20, మే 2025, మంగళవారం

భయం

 


భయం 
భయం ప్రతి జీవిలోనూ ఉండేదే. మనం ముఖ్యంగా మనుషుల్లో ఉండే భయాన్ని గురించి చర్చించుకుందాం. 
భయం వల్ల మనిషి సరిగ్గా ఎదగవలసిన విధంగా ఎదగడం జరగదు. ఆధ్యాత్మికంగా కూడా. అలాగని భయం పూర్తిగా చెడ్డదని అనడానికి కూడా లేదు. కొంత భయం అవసరం అని కూడా అనుభవం ద్వారా తెలుసుకున్నాడు మనిషి. 
రకరకాల భయాలు - చీకటి అంటే భయం, ఎత్తులంటే భయం, పాకే జీవులంటే (పాములు ఇత్యాదివి) భయం. తిరస్కరిస్తారన్న  భయం, విఫలమవుతామన్న భయం, అపరాధం చేసినప్పుడు కలిగే భయం, అసత్యం పలికినప్పుడు కలిగే భయం,  తప్పులు చేసినప్పుడు కలిగే భయం, కారణం తెలియని భయం, ఇలా ఎన్ని రకాల భయాలున్నా, అసలు భయం మాత్రం మృత్యు భయమే. ఆ భయం పోయిందంటే సమస్త భయాలూ పోతాయి. అమృతత్వం లభిస్తుంది అంటారు మన పెద్దలు. 
ఈ భయం ముందు ఆందోళనకు దారి తీస్తుంది, వివేకం పని చేయదు, ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది. జీవితంలో యే విధంగానూ ఎదగడం జరగదు. 
అయితే ఈ భయానికి మూల కారణం ఏమిటి? మన శాస్త్రాలేమంటున్నాయి?మన మహర్షులేమంటున్నారు? మన హార్ట్ఫుల్నెస్ గురుపరంపర చెప్పేదేమిటి? భయాన్ని పోగొట్టుకోడానికి పరిష్కారాలేమయినా ఉన్నాయా? 
వేదంలో
అభినో భద్రాః క్రతవో యంతు విశ్వతః 
- ఋగ్వేదం 
దీనర్థం: అన్ని వైపుల నుండి ఉదాత్తమైన ఆలోచనలు కలుగుగాక. భయం అజ్ఞానం నుండి పుడుతుంది కాబట్టి, దీన్ని అధిగమించడానికి అన్ని దిక్కుల నుండి ఉదాత్తమైన, సాత్త్వికమైన ఆలోచనలు కలుగుగాక అని దీని అర్థం. 
ఉపనిషత్తుల్లో  
ద్వితీయాడ్ వి భయం భవతి 
- బృహదారణ్యక ఉపనిషత్తు 
దీనర్థం: ద్వంద్వం వల్లే భయం పుడుతుంది. అద్వైతం ద్వారానే భయం పతుంది అంటుంది ఉపనిషత్తు. 
భగవద్గీతలో 
అజ్ఞానం వల్ల, మమకారం వల్ల కలిగే బంధాల వల్ల భయం పుడుతుందంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో.  దీన్ని భక్తి వైరాగ్యాల చేత, ఆత్మ సాక్షాత్కారం ద్వారా అధిగమించాలంటాడు గీతాచార్యుడు. 
అభయం శతత్వ సంశుద్ధిర్ జ్ఞాన యోగా వ్యవస్థితః 
అభయం (నిర్భయత్వం) మనసు పవిత్రంగా శుద్ధిగా ఉన్నప్పుడు, ఆధ్యాత్మిక వివేకం కలిగినప్పుడు సాధ్యపడుతుందని దీని అర్థం. 
శ్రీమద్రామాయణం 
హనుమంతుడు భక్తి-విశ్వాసాల ద్వారా, సాహసం ద్వారా భయాన్ని అధిగమిస్తాడు. 
రామో విగ్రహవాన్ ధర్మః 
అంటే రాముడు మూర్తీభవించిన ధర్మం. అందుఅల్లా ఆ దివ్య వ్యక్తిత్వం, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వీడలేదు. 
మహాభారతం 
యుధిష్ఠరుడు సత్యనిశఠతో ఉండటం వల్ల నిర్భయతవాన్ని సాధించాడు. 
భీష్ముడు మృత్యుశయ్యపై ఉన్నా కూడా భయం లేకపోవడానికి కారణం జీవితం అంతా ధార్మికంగా జీవించడం వల్ల. 
మన శాస్త్రాల ప్రకారం భయానికి మూలకారణాలు 
ఆవిద్య (అజ్ఞానం) - ఆత్మజ్ఞానం లేకపోవడం 
రాగద్వేషాలు - మమకారాలు, వికర్షణలు, కోల్పోతామన్న భయం 
అహంకారం - మృత్యుభయం 
కర్మ - వ్యక్తి చేసే కర్మల వల్ల కలిగే పరిణామాల భయం 
సహజ మార్గ గురుపరంపర 
ఆత్మ, ఆ పరమాత్మ నుండి, ఆ మూలం నుండి మొట్టమొదటిసారిగా విడిపోయినప్పుడు కలిగినది భయం. భయమే ఆత్మ ఏర్పరచుకున్న మొట్టమొదటి సంస్కారం. మిగిలిన సంస్కారాలన్నీ భయం వల్ల ఏర్పడ్డవే.  భయాన్ని నిరంతర స్మరణ ద్వారా తొలగించుకోవచ్చునన్నారు, పూజ్య చారీజీ మహారాజ్. 

8, మే 2025, గురువారం

అలసత్వం - బద్ధకం

 


అలసత్వం - బద్ధకం 

బహుశా అస్సలు అలసత్వం/బద్ధకం లేకుండా ఏ మనిషి ఉండడేమో! దీని వల్ల నష్టాలూ ఉన్నాయి, ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రయోజనాలున్నాయంటే ఆశ్చర్యపోకండి. ఉన్నాయి. 

అసలు బద్ధకానికి మూల కారణలేమిటో చూద్దాం. 1) స్పష్టమైన ప్రయోజనం లేనప్పుడు, జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు లేనప్పుడు 2) విఫలమవుతామన్న భయం ఉన్నప్పుడు లేక మనలో కొరతలున్నప్పుడు 3) చేయవలసిన పనులు ఎక్కువగా ఉన్నా లేక పెద్దవిగా ఉన్నా వచ్చేది 4) శక్తి లేనప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు 5) సుఖం ఎక్కువైనప్పుడు లేక మనసును మళ్ళించే విషయాలున్నప్పుడు 5) నకారాత్మకమైన ఆలోచనా విధానం ఉన్నప్పుడు. 

మరో దృష్టి కోణంలో నుండి చూస్తే ఆశ్చర్యకరంగా బద్ధకం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి: 1) సమర్థవంతంగా పనిచేసేలా చేస్తుంది - ఎందుకంటే బద్ధకస్తులు కష్టమైన పనులు త్వరగా/సరళంగా చేసే మార్గాలు వెతుకుతారు; నేను కష్టమైన పనిని బద్ధకస్తుడికి  అప్పగిస్తాను, ఎందుకంటే పని పూర్తి చేయడానికి అతను తేలిక మార్గం వెతుకుతాడు - బిల్ గేట్స్ 2) విశ్రాంతిని, శక్తిని కూడగట్టుకునేలా చేస్తుంది 3) మనలోని సృజనాత్మకతను పూరికొల్పుతుంది 4) కలిసిగట్టుగా పని చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, ఇతరులకు పని అప్పగించడం నేర్పిస్తుంది 5) ఆలోచింపజేస్తుంది, పని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచింపజేస్తుంది 6) ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది.  

అయితే ఆధ్యాత్మిక సందర్భంలో ఆలోచిస్తే, నిత్యం ఆధ్యాత్మిక సాధన చేయకపోవడానికి ముఖ్య కారణం బద్ధకమే. దీనికి పైన చెప్పిన కారణాలు గనుక మనలో ఉన్నట్లయితే, వాటికి పరిష్కారాలు కూడా తరచి చూస్తే వాటిల్లోనే కనిపిస్తాయి. 

అయితే అస్సలు బద్ధకం లేకుండా ఉండగలమా అన్నది ప్రశ్నే. అయితే పూజ్య చారీజీ కాస్త వెసులుబాటు కల్పించినట్లుగా అనిపించింది - పని లేనప్పుడు బద్ధకించవచ్చు గాని, పని ఉన్నప్పుడు బద్ధకించరాదన్నారు చారీజీ. తప్పక దీన్ని ప్రతి సాధకుడు పరిష్కరించుకోవలసినదే. ఆలోచించండి!

14, ఏప్రిల్ 2025, సోమవారం

శబ్దము - The Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్

 


శబ్దము - The  Subtle Vibration - ది సటల్ వైబ్రేషన్  

శబ్దము అనేది ఒక సంస్కృత పదం. శబ్దం అంటే పదం, ధ్వని, ప్రకంపనము, నాదము, ఇలా నానార్థాలున్నాయి. ప్రకంపనాన్నే వైబ్రేషన్ అంటారు, ఆంగ్లంలో. నిజానికి పరిశీలిస్తే పదం అన్నా, ధ్వని అన్నా, నాదం అన్నా అన్నీ ప్రకంపనలే. స్థూల ప్రకంపనాన్ని పదం అని గాని, ధ్వని అని గాని అనవచ్చు; నాదం అంటే సూక్ష్మ ప్రకంపనం అనవచ్చు; శబ్దం అంటే సూక్ష్మాతిసూక్ష్మ ప్రకంపనం, మూల ప్రకంపనం అని ఆధ్యాత్మిక సందర్భాలలో అర్థం చేసుకోవాలి. లాలాజీ తన గ్రంథాలలో శబ్ద యోగం గురించి ప్రస్తావిస్తారు. పూజ్య లాలాజీ తన గ్రంథాలలో వారు ఎక్కడెక్కడ శబ్దం అని ప్రయోగించారో, అక్కడ ఆ పదానికి బదులుగా ప్రాణాహుతి అని మార్చి చదువుకుంటే వారు వ్రాసిన ఆధ్యాత్మిక సూక్ష్మాలు తేలికగా అర్థం చేసుకోవచ్చునన్నారు, పూజ్య దాజీ. కాబట్టి శబ్దం అంటే ప్రాణాహుతి శక్తి అని కూడా అర్థం చేసుకోవాలి. ప్రాణాహుతి కంటే అతి సూక్ష్మ శక్తి సృష్టిలో లేదంటారు దాజీ. అందుకే దీన్ని ఆది శక్తి అని కూడా సంబోధిస్తారు వారు. 
మనలను, మన చుట్టూ ఉన్న సృష్టిని పరికించి చూస్తే, విశ్వమంతా మనతో సహా అన్నీ ప్రకంపనలే, వైబ్రేషన్సే. సర్వం శబ్ద మయం. కొన్ని స్థూలమైనవి (గ్రహాలు,,,  మనుషులు, వస్తువులు త్యాదివి), కొన్ని సూక్ష్మమైనవి (పరమాణువు స్థాయిలోనివి), మరికొన్ని సూక్ష్మాతి సూక్ష్మమైనవి (వివిధ రకాల చేతనా స్థాయిలు) , చివరిగా  అతి సూక్ష్మాతి సూక్ష్మ శక్తి - ప్రాణాహుతి, అనే ప్రకంపనలతో నిండి ఉంది ప్రపంచం. చివరికి చేతనం కూడా వైబ్రేషనే. ఆత్మ కూడా వైబ్రేషనే. గ్రహాలు, చెట్లు, జంతువులు అన్నీ వైబ్రేషన్లే.  అంటే మనందరమూ శబ్దాలమే. ఓంకార నాదం కూడా శబ్దమే. శబ్దమే పరమ సత్యం. ఈ సత్యాన్ని, ఈ మూలశబ్దంతో అనుసంధానమై, తాదాత్మ్యం చెందిన అనుభవం ద్వారా సాక్షాత్కరించుకునే యోగమే, శబ్దయోగం. హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ యోగసాధన ఈ దృక్కోణంలో చూస్తే శబ్దయోగమే. ప్రాణాహుతి ద్వారా అన్నీ స్థాయిల్లో సాక్షాత్కారం సుగమం అయిపోతుంది. వ్యక్తిగత అనుభవమే దీనికి నిదర్శనం. 

12, ఏప్రిల్ 2025, శనివారం

భక్త హనుమాన్ జయంతి

 

 భక్త హనుమాన్ జయంతి 

హనుమజ్జయంతి ప్రతి సంవత్సరమూ చైత్ర శుక్ల పౌర్ణమినాడు ప్రపంచమంతటా ఉన్న హిందువులు జరుపుకుంటారు. శ్రీరామాయణ కావ్యంలో హనుమంతుని పాత్ర ఎంత విశిష్ఠమైనదో మనందరికీ తెలిసినదే. భారతీయ సనాతన ధర్మంలో హనుమంతులవారు భక్తాగ్రేశ్వరులుగా పూజింపబడతారు.  భక్తికి పరాకాష్ఠగా హనుమంతులవారినే స్మరిస్తాం మనం. అలాగే వారి అమేయ శక్తికి, అపూర్వ వ్యక్తిత్వానికి, సౌశీల్యానికి, నడవడికి, ఆదర్శప్రాయులు. వీరి వ్యక్తిత్వాన్ని జూచి సాక్షాత్తు శ్రీరాములవారే, స్వయంగా, మొట్టమొదటసారి చూచినప్పుడే ముగ్ధులయిపోయారట. 

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ 

మరోగతా అజాఢ్యం వాక్పటుత్వంచ 

హనుమత్ స్మరణాద్భవేత్.

తాత్పర్యం: కేవలం హనుమంతులవారి స్మరణ మాత్రం చేత బుద్ధిబలం, యశస్సు(సత్కీర్తి), నిర్భయత్వం, రోగరాహిత్యము, అజాడ్యము, వాక్పటుత్వం  సిద్ధిస్తాయట. అటువంటిది వారి వ్యక్తిత్వం. 

వారి భక్తి స్వార్థరహితమైనది, అచంచలమైనది, పరిశుద్ధమైనది. తన కోసం యేమీ కోరని వ్యక్తి, కేవలం శ్రీరామ సేవ తప్ప. భౌతిక శక్తికి, పరాక్రమానికి మారు పేరు. రాక్షసులను చంపినవారు, విశాల  మహాసముద్రాన్ని లంఘించినవారు, లక్ష్మణుడిని రక్షించే నిమిత్తం హిమాలయాల నుండి ఒక పర్వతాన్నే మోసుకువచ్చిన ఘనులు హనుమంతులవారు. అద్భుతమైన వక్త, తర్కంలో నిష్ణాతులు, సమర్థవంతమైన రాయబారి. వేదాల జ్ఞానం కలిగినవారు, మొట్టమొదటి వయ్యాకరణులు (అంటే వ్యాకరణంలో నిష్ణాతులు) - ఒకసారి వాల్మీకి మహార్షినే సరిదిద్దినవారు. అస్సలు భయం లేనివారు, ముఖ్యంగా దుష్టశక్తులతో పోరాడటంలో అమితమైన ధైర్యాన్ని కనబరచేవారు. అమితమైన ఆత్మవిశ్వాసం, జన్మతః దివ్య ప్రయోజనం పట్ల ఆమోఘమైన స్పష్టత గలవారు. అసాధ్యమైనవి సాధించినప్పటికీ కూడా వారిలో అహంకారం ఉండేది కాదు, తన శక్తి-పరాక్రమాలను గురించిన ఆడంబరము ఉండేది కాదు. గొప్ప వినమ్రత గలవారు. తన విజయాలకు కారణం అంతా కేవలం శ్రీరాముని అనుగ్రహమేనని, తన శక్తులు కావని భావించేవారు హనుమంతుల వారు విధేయతలో పరాకాష్ఠ, ఇంద్రియ నిగ్రహము, స్థిరచిత్తము, గలవారు.
 
కాన్హా శాంతి వనంలో, యాత్రా గార్డెన్ లో సీతారామలక్ష్మణహనుమత్సమేత విగ్రహం
   
సహజమార్గ గురుపరంపరలోని మాస్టర్లు కూడా ఆధ్యాత్మిక చైతన్య వికాసాన్ని గురించి వివరిస్తున్నప్పుడు హనుమంతులవారిని స్మరించడం మనం గమనిస్తాం. ముఖ్యంగా 13 చక్రాల మన ఆధ్యాత్మిక యాత్రలో సాధకుడు 9 వ చక్రం చేరుకున్నప్పుడు హనుమంతులవారి చేతనాన్ని అనుభూతి చెందడం జరుగుతుందన్నారు. హను అంటే లేకపోవడం అని, మాన్ అంటే అహం. అంటే అహం లేనివాడు మాత్రమే భాకతుడవుతాడాని అర్థం. ఈ వాక్యాలు పూజ్య లాలాజీ పలికినవి. ఇదే అర్థం పూజ్య దాజీ కూడా పడే పడే ఇటమకించడం మనం గమణిస్తూనే ఉన్నాం. భక్తికి ప్రధాన యోగ్యత ఆహాన్ని త్యజించడమేనన్నారు లాలాజీ. అహం బ్రహ్మాస్మి స్థితిని చేరుకోడాలచుకున్నవారు దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలన్నారు. అలాగే పూజ్య దాజీ, హనుమాన్ లో రెండు గొప్ప లక్షణాలను ఉల్లేఖించారు 1) నేను నా స్వామితో కూడి ఉన్నంత సేపూ యేదీ తప్పవడానికి వీల్లేఎదన్న ధీరత్వం 2) వినమ్రత




1, ఏప్రిల్ 2025, మంగళవారం

ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

 


ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం 
ఒక పెద్ద వరం 

మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే బుద్ధి వికసించకపోయినా, ఆత్మ వికాసం జరుగకపోయినా మనిషి మనుగడ అసంపూర్ణమే, సమతౌల్యతలో కొరతే ఉంటుంది. ఈ వెలితుల కారణంగా ప్రతీ మనిషి అనుభవిస్తూనే ఉంటాడు. వ్యక్తిత్వం సమగ్రంగా ఉండదు కూడా. పర్యవసానాలు అనుభవిస్తూనే ఉంటాడు మనిషి. వ్యక్తిలో ఇటువంటి సమగ్ర పరివర్తన హార్ట్ఫుల్నెస్ సరళ ప్రాణాహుతితో కూడిన ధ్యానపద్ధతి సహజంగా తీసుకువస్తుంది; కొద్దిగా సమయం పట్టినా కూడా తప్పక జరుగుతుంది; ఫలితాలు శాశ్వతంగా ఉంటాయి. 
ఎందుకు వారం అంటే 
ఈ ధ్యాన పద్ధతి చాలా సరళమైనది. 
ఆధునిక జీవన విధానంలో తేలికగా ఇమిడిపోతుంది. 
నియమ-నిబంధనలు ఇంచుమించు లేవు. 
అర్హతలు చూడారు. చూసేదీ ఒక్క అరహాతే, మనలను మనం మార్చుకోటానికి సంసిద్ధంగా ఉన్నామా, లేమా? వ్యక్తి తనలో పరివర్తన రావాలని పరితపిస్తున్నాడా లేదా? అన్నదే ముఖ్యం. 
పూర్తిగా జీవిత పర్యంతం, ప్రతి వ్యక్తికీ వ్యక్తిగతంగా  మార్గదర్శనం అందుబాటులో ఉంటుంది, 
ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు. ఆధ్యాత్మిక శిక్షణ పూర్తిగా ఉచితం.  
అన్నీ సంస్కృతులలోనూ, ఎటువంటి నేపథ్యం కలిగినా, అందరిలో ఇబ్బంది లేకుండా తేలికగా ఇమిడిపోతుంది. 
దీనికి నమ్మకం కూడా అవసరం లేదు. నమ్మకం అనుభవంపై ఆధారపడఉంటుంది. అనుభవం ఉన్నచోట నమ్మకంతో పని లేదు. 
క్రతువులలేవు, తాంబూలాలు లేవు, గురువు పాదస్పర్శలు లేవు, గురు దక్షిణలు లేవు (కృతజ్ఞతతో కూడిన హృదయంతో, యథాశక్తి అందించే గురుదక్షిణలు తప్ప). 
ఈ ధ్యాన పద్ధతి, మనిషిలో సాధారణ ఒత్తిడిని తొలగించడం దగ్గర నుంచి దైవసాక్షాత్కారం వరకూ, ఇంకా మాట్లాడితే, అఆ తరువాత కూడా కొనసాగే అనంత యాత్ర వరకూ అడుగడుగునా సహాయపడే పద్ధతి. 
చాలా వరకు మనస్సాక్షిని అనుసరించడానికి సహాయపడే మార్గం. హయాఉతిక జీవనంలో రోజు-రోజుకూ హృదయంలో శాంతిని వృద్ధి చేసే జీవన విధానం. 
శాస్త్రాలలో ఉల్లేఖించిన నిగూఢమైన ఆధ్యాత్మిక స్థితులను తేలికగా అనుభవంలోకి తీసుకుయయగలిగే మార్గం. ఉదాహరణకు, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తామరాకుపై నీటి బొట్టు వలె జీవించడం అంటే ఏమిటో అనుభవపూర్వకంగా అందులోని ఆనందాన్ని పొందగలుగుతాం;  ఆత్మసమర్పణ యొక్క నిజమైన అర్థాన్ని ప్రత్యక్షానుభవం ద్వారా, సమీప అనుభూతిని  పొందవచ్చు. విలువలు అప్రయత్నంగా నెమ్మది-నెమ్మదిగా చోటు చేసుకోవడం ప్రారంభిస్తాయి. 
వ్యక్తిలో ఉండే అపరిశుద్ధ తత్త్వాలను, జటిల మనస్తత్వాలను నిర్మూలించి, సరళంగా, స్వచ్ఛంగా తయారు చేసే మార్గం. 
కేవలం మూడు మాసాలలోనే,  త్రికరణ శుద్ధిగా చేసే ఈ యోగసాధన ద్వారా అపూర్వమైన మార్పులు చోటు చేసుకోవడం ఎవరైనా గమనించవచ్చు. ఇది ముందుకు సాగడానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.  
మోక్షసాధన మనకు అందుబాటులో ఉన్న విషయం సత్యమేనని,  మహాపురుసులు మనకు బోధిస్తున్నవి కేవలం గ్రంథాలకే పరిమితం కావని, అనుభవ జ్ఞానంలో సాధించవచ్చునన్న విశ్వాసం సగటు మనిషిలో కూడా ఏర్పడటం ఈ అనంత యాత్రలో పాల్గొనాలన్న ఉత్సాహం నిత్యనూతనంగా ఎన్నో ఇంతలు పెరుగుతూ ఉంటుంది.    

21, మార్చి 2025, శుక్రవారం

ఇప్పుడే, ఇక్కడే

ఇప్పుడే, ఇక్కడే 

84 లక్షల యోనుల  గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు. 

అలా  ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారుఇంత  మంది మానవుల్లో ఒక  ఆలుమగల జంట  ఏర్పడటంవాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో  ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని  ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడంతల్లి గర్భంలో ఆ పిండం పెరగడంఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడంనవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.

ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో, దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!

అక్కడి నుండి ప్రారంభమవుతుంది మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే  విధంగా? మొదట  ఆడబిడ్డా, మగ  బిడ్డా అని అడుగుతాం లింగం

ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నడా అంటాం రంగు.

ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక  జీవితాంతం ఇవి మన  తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.

మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.

వాటితోనే మన మనుగడను కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.

మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.

చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.  

 ఇవి ఉన్నంతవరకూ మనిషిలో వికాసం జరిగే అవకాశం ఉన్నట్లే. ఇది లేకపోతే మాత్రం, ఆదిశంకరులు చెప్పిన పునరపి జననం, పునరపి మరణం తప్పకపోవచ్చు. అలా ఎన్ని జన్మలో!!, 84 లక్షల జీవరాసుల్లో ఎక్కడ జన్మిస్తామో!! ఎవ్వరికీ తెలియదు.

అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.

ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి. 

మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు. 

ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. 

7, మార్చి 2025, శుక్రవారం

గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ - భారత మండపం - న్యూఢిల్లీ - ఫిబ్రవరి 21, 2025

 


గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ 
భారత మండపం - న్యూఢిల్లీ
ఫిబ్రవరి 21, 2025


పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ (PSSM) 2025, ఫిబ్రవరి 20 నుండి 23, వరకూ న్యూఢిల్లీలోని  ప్రతిష్ఠిత భారత మండపంలో, గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21, 2025 న హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో పూజ్య దాజీ ధ్యానాన్ని గురించి ప్రసంగం చేయడం, ఆ తరువాత అక్కడున్నవారికి, ధ్యానం యొక్క అనుభూతిని కలుగజేయడం జరిగింది. 

ప్రసంగంలో పూజ్య దాజీ పలికిన ముఖ్య  పలుకులు ఇలా ఉన్నాయి: 
నన్ను ధ్యానం మీద ముఖ్యంగా నిశ్శబ్దంగా జరుగుతున్న చైతన్య వికాసాన్ని గురించి, అంతరంగ శాంతిని గురించిన సైన్సును, అంతరంగ పరివర్తనకు సంబంధించిన విజ్ఞానాన్ని గురించి మాట్లాడమన్నారు మన నిర్వాహకులు. అదీ 4 నిముషాల్లో! నా పరిస్థితి మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడి పరిస్థితిలా ఉంది. 18 అధ్యాయాలు 5 నిముషాల్లో చెప్పవలసిన పరిస్థితి ఒకవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఇరువైపులా సేన మధ్య ఉన్న పరిస్థితిలా ఉంది. ఇరు పక్షాలూ ఒకర్నొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయడం నా వల్ల కాదంటాడు. కృష్ణ భగవానుడు నిస్సహాయుడుగా నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి అర్థమయ్యేలా ఎలా చెప్పడం అని అనుకుంటూ. నన్ను ఇక్కడ చైతన్య వికాసం గురించి, అంతరంగ పరివర్తనను గురించి మొత్తం అంతా 4 నిముషాల్లో చెప్పమన్నారు, నిర్వాహకులు నన్ను క్షమించాలి, ఈ పనికి మీరు పొరపాటు వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు మీరు. ఇది సాధ్యపడే వకాశం కూడా ఉండేది; కానీ వినేవాళ్ళు అర్జునుడిలా ఉండి, చెప్పేవాడు శ్రీకృష్ణుడిలా ఉండుంటే కొద్ది నిముషాల్లోనే ఇది సాధ్యపడుండేది.  కానీ దానికి ప్రాణాహుతి అవసరం. అర్జునుడి మానసిక స్థితిని మార్చడానికి, ఆతని చేతనంలో పరివర్తన తీసుకురావడానికి ఆయనకు ప్రాణాహుతి అవసరం అయ్యింది. ఆ విధంగా అతన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు. 
ముందు ధ్యానం అంటే ఏమిటో నిర్వచనం చేయాలి. ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. ఈ చేతనం అంటే ఏమిటి? కాబట్టి మనం ముందుగా ధ్యానం యొక్క ప్రయోజనంతో మొదలు పెడదాం. సరళంగా చెప్పాలంటే చైతన్య వికాసమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి మూడు శరీరాలున్నాయి - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరలో మనకున్న ఆయుష్షులో వికాసం జరగడం కుదరదు. అందులో వికాసం రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆత్మ, వికాసం చెందనవసరం లేదు. అది స్వఛ్ఛమైనది, మార్పులేనిది, నాశనం లేనిది. ముందే పరమ స్వచ్ఛంగా ఉన్నది మారడం గాని వికాసం చెందడం గాని ఎలా జరుగుతుంది? అవసరమే లేదు. కాబట్టి మార్పు చెందేది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరంలోని ప్రధాన భాగం చేతనం అనే నది. ఈ చేతనానికి, మనసు, బుద్ధి, అహంకారము సహాయపడతాయి. 
మనం ఈ మనసు, బుద్ధి, అహంకారాలను, చేతనాన్ని ప్రభావితం చేసేలా  మార్చాలనుకున్నప్పుడు ఇవి యే విధంగా పరివర్తన చెందేలా చేయాలి?  తద్వారా ఈ చేతనం, అధిచేతనం అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా, ఉపచేతనం అనే మహాసముద్రం లోలోతుల్లోకి మునక వేసేలా వికాసం చెందడానికి ప్రభావితం అవ్వాలంటే ఏమి చేయాలి? 
మనసు వికసించినప్పుడు, మనసు పరిణతి చెందినప్పుడు, అది చేసే పనిలో కూడా పరిణతి రావాలి. మనసు చేసే పనేమిటి? ఆలోచించడం. కాబట్టి మనసు వికాసం చెందినప్పుడు ఆలోచన కంటే మెరుగైన విధంగా మారాలి; ఆలోచన కంటే మెరుగైనాడేది? యంభూతి. మనసు అనుభూతిగా వికాసం చెండాలి. మెదడుతో ఆలోచించడం కంటే హృదయంతో అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అది ధ్యానంతో సాధ్యం. 
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అనే సాంకృత పదాన్ని, ఈ సంధిని విడగొడితే, ధీ + యానం అవుతుంది.  ఇక్కడ ధీ అంటే పరమోత్కృష్ట జ్ఞానం, లేక దివ్య జ్ఞానం. యానం అంటే  వాహనం; అంటే ధ్యానం అనేది దివ్యజ్ఞానానికి జేర్చే  వాహనం అన్నమాట. ధ్యానం అంటే అవ్యక్తంపై దృష్టిని కేంద్రీకరించడం. అయితే ప్రతీ వాహనానికి నడవాలంటే ఇంధనం అవసరం; ఇక్కడ ధ్యానంలోని యానానికి అవసరమైన ఇంధనం ఏమిటి? భౌతిక శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం, అంటే సమతౌల్య ఆహారం ఎలాగో, మనసుకు జ్ఞానం ఎలాగో, ఆత్మకు ఆహారం ప్రాణాహుతి శక్తి అలా  అవసరం.  నేను ఈ రోజు ఈ వేదిక నుండి ఉదఘోషిస్తున్నాను - ప్రాణాహుతి లేకుండా చైతన్య వికాసం అంగుళం కూడా  ముందుకు కదలదు. అందుకే ప్రాణహుతితో కూడిన ధ్యానం అందరికీ అవసరం. 
ఆ తరువాత ధ్యానంతో కార్యక్రమం ముగిసింది. 





అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...