3, ఏప్రిల్ 2024, బుధవారం

బాబూజీ సందేశమాలిక 13 - నేతి నేతి - Neti Neti

బాబూజీ సందేశమాలిక 13 
  నేతి నేతి - Neti Neti  
(విజయవాడ, 27 నవంబర్ 1968 , Vijayawada, 27 November  1968 )

There are several persons who do not want to test the efficacy of our Sahaj Marg system - the remodeled system of Raja Yoga - because they are satisfied with what they do. Due to their habits they feel satisfaction in the worship they do out of their avowed method. They take it to be the spiritual improvement which is really not there. They take satisfaction as mark of peace. But satisfaction relates to the senses of grosser type, while peace is close to the soul. If this worship is neglected for a day they feel restless. But if the peace be there, there is no question of restlessness. As we develop in spirituality, the nature of peace also changes and, in the end, non-peace is the result. If we want to advance in spirituality we should begin from Infinity in finiteness. In this way we establish relation with the Real Being.

Our next step will be that we may begin to absorb ourselves in Infinity as the idea of finiteness will be washed away. Now the door is opened and we have come to the path. When finiteness is dissiapted from the mind, the way lies clear. We proceed in the Infinite with the result that even the idea of Infinity cannot pop up. Now the Reality dawns. Further on, when we jumped into the Reality the play ends and the scene begins. But this is not the end. Go on and on. Not only this, not only this - Neti, Neti.

చాలా మంది పునః వ్యవస్ఠీకరించిన రాజయోగ పద్ధతియైన సహజ మార్గ పద్ధతి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడానికి కూడా ఇష్టపడరు - ఎందుకంటే వాళ్ళు చేస్తున్నదానితో వాళ్ళకు తృప్తిగా ఉండటం వల్ల. వాళ్ళు స్వీకరించిన ఆరాధనా పద్ధతి అలవాటైపోవడం వల్ల వాళ్ళకు సంతృప్తిగా ఉంటుంది. దాన్నే వాళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుదలగా భావిస్తూ ఉంటారు; నిజానికి అక్కడ అది లేకపోయినప్పటికీ. సంతృప్తే శాంతికి సంకేతం అనుకుంటారు. కానీ నిజానికి సంతృప్తి అనేది గాఢమైన ఇంద్రియాలకు సంబంధించినది, శాంతి అనేది ఆత్మకు దగ్గరగా ఉండేది. ఒక్కరోజు ఈ ఆరాధన ఆపేసినట్లయితే, వారిలో అశాంతి పెరిగిపోతుంది. అదే శాంతి కలిగినట్లయితే అశాంతి ప్రశ్నే ఉండదు. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ శాంతి యొక్క స్వభావం కూడా మారుతూ ఉంటుంది; చివరికి శాంతికి అతీతమైన స్థితి ఫలితంగా కలుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలంటే పరిమితిలో ఉన్న అపరిమితత్వంతో ప్రారంభించాలి. ఈ విధంగా మనం నిజ ఆస్తిత్వంతో అనుబంధం ఏర్పరచుకోవడం జరుగుతుంది. 

మనం వేయవలసిన తరువాతి అడుగు ఏమిటంటే. పరిమితి అన్న భావన పూర్తిగా తొలగిపోవడం వల్ల, మనలను మనం  అపరిమితత్వంలో పూర్తిగా లీనమైపోవడం. ఇప్పుడు ద్వారం తెరుచుకుని సరైన పథంలో అడుగు పెడతాం. మనసులో నుండి పరిమితి అనే భావన పూర్తిగా తొలగిపోవడం వల్ల మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అలా అపరిమితత్వంలో ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఒక దశలో అపరిమితత్వం అనే భావన కూడా ఇక మన ముందుకు రాదు. ఇప్పుడు సత్యతత్త్వం యొక్క దర్శనం ప్రారంభమవుతుంది. ఇంకా ముందుకు సాగుతూ సత్యతత్త్వంలోకి దూకినప్పుడు అసలు దృశ్యం ప్రారంభమవుతుంది. కానీ ఇది కూడా అంతం కాదు. అలా ముందుకు సాగుతూనే ఉంటాం - ఇది కాదు, ఇది కాదు అంటూ - నేతి, నేతి అంటూ కొనసాగుతూనే ఉంటాం.  

బాబూజీ సందేశమాలిక 12 - సహజ మార్గ మూల సిద్ధాంతాలు - Fundamental Principles of Sahaj Marg

 


బాబూజీ సందేశమాలిక 12 
  సహజ మార్గ మూల సిద్ధాంతాలు 
(5 జనవరి 1968, బెంగుళూరు) 
 Fundamental Principles of Sahaj Marg 
(5 January 1968, బెంగళూరు)

The only thing in existence, before creation came into existence, was Divinity in the original state, and everything in essence form was merged in it. The process of manifestation started with kshobh which stirred up a churning movement in the sphere of the Latent Motion. Activity revived and with it, the force got enlivenedand started its action towards manifestation. This line of action, though in perfect consonance with Divinity, appeared in its outer aspect to be some what different from it, since it had taken another course at manifestation. It may for that reason be termed as line of humanity, because of its close association with the formation of man. 

Both the lines are now in action - the Divinity and the humanity, running side by side parallel to each other...  

Now since both have come down from one great God - the Absolute - the humanity too, like Divinity, was in purest state. The force of activity in it was but nominal at the time or it was so to say in a sleepy state. The jerks caused by actions and counter actions began to stir up a sort of wakefulness and variations and contradictions began to come to view. Heat and cold made their diverse way, promoting formations. All these things entered into the composition of man and he became a conglomeration of all things in existence.
 
All that we have now to do is to bring them back again into their original state, or in other words, to restore them to a state of poise and tranquility so as to keep the link with Divinity. The only way to accomplish it is by introducing moderation into them, and we do the same in Sahaj Marg, the Natural Path of Realisation.

సృష్టి ఉనికిలోనికి రాక పూర్వం ఆస్తిత్వంలో ఉన్నది కేవలం ఒక్కటే ఒక్కటి - అదే దివ్యత్వం, తన మూల స్థితిలో ఉన్న దివ్యత్వం మాత్రమే ఉండేది; అందులో ప్రతీదీ తత్త్వ రూపంలో (బీజరూపంలో) నిక్షిప్తమై ఉండేది. నిద్రాణమై యున్న కదలిక పరిధిలో క్షోభ్ మొదలైన తరువాత అక్కడ ఒకరకమైన మథనం లాంటి ప్రక్రియ ప్రారంభమై సృష్టి బహిర్గతంవడం ప్రారంభమయ్యింది. దానితో క్రియాశీలత ప్రారంభమయ్యింది, శక్తికి ప్రాణం వచ్చినట్లయ్యింది , సృష్టి వ్యక్తమయ్యే దిశలో క్రియలు ప్రారంభమయ్యాయి. ఈ దిశలో జరిగే  ప్రక్రియ దివ్యత్వంతో శ్రుతిలో ఉన్నప్పటికీ కూడా, బయటకు మాత్రం ఒక రకంగా భిన్నంగా ఉంది, ఎందుకంటే ఈ ప్రక్రియ మరో విధంగా వ్యక్తమవడం వల్ల. ఆ కారణం చేతనే ఈ ధోరణిని మానవాళికి సంబంధించిన ధోరణి అనవచ్చు; ఎందుకంటే ఈ ధోరణి మనిషి తయారయ్యే ప్రక్రియకు దగ్గరగా ఉంది కాబట్టి. 
ప్రస్తుతం రెండు ధోరణులు క్రియాశీలకంగా ఉన్నాయి - దివ్యత్వము, మానవాళి - ఒకదానికొకటి సమాంతరంగా ఉంటూ ప్రయాణిస్తున్నాయి .. . 
ఇప్పుడు, రెండూ ఒకే మూలం నుండి అంటే ఆ పరతత్త్వం నుండే దిగివచ్చినందుకు,  మానవాళి కూడా దివ్యత్వం లాగే చాలా పరమ శుద్ధ స్థితిలో ఉండేది. క్రియాశీలక శక్తి అందులో నామమాత్రంగా ఉండేది, అంటే బీజరూపంలో నిద్రాణ స్థితిలో  ఉండేది. అక్కడ జరిగిన క్రియలు, ప్రతిక్రియాల వల్ల కలిగిన కుదుపుల వల్ల జాగరుదావస్థలో ఒకరకమైన కలవరం రేపడం మూలాన, వైవిధ్యాలు, వైరుధ్యాలు కనిపించడం మొదలయ్యాయి. వేడి, చల్లదనం వైరుధ్య మార్గాలు అవలంబించడం వల్ల, రూపాలు ఏర్పడటం ప్రారంభమయ్యింది. ఇవన్నీ మనిషి తయారీలో ప్రవేశించాయి; ఆ విధంగా సృష్టిలో ఉండే వస్తువులన్నిటి సమిష్టి ఫలితంగా ఏర్పడ్డాడు మనిషి.  

ఇప్పుడు మనం చేయవలసిందల్లా, వీటన్నిటినీ మళ్ళీ ఆ మూల స్థితికి తీసుకురావడమే; మరోలా చెప్పాలంటే, వాటిని సమత్వ స్థితికి లేక ప్రశాంతమైన స్థితికి పునరుద్ధరించవలసి ఉంది; ఆ విధంగా దివ్యత్వంతో సంపర్కాన్ని కొనసాగించగలుగుతాం.  వీటిలో మితాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా మాత్రమే దీన్ని సుసాధ్యం చేయవచ్చు; సరిగ్గా అదే మనం సహజ మార్గం లేక ప్రకృతి సిద్ధమైన సాక్షాత్కార పథంలో చేసేది. 

2, ఏప్రిల్ 2024, మంగళవారం

సందేశమాలిక 11 - భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు - God can be realised in a simple way

 

సందేశమాలిక 11 

భగవంతుని సరళంగా సాక్షాత్కరించుకోవచ్చు 

(బెంగుళూరు 20 జూన్ 1967)

God can be realised in a simple way

(Bangalore 20 June 1967)

The time has come that man  is awakened to the need of spirituality. The force of creation has created outward tendencies in man. That is why, over the course of time he has created several worlds which has resulted in making him complex. The present imperfect state of mind is the result of his own doings. Unfortunately, the basic fact that God is simple and can be achieved by simple means is lost sight of. 

God is the subtlest being and in order to realise Him the subtlest means are the only way. This does not mean that for realising God one has to ignore the needs of the physical body or the empirical world. If perchance we fall upon the means which go on adding grossness we shall definitely remain away from the vision of Absolute Reality. It is an established fact that meditation is a subtle method, provided the object of meditation is not concrete. That is why under Sahaj Marg we advise to meditate supposing the presence of Divine light in the heart. The upanishads also corroborate this. This practice supported by the transmission of the Divine Effulgence becomes subtler and subtler until it becomes the subtlest. 

మనిషి ఆధ్యాత్మికత యొక్క ఆకసారానికి మేల్కొనే సమయం ఆసన్నమయ్యింది. సృష్టిలోని శక్తి, మనిషిలో  బాహ్య ప్రవృత్తులను బాగా సృష్టించింది. అందుకే కాలక్రమేణా మనిషి అనేక ప్రపంచాలను సృష్టించుకున్నాడు, ఫలితంగా అవన్నీ మనిషిని జటిలంగా తయారు చేశాయి. ప్రస్తుత అపరిపూర్ణమైన మనసుకు కారణం మనిషి స్వయంగా తాను చేసుకున్న కృత్యాలే. దురదృష్టవశాత్తు, భగవంతుడు సరళుడని, ఆయనను తెలుసుకోవడం కూడా సరళమేనన్న మౌలిక యదార్థం మనిషికి  కనుమరుగైపోయింది. 

భగవంతుడు అతి సూక్ష్మ అస్తిత్వం; ఆయన్ని సాక్షాత్కరించుకోవాలంటే అతి సూక్ష్మ మార్గం మాత్రమే ఏకైక మార్గం. అంటే దీనర్థం శారీరక అవసరాలను లేక ప్రాపంచిక  అవసరాలను గాని నిర్లక్ష్యం చేయమని కాదు. ఒకవేళ దురదృష్టవశాత్తు రోజురోజుకూ మనలో జడత్వాన్ని పెంపొందించే మార్గంలో ఉన్నామనుకోండి, తప్పనిసరిగా ఆ పరమ అస్తిత్వం నుండి దృష్టి మరలిపోయి దూరంగా ఉండిపోతాం. ధ్యాన వస్తువు జడమైనది కాకపోయినట్లయితే, ధ్యానం అనేది చాలా సూక్ష్మ పద్ధతి అనేది స్థాపించబడిన సత్యం. అందుకే సహజ మార్గంలో హృదయంలో ఒక దివ్య వెలుగుందన్న భావనపై ధ్యానించమంటాము. ఉపనిషత్తులు కూడా దీనితో ఏకీభవిస్తాయి. ఈ సాధన దివ్య తేజస్సు యొక్క ప్రసరణ సహాయంతో మరింత మరింత సూక్ష్మంగా తయారై, సూక్ష్మాతిసూక్ష్మంగా అయ్యేవరకూ కొనసాగుతుంది. 

సందేశమాలిక 10 - భగవంతుని కలిగి ఉండటమే అసలు ఆధ్యాత్మికతలోని విషయం - Having God is the real subject of spirituality


 సందేశమాలిక 10 - భగవంతుని కలిగి ఉండటమే అసలు, ఆధ్యాత్మికతలోని విషయం 

(యోగాశ్రమ ప్రారంభం హైదరాబాదు, 28  మే 1967)

Having God is the real subject of spirituality

(Opening of Yogashram, Hyderabad, 28 May 1967)


There are so many among us who have the idea that simply knowing of God is enough. This is their wrong conception. Having God is the real subject of spirituality.

If we proceed methodically, experiences are there and transformation takes its root from the very first day.Of course, there are experiences in the beginning which are mixed up with imaginary ideas, but as we proceed on we come to that sort of experience in the end which requires no other experience.

In our Sahaj Marg system a teacher takes out the hurdles in the progress of the seeker and side by side, imparts the divine effulgence in him, which if the abhyassi does it himself takes hundreds of years and often fails to clean his system. We start with meditation upon the heart, taking the object of meditation as subtle as possible.

I earnestly pray that all of us, leaving our prejudices, may come to the path of righteousness which promises Liberation.


కేవలం భగవంతుని గురించి తెలుసుకుంటే చాలని భావించేవాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ఇది వారి పొరపాటు భావన. భగవంతుని కలిగి ఉండటం అనేది ఆధ్యాత్మికత యొక్క అసలు విషయం. 

పద్ధతిగా ముందుకు కొనసాగితే, అనుభవాలున్నాయి, మొట్టమొదటి రోజు నుండే పరివర్తన కూడా చోటు చేసుకుంటుంది. అయితే మొదట్లో మన ఊహాత్మక ఆలోచనలతో కలిసిన అనుభవాలుంటాయి,  కానీ ముందుకు సాగుతున్న కొద్దీ, చివరిలో ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే, ఇహ దాని తరువాత మరే అనుభవమూ అవసరం ఉండని అనుభూతి కలుగుతుంది. 

సహజ మార్గ పద్ధతిలో గురువు సాధకుడికి ఏర్పడే అవరోధాలను తొలగిస్తూ ఉంటాడు, అలాగే ప్రక్కప్రక్కనే అతనిలో దివ్య ప్రకాశాన్ని కూడా నింపుతూ ఉంటాడు. అదే సాధకుడు తన స్వంతంగా చేసుకుంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, తన శరీరవ్యవస్థను శుద్ధి చేసుకోలేకపోవచ్చు కూడా. మనం ఇక్కడ హృదయంపై ధ్యానిస్తాం, మనం ధ్యాన వస్తువును సాధ్యమైనంత సూక్ష్మంగా ఉంచి ధ్యానిస్తాం. 

మనందరం  ఏర్పరచుకున్న దురభిమానాలు, అభిప్రాయాలు అన్నీ విడిచిపెట్టేసి, తప్పక మోక్షాన్ని  ప్రసాదించే ఈ ధర్మ మార్గంలోకి రావాలని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తున్నాను.  



1, ఏప్రిల్ 2024, సోమవారం

బాబూజీ సందేశమాలిక 9 - భగవంతునిలో లయం - Becoming one with God

 


బాబూజీ సందేశమాలిక 9 - భగవంతునిలో లయం 
(విజయవాడ, 25 మే 1967 )
Becoming one with God 
(Vijayawada, 25 May 1967)

God is the subtlest being. Somehow if we become as subtle as He is, it means union. In the Sahaj Marg system we try to grow subtle from the very beginning, and the teacher also tries for that. We only think of duty as worship which may bring us to a subtler state. We also, as I have said elsewhere, check artificial vibrations which are formed, and try to have divine vibrations. In this system our whole attention is directed towards subtleness, and hence we discard according to yoga those things which add grossness to the system. Thus the thing goes on, and the time comes when grossness bids farewell and subtleness also loses its charm. What comes after it, is nothing short of what we want and which we are seeking. I earnestly pray that all of you may attain that conditionless condition.

భగవంతుడు అతి సూక్ష్మ అస్తిత్వం. మనం కూడా ఆయనలా సూక్ష్మంగా తయారావుతే అదే ఐక్యం అంటే. సహజ మార్గ పద్ధతిలో మనం మొట్టమొదటి నుండే సూక్ష్మంగా ఎదగడానికి ప్రయత్నిస్తాం, గురువు కూడా దాని కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం మన నిర్వహించవలసిన ధర్మాన్ని ఆరాధనగా భావించడం వల్ల అది సూక్ష్మ స్థితికి దారి తీస్తుంది. అలాగే ఇంతము పూర్వం ఎక్కడో చెప్పినట్లుగా, దివ్య తరంగాల కోసం, కృత్రిమ తరంగాలను అరికడతాం. ఈ పద్ధతిలో మన దృష్టి అంతా కూడా సూక్ష్మత్వంపైనే ఉంటుంది.  అందుకే మనకు యోగశాస్త్రం చెప్పినట్లుగా, మన శరీరవ్యవస్థలో జడత్వాన్ని సృష్టించే ప్రతీదాన్ని తిరస్కరిస్తాం. ఇలా కొనసాగుతూ, కొనసాగుతూ ఉండగా ఒక రోజు జడత్వం వీడ్కోలు పలుకుతుంది, అలాగే సూక్ష్మత్వంలో కూడా వీడ్కోలు పలుకుతుంది, తన ఆకర్షణను కోల్పోతుంది. దాని తరువాత కలిగే స్థితి మనం కోరుకున్నడే మనం కావాలనుకున్న స్థితే. మీ అందరికీ ఈ స్థితి రహితమైన స్థితి కలగాలని చిత్తశుద్ధితో ప్రార్థిస్తున్నాను.  




బాబూజీ సందేశమాలిక 8 - ఆత్మసమర్పణ - Self - surrender

 


సందేశమాలిక 8 - ఆత్మసమర్పణ 
(మైసూరు, డిశంబర్ 1965 )
Self - surrender 
(Mysore December 1965)


It is really the state of self-surrender in which one, as a true devotee, surrenders himself completely to the will of God, the Master, basking in the sunshine of His Grace. That is the relationship between the Master and the devotee, which is to be maintained all through because that is the only relationship that will finally bring us up that highest level of super consciousness. It is only here that the true character of our being is revealed. 
I feel bold enough to say that besides Sahaj Marg there is nother sadhana or worship which can bring forth such top level results in such a short time as in a part of man's life. That is what Sahaj Marg stands for.

నిజానికి ఆత్మసమర్పణ ద్వారా మాత్రమే ఒక నిజమైన భక్తుడు, భగవదేచ్ఛకు  లేక గురువు యొక్క ఇచ్ఛకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటాడు; ఆయన కృప అనే సూర్యరశ్మిని ఆస్వాదిస్తూంటాడు.  మాస్టరుకు, భక్తుడికి మధ్య సంబంధం అలా ఉంటుంది; దాన్ని చివరి దాకా అలాగే సంరక్షించుకోవాలి. ఎందుకంటే ఆ సంబంధమే చివరికి అత్యున్నత కోవకు చెందిన అధిచేతనా స్థాయికి జేర్చగలిగేది. జీవుడి యొక్క అసలు స్వభావం వ్యక్తమయ్యేది కేవలం ఇక్కడే. 
మనిషి జీవితంలో కొంత భాగంలోనే ఇటువంటి అత్యున్నత స్థాయికి చెందిన ఫలితాలను ఇవ్వగల పద్ధతి సహజ మార్గం తప్ప మరే సాధనా పద్ధతికీ లేదని చెప్పడానికి సాహసిస్తున్నాను.

బాబూజీ సందేశమాలిక 7 - అభ్యాసి పాత్ర - Role of an abhyasi

 


బాబూజీ సందేశమాలిక 7 - అభ్యాసి పాత్ర 
(బెంగుళూరు, 23 డిశంబర్ 1964)
Role of an abhyasi 
(Bangalore, 23 December 1964)

The abhyasi's part is to be perfectly obedient to the Master. I mean to say that he should comply with the directions given to him, having faith, or at least trust, in the Master, and confidence in himself. We have to search for such a good Master who has his approach to the final limit. It is very difficult to find such a Master, and in the words of Upanishads it is difficult to find disciple. But if burning desire is there for realisation, the Master will reach the seeker's door. Trust and distrust are two things and both things are necessary. But what we generally do is that we trust where distrust is needed, and distrust where trust is needed. 

మాస్టరు పట్ల పరిపూర్ణమైన విధేయత కలిగి ఉండటం అభ్యాసి పాత్ర. అంటే నా ఉద్దేశం, విశ్వాసంతో కనీసం మాస్టరుపై నమ్మకంతోనూ, తనపై ఆత్మవిశ్వాసంతోనూ ఆయన చెప్పిన మార్గదర్శకాలను అనుసరించాలి. అటువంటి మంచి మాస్టరును, చిట్టచివరి మెట్టు వరకూ చేరుకున్న వ్యక్తిని వెతకవలసి ఉంది. అటువంటి మాస్టరును వెతకడం కష్టం, కానీ ఉపనిషత్తులు చెప్పినట్లుగా అటువంటి శిష్యుడు దొరకడం కూడా కష్టమే. కానీ సాక్షాత్కారం కోసం తీవ్రమైన తపన ఉంటే మాస్టరే స్వయంగా సాధకుడి గుమ్మంలోకి  వెతుక్కుంటూ వస్తాడు. నమ్మకం, అపనమ్మకం అనేవి రెండు విషయాలు. రెండూ అవసరమే కూడా. కాని సాధారణంగా మనం నమ్మవలసిన చోట అపనమ్మకము, నమ్మకూడని చోట నమ్మడమూ చేస్తూ ఉంటాం. 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...