గీతా ధ్యానం - ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు
శ్రీకృష్ణ భగవానుడు ఈ క్రింది శ్లోకాల ద్వారా ఈశ్వరుడు, సర్వభూతానాం అంటే, సర్వభూతముల యందు, సర్వస్య చాహం హృది అంటే అందరి హృదయంలోనూ, స్థితమై యున్నాను, అని సుస్పష్టం చేయడం జరిగింది.
అహమాత్మా గుఢాకేశా సర్వభూతాశయస్థితః |
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత యేవ చ ||10:20||
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిజ్ఞానమాపోహనం చ|
వేదాయిశ్చ సర్వైరహమేవ వేదయో వేదాంతకృద్వేవవిదేవ చాహం||15:15||
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి ।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 18:61 ।।
భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ।। 18:61 ।।
హార్ట్ఫుల్నెస్ సహాజమార్గ ధ్యాన పద్ధతిలో అందుకే పూజ్య బాబూజీ మహారాజ్ హృదయంపై ధ్యానించమని సూచించినది. కేవలం హృదయంపై ధ్యానించడం ద్వారా మాత్రమే ఈశ్వరానుభూతి కలిగేది, సర్వప్రాణులతో ఉన్న సంబంధాన్ని గుర్తించగలిగేది, సాక్షాత్కరించుకోగలిగేది, అన్ని రకాల నిజమైన జ్ఞానం పొందగలిగేది, చివరికి ఆయనలో లయం కాగలిగేది, జీవితం తరింపజేసుకోగలిగేది. ఇక ఎక్కడ ధ్యానించాలన్న ప్రశ్న సాధకునిలో ఉండవలసిన అవసరం లేదు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి