30, సెప్టెంబర్ 2025, మంగళవారం

పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025

 


పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025


అహమ్మదాబాద్ సోదరులు శ్రీ రాజగోపాలన్  గారు. వీరి వద్ద తక్కిన రెండు పరిచేయాత్మక ధ్యాన సిట్టింగులు పూర్తి చేసి ధ్యానం ప్రారంభించడం జరిగింది. విశేషం ఏమిటంటే అప్పటి నుండి ఇప్పటిదాకా వారు తన సాధన విడువకుండా కొనసాగించడం. ఎంత తీరిక లేకుండా ఉన్నా ఎక్కడున్నా, ఒక ప్రక్క వ్యాపారం  చేస్తూ, మరో ప్రక్క సంసార బాధ్యతలను వహిస్తూ కూడా తన సాధనా క్రమం ఎక్కడా తప్పకుండా కొనసాగించేవారట. ఇది గాక, వారికి పుస్తకాలు విపరీతంగా చారివేవారట; అన్నీ రకాల సాహిత్యం ముఖ్యంగా స్వీయ వికాస గ్రంథాలు, ఆధ్యాత్మిక సాహిత్యము, బాగా చదివేవారట. ప్రస్తుతం ఎన్నో గ్రంథాలు రచిస్తున్నారు. 
 1977 లో, షాజహాన్పూర్ (ఉ. ప్ర.) వాస్తవ్యులయిన, తన గురుదేవులైన పూజ్య బాబూజీతో మొట్టమొదటి కలయిక సంభవిస్తుంది.  ఆ మొట్టమొదటి దర్శనంలో ముఖాముఖీ సంభాషణ ఏమీ జరుగకపోయినా, ఇరువురి మధ్య మౌన సంభాషణ బాగా జరిగిందంటారు దాజీ అంతేగాక దాజీ ఇంటికి వెడుతూ బాబూజీని దర్శించి నమస్కారం పెట్టి వెడుతూండగా, "ఆకురాడిని ఫలానా మందు, వెన్నతో గ్రహించమని చెప్పు" అని బాబూజీ సహాచార్యుని ద్వారా సందేశం పంపిస్తారు.  పూజ్య దాజీ ఆశ్చర్యపోతారు, తనకు ఆ ఆరోగ్య సమస్య ఉందని ఆయనకెలా తెలిసిందని నివ్వెరపోతారు. ఆ విధంగా దాజీకి పూజ్య బాబూజీ ప్రథమ దర్శనం జరుగుతుంది.  
ఆ తరువాత యథాతథంగా తన అభ్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా వెళ్ళి అక్కడ తన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. న్యూ యార్క్ నగరంలో ఆయన వ్యాపారం విస్తరిస్తుంది. అయినప్పటికీ తన సాధనలో ఎక్కడా క్రమం తప్పలేదు. ఆరి ఆధ్యాత్మిక తృష్ణ తన లక్ష్యసాధన కోసం అంత లోతుగా ఉండేది. అలా పూజ్య దాజీ వ్యక్తిత్వం తూర్పు దేశాల హృదయం, పాశ్చాత్య దేశాల మేధస్సుల అద్భుత మిశ్రమంగా ఉండేది. 
(సశేషం ... )


26, సెప్టెంబర్ 2025, శుక్రవారం

పూజ్య గురుదేవులు దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025


 Irresistible Craving

(☝పైన లింక్ క్లిక్ చేయండి, దాజీ పై చిన్న వీడియో వీక్షించండి)

పూజ్య దాజీ 70 వ జన్మదినోత్సవం - 2025 

ఈ సెప్టెంబర్ 28న పూజ్య గురుదేవులు దాజీ 70 వ జన్మదినోత్సవం, కాన్హా శాంతి వనంలో మనందరమూ జరుపుకోబోతున్నాం.   

ఈ మహాత్ముడు గుజరాత్ రాష్ట్రంలో 1956 వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. వీరిలో మొదటి నుండి, భగవంతుని కోసం నిరోధించలేని ప్రబలమైన తపన కలిగి ఉండేవారు. కొంచెం ఊహ వచ్చిన తరువాత శ్రీరామకృష్ణ కథామృతం అనే గ్రంథాన్ని చదువుతూ తన్మయత్వం చెందుతూండేవారు. కంటి నుండి అశ్రువులు కారుతూ ఉండేవి. స్వామి వివేకానందలా తయారవ్వాలన్న తీవ్ర ఆకాంక్ష ఉండేదట. సన్న్యాసిగా  మారదామని ఇంట్లో నుండి బయల్దేరారట కూడా. హిమాలయాలలో తపస్సు చేసినటువంటి ఒక 80 యేళ్ళ సాధువు సలహాతో ప్రభావితమై ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత తనకు తోచినట్లుగా మార్గదర్శనం లేకుండా ధ్యానం చేస్తూండటం చూసి, ఒక స్నేహితుడు, ధ్యానం పద్ధతిగా నేర్చుకునేందుకు సహజమార్గ ప్రశిక్షకురాలైన శ్రీమతి ద్రౌపదీ బెహన్ గారి వద్దకు తీసుకువెడతాడు. ఆమె "ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నావు?" అని అడుగుతారు. దానికి దాజీ "నేను స్వామి వివేకానందలా తయారవ్వాలనుకుంటున్నాను" అని జవాబిచ్చారట. "దానికి సన్న్యాసి గా తయారవ్వాల్సిన అవసరం లేదు. మగ, ఆడ అని ఇద్దరినీ సృష్టించడానికి భాగ్యవంతుడేమీ మూర్ఖుడు కాదు" అని అంటారామె. ఈ వాక్యం దాజీని బాగా ప్రభావితం చేస్తుంది. ఆ తరువాత ఆమె ద్వారా మొదటి ధ్యాన సిట్టింగ్ తీసుకుంటారు. దాజీకి ఆ ధ్యానంలో శ్రీరామకృష్ణ పరమహంస, బంగారు ఛాయలో ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ధ్యాన సిట్టింగ్ నిర్వహించిన ద్రౌపదీ బెహన్ గారికి కంటి నుండి అశ్రువులు ధారలుగా రావడం ప్రారంభించాయట. ఆమె పరవశించి, ఆశ్చర్యానికి గురై, "నీకు మిగిలిన రెండు సిట్టింగులు అహమ్మదాబాదులో అనుభవుజ్ఞులైన ప్రశిక్షకులు ఒకాయన ఉన్నారు; ఆయన వద్దకు వెళ్ళు" అని పంపించారట. ఆ విధంగా వారికి సహజ మార్గంలో 1976 లో ప్రవేశించడం జరిగింది. ఆ సమయంలో వారు ఫార్మసీ చదువుతున్నారట. వారితోపాటు నెమ్మది-నెమ్మదిగా వారి తోటి విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ ధ్యానాన్ని ప్రారంభించి నిత్యం సాధన కూడా క్రమం తప్పకుండా చేస్తూండేవారట.  

సశేషం ...  

16, సెప్టెంబర్ 2025, మంగళవారం

జిజ్ఞాస - తపన

 


జిజ్ఞాస - తపన 
*
जिज्ञासा ज्ञानहेतुः स्यात् मोक्षमार्गप्रवर्तिका ।

జిజ్ఞాస జ్ఞానహేతు: స్యాత్  మోక్షమార్గప్రవర్తికా |

(అర్థం: జ్ఞానానికి కారణం జిజ్ఞాస. సాధకుడిని మోక్షమార్గంలో స్థిరపరచేది ఈ జిజ్ఞాస.)
*
జిజ్ఞాస అంటే తెలుసుకోవడం కోసం తపించడం; జ్ఞానం కోసం పరితపించడం.  ఈ జిజ్ఞాస దేనికోసమైనా కావచ్చు. జిజ్ఞాస ప్రధానంగా రెండు రకాలు - లౌకిక జిజ్ఞాస, ఆధ్యాత్మిక జిజ్ఞాస. 
లౌకిక విషయాల కోసం తపించడం లౌకిక జిజ్ఞాస అవుతుంది. పరమసత్యాన్ని తెలుసుకోవాలన్న తపనను ఆధ్యాత్మిక జిజ్ఞాస అంటారు. దీన్నే బ్రహ్మ జిజ్ఞాస అని కూడా అంటారు, నామరూపగుణరహితమైన పరమసత్యాన్ని తెలుసుకోవడం కోసం పరితపించడం.  
మనం ప్రస్తుతం చర్చించుకుంటున్నది ఆధ్యాత్మిక జిజ్ఞాసను గురించి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అనికూడా అంటాం. మనిషి తనను గురించి, తన చుట్టూ ఉన్న సృష్టిని గురించి, సృష్టికి మూల కారణమైనదాన్ని గురించి, స్వతః సిద్ధంగా తెలుసుకోవాలని పరితపిస్తూ ఉంటాడు. మనిషి మనుగడకు, తన ఆధ్యాత్మిక పరిణతికి ఈ తపనే ఇంధనంలా పని చేస్తూ ఉంటుంది. ఇది ఆత్మలో స్వతఃసిద్ధంగా ఉంది. తప్పించుకోలేనిది. ఈ తపన యొక్క గమ్యం ఆ పరమసత్యాన్ని కనుగొనడమే, ఆ జ్ఞానానుభూతి కలగడమే; అప్పుడే ఆత్మకు సంతుష్టి కలిగేది. ఈ ఆధ్యాత్మిక ఆకలి ఎంత తీవ్రంగా ఉంటే, గమ్యం అంత చేరువవుతుంది. 
బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన లక్షణాలు - 1)వివేకం, 2)వైరాగ్యం, 3)షట్ సంపత్తి (శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధాన) అనే 6 లక్షణాలు, ముముక్షుత్వం (మోక్షం కోసం తీవ్ర తపన). ఇవేవీ లేకపోయినట్లయితే ఆధ్యాత్మిక యాత్ర, నిజమైన జిజ్ఞాస గాకుండగా, కేవలం కృత్రిమమైన పైపైకి మాత్రమే ఉన్న కుతూహలంగా మిగిలిపోతుంది. కుతూహలం అంటే తేలికగా ఉండేది, దృష్టి తేలికగా మరలే తత్త్వం. జిజ్ఞాస అంటే లోతైనది, అస్తిత్వానికి సంబంధించినది, పరివార్తనతో కూడినది. 
జిజ్ఞాస అభివ్యక్తమయ్యే విధానాలు:
శ్రవణం, మననం, నిధిధ్యాసనం,  గురువును సరైన ప్రశ్నలను అడగటం, అత్యున్నత సాక్షాత్కారం కోసం సరళమైన, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని కొనసాగించడం. 
ఆవిద్యకు, విద్యకు వారధి జిజ్ఞాస. కాబట్టి దీన్ని పెంపొందించుకునే పనిలో ప్రతి సాధకుడు, నిరంతరం నిమగ్నమై ఉండాలి. 



సంపూర్ణ శరణాగతి

 


సంపూర్ణ శరణాగతి
సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ|| 
*
ఆ పరమాత్మలో సంపూర్ణ లయం కావాలనుకునే ఆధ్యాత్మిక సాధకులకు, భక్తులకు వర్తించే పదం, ఈ శరణాగతి అనే పదం. ఎందుకంటే భాగ్యవంతునిలో సంపూర్ణ ఐక్యం పొందాలంటే ఇదే అతి దగ్గర మార్గం. కానీ నిజానికి ఇది ప్రతి ఒక్కరికీ  అవసరమైన పదం.  
శరణాగతి అనగానే యేదో ఒక ఓడిపోయిన సన్నివేశంగా, అదొక బలహీనత అన్నట్లుగా, మనలో ఉన్న అహంకారానికి దెబ్బలా మొదట్లో అందరికీ తోస్తుంది. కానీ యదార్థం అది కాదు. 
భగవంతుని మహత్తును యదార్థంగా గుర్తించడం, ఆయన సమక్షంలో మన యదార్థ స్థితిని యథాతథంగా గుర్తించడం, ఆ స్పృహతో జీవితం కొనసాగించడం శరణాగతి అంటే. 
అయితే శరణాగతి అనే ఆధ్యాత్మిక స్థితి సముచిత సమయంలో సంభవిస్తుంది తప్ప, ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఎందుకంటే ఇడి అహం లేని స్థితి కాబట్టి. 
అయితే కొన్ని సాధనలు శరణాగతి దిశగా జీవితం కొనసాగేలా చేయవచ్చు. కానీ నిజమైన శరణాగతి ఆ భగవంతుని లేక ఆ గురువు అనుగ్రహం వల్లనే సంభవిస్తుందంటారు. వాటిల్లో కొన్ని - 1) భగవంతుడు ఆమోదించినవి (అనుకూలించేవి) స్వీకరించడం, అనుకూలించనివాటిని నిరాకరించడం 2) ఆయన సంరక్షణను నమ్మడం, ఆయన కాపాడుతున్నాడన్న నమ్మకం కలిగి ఉండటం, 3) వినమ్రంగా ఉండటం, ఆత్మ సపర్మాణ కలిగి ఉండటం. 
పైన చెప్పినవి కొంత వరకూ జటిలంగా ఆచరణకు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు. పూజ్య బాబూజీ దీన్ని మనకు సులభం చేసేశారు. శరణాగతి భగవంతునిపై అన్నిటికీ ఆధారపడటంతో ప్రారంభమవుతుందన్నారు. ఇది ఆచరణకు చాలా తేలిక. 
పూజ్య లాలాజీ మనం అదృశ్యమయితేనే మనలో ఉన్న భగవంతుడు విరాట రూపం ధరిస్తాడు, అంటే బహిర్గతమవుతాడంటారు. ఇలా ధ్యానం ద్వారా అదృశ్యమవడమే శరణాగతి అంటే. 
శరణాగతి వల్ల సిద్ధించే ఫలాలు - భయం నుండి సంపూర్ణ విముక్తి, సంస్కార భారం తొలగిపోవడం, అహం కరిగిపోవడం వల్ల అంతరంగ ప్రశాంతత, వినమ్రత, భక్తిరస ప్రాప్తి, భగవంతుని సాయుజ్యం లేక సంపూర్ణ లయం.
పైన చిత్రం: పూజ్య బాబూజీ, సంపూర్ణ శరణాగతి భావంతో ధ్యాన భంగిమలో ఉన్నట్లుగా తోస్తుంది. 

20, ఆగస్టు 2025, బుధవారం

కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు

 


కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక పదాలు - వాటి అర్థాలు 

అనంత ఆధ్యాత్మిక సాహిత్యంలో మనం తరచూ కొన్ని పదాలు చదువుతూ ఉంటాం. కొన్నిటికి అర్థాలు తెలిసినట్లనిపిస్తుంది; కొన్నిటికి అస్పష్టంగా అర్థం తెలుస్తూ ఉంటుంది; కొన్నిటికీ అర్థం తెలియక ఓయినా చదవడం కొనసాగిస్తూ ఉంటాం. ఫలితంగా మన అవగాహణలో కొరతలు ఉన్నాయని మనకే అర్థమవుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని సాధ్యమైనంత వరకూ తగ్గించుకునే ప్రయత్నంలో ప్రతీ సాధకుడూ ఉండాలి. అటువంటి కొన్ని పదాలను ఇక్కడ పరిశీలిద్దాం. 
శరీరాలు 3
స్థూల శరీరం: భౌతికంగా కనిపించే శరీరం; ఇందులో ఉన్న వివిధ అవయవాలు, ఎముకలు, మాంసము, రక్తము, నరాలు, నాడులు, చర్మము ఇత్యాదివన్నీ స్థూల శరీరంలోకి వస్తాయి.   
సూక్ష్మ శరీరం: 19 సూక్ష్మ శరీరాలు - 5 కర్మేంద్రియాలు (పాద, పాణి, పాయు (మల ద్వారం), వాక్, ఉపాస్థ(మర్మేంద్రియాలు) ) , 5 జ్ఞానేంద్రియాలు (కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం), 5 వాయువులు(ప్రాణ, అపాన, వ్యాన ఉదాన, సమాన వాయువులు), మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. వీటిల్లో ప్రధానమైనవి మనసు, బుద్ధి, అహంకార్యము, చిత్తము.  వీటన్నిటినీ కలిపి సూక్ష్మ శరీరం అంటారు. 
కారణ శరీరం: పై మూడు శరీరాలు ఒకదానికొకటి సంబంధం గలవి. పై రెండు శరీరాలకు బీజం వంటిది కారణ శరీరం. అందుకే దీన్ని కారణ శరీరం అంటారు. స్థూల శరీరం పడిపోయిన తరువాత కొనసాగేది ఈ శరీరమే. ఇందులోనే అన్ని జన్మల సంస్కారాలు బీజరూపంలో ఉంటాయంటారు. దీన్నే కొందరు ఆత్మ అని కూడా అంటారు; మరికొందరు ఆత్మ వేరు, కారణ శరీరం వేరు అంటారు. కారణ శరీరానికి ఆవల ఆత్మ విడిగా ఉందని కొందరు నమ్ముతారు. యేది ఏమైనప్పటికీ మానవ లోకాన్ని, ఉన్నత లోకాలను అనుసంధానం చేసేది ఈ కారణ శరీరం. 
హార్ట్ఫుల్నెస్ - సహజ్ మార్గ్ కు సంబంధించినంత వరకూ సూక్ష్మ శరీరాలు ప్రధానంగా 4 - మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము (లేక చైతన్యము). 
మనసు - హృదయము 
మనసు పనే ఆలోచించడం; మనసు ఆలోచనల పుట్ట. మరి హృదయం అంటే ఏమిటి? తెలుగు భాషలో వాడుక భాషలో మనసున్న మనిషి అంటే మంచి హృదయం ఉన్న మనిషి అని అర్థం; మంచి మైండ్  ఉన్న మనిషి అని కాదు. సంస్కృతంలో మనస్ అంటే ఆలోచించే శక్తి. ఆధ్యాత్మిక సాహిత్యం చదివేటప్పుడు మనస్సు అన్నప్పుడు మనస్ (మైండ్) అనే అర్థం చేసుకోవాలి. 
మనస్ కి హృదయానికి తేడా ఏమిటి అని పూజ్య దాజీని అడిగినప్పుడు, ఆయన, మనస్, హృదయము  ఒకే వస్తువుకున్న  రెండు కొనలు వంటివి అని చెప్పడం జరిగింది. 
మనసు - బుద్ధి 
మనసు ఆలోచిస్తుంది; ఆలోచించే శక్తి. బుద్ధి ఆలోచనల్లోని మంచి-చెడు విచక్షణ చేసి నిర్ణయాలు తీసుకునే శక్తి. 
బుద్ధి - అహం 
బుద్ధి నిర్ణయం తీసుకుంటే, అమలు చేసేది అహం. కాబట్టి అహం మనిషికి అవసరం. 
అహం -అస్మిత 
అహం తగినంత మోతాదులో ఉంటే దాన్ని అస్మిత అంటారు. అంటే మనిషికి ఉన్నతికి ఉపయోగకరమైన శక్తి. మనిషి మనుగడకు అవసరమైనది.  మోతాదు మించినప్పుడు అది అహంకారంగా మారుతుంది. మనిషికి అవరోధమవుతుంది. మోతాదుకు మించి మరీ ఎక్కువైనప్పుడు దురహంకారం అవుతుంది. దురహంకారం ఆత్మవినాశనానికి దారి తీస్తుంది. 
చిత్తము, చిత్ లేక చైతన్యము 
చిత్తము లేక చిత్ సరోవరం ఆజ్ఞా చక్రానికి వెనుక ఒక అంగుళం లోతులో ఉందని పూజ్య దాజీ చెప్పడం జరిగింది. ఇక్కడే నుండే ఆలోచనల ప్రవాహం హృదయం వైపు ప్రవహిస్తాయి. ఇక్కడే సంస్కారాల బీజాలు కూడా ఉండేది. చిత్ అంటే చైతన్యం కూడా. ఇందులోనే మనస్, బుద్ధి, అహం అనే సూక్ష్మ శరీరాలు ఇమిడి ఉన్నాయి. అందుకే మనస్, బుద్ధి, అహంకారాలు శుద్ధి జరిగినప్పుడు చైతన్య శుద్ధి కూడా జరిగి, మనిషిలో సమూల మార్పులు రావడం ప్రారంభిస్తాయి.  

18, ఆగస్టు 2025, సోమవారం

శ్రీకృష్ణ జన్మాష్టమి - 2025

 


శ్రీకృష్ణ  జన్మాష్టమి - 2025 

ఈ సంవత్సరం శ్రీ రామ చంద్ర మిషన్ సంస్థ ప్రధాన కార్యాలయం అయిన హైదరాబాదులోని కాన్హా శాంతి వనంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఆధ్యాత్మిక శోభతో ఎంతో ఘనంగా ఆధ్యాత్మిక భాండారాతో సమానంగా జరుపుకోవడం జరిగింది. కొన్ని వేలమంది అభ్యాసులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కొన్ని వేల మంది ప్రత్యక్షంగా లైవ్ లో వీక్షించడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో పూజ్య దాజీ ధ్యానం నిర్వహించక పూర్వం, ముఖ్య అతిథిగా  విచ్చేసిన, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రస్తుత సర్ సంఘ్ సంచాలక్ గా వ్యవహరిస్తున్న శ్రీమాన్ మోహన్ భాగవత్ గారు, పూజ్య దాజీ మనవిపై ఒక అద్భుత ప్రసంగం చేయడం జరిగింది. 

  ఈ సందర్భంగా పూజ్య దాజీ పలికిన పలుకులు ఇలా ఉన్నాయి: 
".... హార్ట్ఫుల్నెస్ సంస్థ ఏకైక లక్ష్యం భూమ్మీద ఉన్న ప్రతీ ఇంట్లోనూ ధ్యానం జరగాలని, ప్రతీ హృదయం ధ్యానించాలన్నదే". "2025 వ సంవత్సరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నూరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  ఈ సంస్థ ఒక విస్తృతమైన, పరిపక్వమైన, నిస్స్వార్థ సంస్థ; గత నూరేళ్ళుగా ఎందరో యువకులు వివాహం కూడా చేసుకోకుండా, ఎంతో క్రమశిక్షణతో, అంకితభావంతో, దేశ ప్రగతి కోసం సేవలో నిమగ్నమై ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేసిన ఒక పటిష్ఠమైన సంస్థ" అంటూ మోహన్ భాగవత్ గారిని మన సంస్థ అభ్యాసులకు మార్గదర్శనం చేయమని, ఈ రోజు యొక్క ప్రాశస్త్యం గురించి మాట్లాడి ప్రేరణ కలిగించాలని కోరడం జరిగింది.
ఈ ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు:
శ్రద్ధేయ  దాజీ ముందుంచిన వారి భావాలకు సమాధానాలన్నీ,  మనం శ్రీకృష్ణ భగవానుడి జీవిత చరిత్ర నుండి, మచ్చలేకుండా వారు జీవించిన విధానం  నుండి, వారి వివేకం నుండి, వారి వాణి నుండి మనం పొందవచ్చు. శ్రీకృష్ణుడికి జీవితం అంతా ఆ విధంగా జీవించేటువంటి శక్తి ఎలా అచ్చయింది? ఇనో విషమ పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. యేదైనా పని యశశ్విగా చేయాలంటే  ఎలాగో భగవద్గీతలో చెప్పడం జరిగింది:  1) అధిష్ఠానం: అందరిలో ప్రేమ ఉంది; ఆ ప్రేమను నిరంతరం అనుభూతి చెందడం ఆవసరం; ఈ ప్రేమను ఆధారంగా చేసుకొని జీ వించడమే అధిష్ఠానం; ధ్యానం యొక్క లక్ష్యం కూడా ఆదేనని నుకుంటూ ఉంటాను; ఎందుకంటే ధ్యాన స్థితితో ఎప్పుడూ కూడి ఉండే ప్రయత్నంలో ఉంటాం గనుక. యే తత్త్వంతో అయితే సర్వమూ కలిసి ఉన్నాయో, ఆ ఒక్క తత్త్వం యొక స్మరణలో నిరంతరం అనుభూతి చెందడమే కదా ధ్యానం అంటే. ఆ అధిష్ఠానమే భగవంతుడంటె. యోగః కర్మసు కౌశలం. ఆ భగవంతునితో అనుసంధానం కలిగి ఉంటూ కర్మ చేయడం. యేం చేసావన్నది ప్రధానం కాదు; ఏ విధంగా చేశావన్నదే ముఖ్యం.    2) కరణం - అంటే కార్యం చేసే పద్ధతి. సరైన విధంగా పనులు చేస్తే సరైన ఫలితాలు వస్తాయి. పద్ధతి ప్రకారం చేస్తే పనులు సరిగ్గా అవుతాయి. శ్రీకృష్ణ భగవానుడు చేయడం గాక పాండవుల చేత చేయించేవాడు, కీర్తి వాళ్ళకి కట్టబెట్టేవాడు. ఆయన పరమ యోగేశ్వరుడు, అన్నీ ముందే తెలిసినవాడు; అయినా ఉదాహరణగా నిలుస్తూ అందరి చేత కారమను చేయియించేడు; కర్మ యోగం నేర్పించాడు. సమర్థుడైనా కూడా ఒక క్రమశిక్షణలో ఉండవలసి వస్తుంది; ధర్మం అనే క్రమశిక్షణ అందరికీ ఉంది. 
               
            अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् |
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ||

వెరసి మన జీవితం విజయవంతంగా కాదు, అర్థవంతంగా ఉండాలన్నారు. 
 

15, ఆగస్టు 2025, శుక్రవారం

సమృద్ధ భారత్



సమృద్ధ భారత్ 

మన త్రివర్ణ పతాకం 79 వ భారత స్వాతంత్ర్య దినోత్సా సందర్భంగా కనుల విందుగా రెపరెపలాడుతున్నది. గర్వంగా భారతీయులందరూ జైహింద్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు. 

ఎందరో మహానుభావులు, ఎందరో దేశభక్తులు ఎన్నెన్నో త్యాగాలు చేస్తే లభించిన స్వాతంత్ర్యం. అందరినీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. అదే సమయంలో ఈ రోజు మన ప్రధాన మంత్రి, ఢిల్లీలో ఎర్రకోటపై  జాతీయ పతాకం ఎగురవేస్తూ ప్రతీ ఒక్క భారతీయునికి ఇచ్చిన పిలుపును మనసు నిండా నిలుపుకొని సమృద్ధ భారత్ దిశగా కృషి చేయాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు. ఎవరి తోడ్పాటును వారందించాలన్న సంకల్పం చేసుకోవలసిన రోజు. 

ఇందుకు ప్రతీ ఒక్కరూ తమలో దేశభక్తిని పెంపొందించుకునేందుకు, నిత్యస్ఫూర్తితో జీవించేందుకు ప్రతి ఒక్కరూ తప్పక స్వామి వివేకానంద వ్యక్తిత్వంపై, వారి జీవిత చరిత్రను అధ్యయనం చేయవలసి ఉంది. వారి జీవిత ప్రారంభ దశలో దేవుడెక్కడున్నాడు? దేవుడిని చూశారా? అని కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవారు. అలా ఆధ్యాత్మికపరంగా సర్వమూ విదితమైన తరువాత చివరి సంవత్సరాలలో దేశం గురించి మాత్రమే ప్రసంగించేవారు. అమెరికా వెళ్ళి షికాగోలో కోడి అయి కూసి భారతీయులను మేలుకొల్పారు. వారి స్ఫూర్తి ఫలితంగా స్వాతంత్ర్య ఉద్యమం ఊపందుకుంది. ఎందరో ప్రేరితులై క్రియాన్వితులయ్యారు. ఫలితంగా ఈ రోజు మనం సుఖ శ్వాసలను పీల్చుకుంటున్నాం. ఆధునిక భారతంలో మరలా ఈ దేశభక్తి సమృద్ధి దిశగా కృషి చేయడానికి కనిపించకుండా పని చేస్తున్న ఎందరో మహాత్ములున్నారు. దేశభక్తి ద్వారానే దైవప్రాప్తి సాధ్యంఅని చాటిన మహానీయులెందరో! 


 

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...