కరీంనగర్ ఆశ్రమంలో ఆవులు 2020
తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 7
పూజ్య దాజీ ప్రసాదించిన మరో వరం. కరీంనగర్లో పని చేస్తున్న రోజుల్లో 2020 లో మన స్థానిక అభ్యాసులు మన ఆశ్రమంలో ఆవులు పెంచడం జరిగింది. అప్పుడొక ఆవు, ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని తెలియజేస్తూ, ఆ దూడకు యేదైనా పేరు పెట్టమని పూజ్య దాజీని కోరడం జరిగింది, ఫోటో కూడా పంపించడం జరిగింది. దానికి వారు ఎంతో కరుణతో "భోలీ" అని నామకరణం చేశారు.
పైన చిత్రంలో కుడి ప్రక్కన ఉన్నది భోలీ. ఎడమ ప్రక్కన ఉన్నది అన్నపూర్ణ. సోదరులు మధుసూదన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆవుల పట్ల మంచి శ్రద్ధ చూపించేవారు. ధన్యులు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి