంది.
శ్లోకం 3
క్రోదాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ప్రణశ్యతి. //2:63//
కోపం మనసును గందరగోళానికి గురి చేసి భ్రమకు లోనవుతుంది; ఫలితంగా జ్ఞాపక
శక్తి నశిస్తుంది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశనమవడంతో మనిషి
అథోగతిపాలవుతాడు.
శ్లోకం 4
రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్
ఆత్మవశ్యైవిధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి. //2:64//
మనసును అదుపులో ఉంచుకున్నవాడు రాగద్వేషాల (ఇష్టాయిష్టాల)నుండి
ఇంద్రియములతో వస్తువులను వినియోగిస్తున్నప్పటికీ వాటి నుండి
విముక్తుడవుతాడు; భగవదనుగ్రహాన్ని పొందుతున్నాడు.
శ్లోకం 5
నాస్తి బుద్ధిరుక్తస్య న చా యుక్తస్య భావనా
భావనాన చా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖమ్. //2:66//
సామరస్యం లేనిదే మనిషికి విజ్ఞత ఉండదు; సామరస్యం లేకుండా ధ్యానం
కుదరదు; ధ్యానించకుండా శాంతి రాదు. మనశ్శాంతి లేనప్పుడు మనిషికి
సంతోషం ఎక్కడుంటుంది?
శ్లోకం 6
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాస్త్వనుష్ఠితాత్
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావః //3:35//
పరధర్మాన్ని ఎంతబాగా నిర్వర్తించినప్పటికీ గుణము లేనిదైనా స్వధర్మమే
మేలు; పరధర్మాన్ని నిర్వహించడం కంటే కూడా స్వధర్మం ఆచరిస్తూ మృత్యువు
సంభవించినా మంచిదే. క్లుప్తంగా చెప్పాలంటే, “నీ పని నువ్వు చూసుకో”
అని అనుండేవారు బాబూజీ.
శ్లోకం 7
నకర్మణామనారంభా న్నైష్కర్మ్యం పురుషోశ్నుతే
న చ సన్నన్యసనాదేవ సిద్ధిం సమాధిగచ్ఛతి. //3:04//
కర్మ చేయకుండా ఉండటం వల్ల మనిషికి కర్మ నుండి విముక్తి కలగదు. కేవలం
కర్మ పరిత్యాగం వల్ల పరిపూర్ణతను సాధించడం సాధ్యపడదు.
రహస్యం 1
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ॥4:7॥
రహస్యం 2
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ॥4:8॥
తాత్పర్యం:శిష్టులను రక్షించడం కోసం, దుష్టులను శిక్షించడం కోసం, ధర్మాన్ని
స్థాపించడం కోసం నేను భూమిపై మళ్ళీ మళ్ళీ అవతరిస్తూ ఉంటాను.
రహస్యం 3
ఇది చాలా ముఖ్యమైన శ్లోకం, 18వ అధ్యాయంలోనిది, 66వ శ్లోకం:
సర్వధర్మాన్పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥18 :66॥
తాత్పర్యం: అన్ని ధర్మాలను విడిచిపెట్టి, నన్ను మాత్రమే శరణు వేదినట్లయితే, నీ సమస్త పాపాల నుండి విముక్తిని కలిగిస్తాను; భయపడకు.
ఈ ఏడు రత్నాలను, ఈ మూడు రహస్యాలను తరువాయి భాగాల్లో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి