సంస్కృత సుభాషితాలు, శ్లోకాలు - 2
ధృతిః క్షమా దమః ఆస్తేయం
శౌచమింద్రియనిగ్రహః
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం.
తాత్పర్యం:
ధృతి (ధైర్యం), క్షమా, దమ, దొంగిలించకుండుట, శుచి, ఇంద్రియనిగ్రహము, సద్బుద్ధి, విద్య, సత్యము, కోపము లేకుండుట, ఈ పదీ ధర్మ లక్షణాలు.
అద్భిర్ గాత్రాణి శుద్ధ్యంతి మనః
సత్యేన శుధ్యంతి,
విద్యాతపోభ్యాం భూతాత్మా బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యంతి.
తాత్పర్యం:
శరీరాన్ని నీరు శుద్ధి చేస్తుంది, మనస్సు సత్యము చేత శుద్ధి చేయబడుతుంది, విద్య తపస్సుల చేత ఆత్మశుద్ధి జరుగుతుంది, బుద్ధి జ్ఞానము చేత శుద్ధి అవుతుంది.
ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి.
తాత్పర్యం:
ఆకాశం నుండి నీరు క్రిందకు పడి, యే విధంగా సముద్రం చేరుకుంటుందో, అదే విధంగా దేవతలందరికీ చేసే నమస్కారాలన్నీ కూడా ఆ కేశవుడినే చేరుతాయి.
దుర్లభం త్రయం ఏవ ఏతత్ దేవానుగ్రహ హేతుకం
మనుష్యత్వం ముముక్షత్వం మహాపూషః
సమాశ్రయః.
తాత్పర్యం:
దైవానుగ్రహం లేనిదే ఈ మూడు విషయాలు లభించడం దుర్లభం - మానవ జన్మ, భగవంతుని కోసం తపన, ఒక మహాపురుషుని ఆశ్రయం. - ఆది శంకరాచార్య, వివేకచూడామణి
జరా
రూపం హరతి, ధైర్యమాశా, మృత్యుః ప్రాణాన్, ధర్మచర్యామసూయా,
క్రోధః శ్రియం, శీలమనార్యసేవ, హ్రియం కామః, సర్వమేవాభిమానః.
తాత్పర్యం:
వృద్ధాప్యం రూపాన్ని హరిస్తుంది, ఆశ ధైర్యాన్ని హరిస్తుంది, మృత్యువు ప్రాణాలను హరిస్తుంది, ధర్మంగా ఉండే నడవడిని అసూయ హరిస్తుంది, కోపం ప్రతిష్ఠను హరిస్తుంది, సౌశీల్యం దుష్ట సాంగత్యాన్ని హరిస్తుంది, సిగ్గు కామాన్ని హరిస్తుంది, దురహంకారం సర్వాన్నీ హరిస్తుంది.
యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః,
యత్ర ఎతాః న పూజ్యంతే సర్వాస్తత్రాఫలాః
క్రియాః.
తాత్పర్యం:
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, అక్కడ దేవతలు నివసిస్తారు; ఎక్కడ స్త్రీలు పూజింపబడరో అక్కడ న్నీ వైఫ్యల్యానికే దారి తీస్తాయి. - మనుస్మృతి
కేయూరాణి న విభూషయంతి పురుషం; హారా న చంద్రోజ్వలా,
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా
మూర్ధజాః; వాణ్యేకా సమలంకరోతి
పురుషం యా సంస్కృతా ధార్యతే; క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం.
తాత్పర్యం:
ఆత్మను కేయూరాలతో (పూలతో) అలంకరించలేము, స్నానం ద్వారా గాని, సుగంధముల చేత గాని, జుట్టును కూమయాల ద్వారా అలంకరించడం ద్వారా గాని ఆత్మకు అలంకారం చేయలేము. వాణిలో సంస్కృతం ఉంటేనే ఆత్మను అలంకరించగలం; ఎప్పటికీ నాశనం లేనిది, ఈ వాక్కుకు ఆభరణంగా ఉండేది ఈ సంస్కృతమే.
ఓమ్ త్రయంబకం యజామహే సుగంధిం
పుష్టివర్ధనంఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్
తాత్పర్యం:
త్ర్యంబకం అంటే మూడు కన్నులవాడిని యజామహే పూజిస్తున్నాము; ఆధ్యాత్మిక సౌరభంతో భాసిస్తూ మా ఆధ్యాత్మిక అంతరాళానికి పుష్ఠి కలిగించాలని ప్రార్థిస్తున్నాం.
కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే చ సరస్వతి,
కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం.
తాత్పర్యం:
అరచేతి అంచులో లక్ష్మీ, అరచేతి మధ్యలో సరస్వతి, అరచేతి మూలలో గోవిందుడు, ఉన్న కర దర్శనాన్ని ఉదయాన్నే చేసుకుంటున్నాము.
ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే
మృగాః
తాత్పర్యం:
శ్రమించడం ద్వారా మాత్రమే కార్యాలు సిద్ధిస్తాయి; కేవలం కోరుకున్నంత మాత్రాన సరిపోదు. సింహం నోట్లోకి మృగం యే విధంగా తనంతట అదే ప్రవేశించదో, సింహం యే విధంగా వేటాడా వలసి ఉంటుందో, అదే విధంగా మనిషి శ్రామిస్తే గాని పనులు సిద్ధించవు.
మూకం కరోతి వాచాలం పంగ్ ఉల్లంఘయతే గిరింయత్కృపా తమహం వందే పరమానందమాధవం.
తాత్పర్యం:
పరమానందానికి నిలయమైన భగవంతుని కృప ఉన్నట్లయితే, మూగవాడు అనర్గళంగా మాట్లాడగలుగుతాడు, కాళ్ళు లేనివాడు కొండలు చక చకా ఎక్కగలుగుతాడు.
ఓమ్ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ
పూర్ణామేవావశిష్యతే.
తాత్పర్యం:
భగవంతుడు పరిపూర్ణుడు. ఈ ప్రపంచం పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన ఈ ప్రపంచం భగవంతుడి నుండే పుట్టింది. పరిపూర్ణత నుండి పరిపూర్ణాతను తీసివేసినా పరిపూర్ణతే మిగిలి ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి