గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్
భారత మండపం - న్యూఢిల్లీ
ఫిబ్రవరి 21, 2025
ప్రసంగంలో పూజ్య దాజీ పలికిన ముఖ్య పలుకులు ఇలా ఉన్నాయి:
నన్ను ధ్యానం మీద ముఖ్యంగా నిశ్శబ్దంగా జరుగుతున్న చైతన్య వికాసాన్ని గురించి, అంతరంగ శాంతిని గురించిన సైన్సును, అంతరంగ పరివర్తనకు సంబంధించిన విజ్ఞానాన్ని గురించి మాట్లాడమన్నారు మన నిర్వాహకులు. అదీ 4 నిముషాల్లో! నా పరిస్థితి మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడి పరిస్థితిలా ఉంది. 18 అధ్యాయాలు 5 నిముషాల్లో చెప్పవలసిన పరిస్థితి ఒకవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఇరువైపులా సేన మధ్య ఉన్న పరిస్థితిలా ఉంది. ఇరు పక్షాలూ ఒకర్నొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయడం నా వల్ల కాదంటాడు. కృష్ణ భగవానుడు నిస్సహాయుడుగా నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి అర్థమయ్యేలా ఎలా చెప్పడం అని అనుకుంటూ. నన్ను ఇక్కడ చైతన్య వికాసం గురించి, అంతరంగ పరివర్తనను గురించి మొత్తం అంతా 4 నిముషాల్లో చెప్పమన్నారు, నిర్వాహకులు నన్ను క్షమించాలి, ఈ పనికి మీరు పొరపాటు వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు మీరు. ఇది సాధ్యపడే వకాశం కూడా ఉండేది; కానీ వినేవాళ్ళు అర్జునుడిలా ఉండి, చెప్పేవాడు శ్రీకృష్ణుడిలా ఉండుంటే కొద్ది నిముషాల్లోనే ఇది సాధ్యపడుండేది. కానీ దానికి ప్రాణాహుతి అవసరం. అర్జునుడి మానసిక స్థితిని మార్చడానికి, ఆతని చేతనంలో పరివర్తన తీసుకురావడానికి ఆయనకు ప్రాణాహుతి అవసరం అయ్యింది. ఆ విధంగా అతన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు.
ముందు ధ్యానం అంటే ఏమిటో నిర్వచనం చేయాలి. ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. ఈ చేతనం అంటే ఏమిటి? కాబట్టి మనం ముందుగా ధ్యానం యొక్క ప్రయోజనంతో మొదలు పెడదాం. సరళంగా చెప్పాలంటే చైతన్య వికాసమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి మూడు శరీరాలున్నాయి - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరలో మనకున్న ఆయుష్షులో వికాసం జరగడం కుదరదు. అందులో వికాసం రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆత్మ, వికాసం చెందనవసరం లేదు. అది స్వఛ్ఛమైనది, మార్పులేనిది, నాశనం లేనిది. ముందే పరమ స్వచ్ఛంగా ఉన్నది మారడం గాని వికాసం చెందడం గాని ఎలా జరుగుతుంది? అవసరమే లేదు. కాబట్టి మార్పు చెందేది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరంలోని ప్రధాన భాగం చేతనం అనే నది. ఈ చేతనానికి, మనసు, బుద్ధి, అహంకారము సహాయపడతాయి.
మనం ఈ మనసు, బుద్ధి, అహంకారాలను, చేతనాన్ని ప్రభావితం చేసేలా మార్చాలనుకున్నప్పుడు ఇవి యే విధంగా పరివర్తన చెందేలా చేయాలి? తద్వారా ఈ చేతనం, అధిచేతనం అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా, ఉపచేతనం అనే మహాసముద్రం లోలోతుల్లోకి మునక వేసేలా వికాసం చెందడానికి ప్రభావితం అవ్వాలంటే ఏమి చేయాలి?
మనసు వికసించినప్పుడు, మనసు పరిణతి చెందినప్పుడు, అది చేసే పనిలో కూడా పరిణతి రావాలి. మనసు చేసే పనేమిటి? ఆలోచించడం. కాబట్టి మనసు వికాసం చెందినప్పుడు ఆలోచన కంటే మెరుగైన విధంగా మారాలి; ఆలోచన కంటే మెరుగైనాడేది? యంభూతి. మనసు అనుభూతిగా వికాసం చెండాలి. మెదడుతో ఆలోచించడం కంటే హృదయంతో అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అది ధ్యానంతో సాధ్యం.
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అనే సాంకృత పదాన్ని, ఈ సంధిని విడగొడితే, ధీ + యానం అవుతుంది. ఇక్కడ ధీ అంటే పరమోత్కృష్ట జ్ఞానం, లేక దివ్య జ్ఞానం. యానం అంటే వాహనం; అంటే ధ్యానం అనేది దివ్యజ్ఞానానికి జేర్చే వాహనం అన్నమాట. ధ్యానం అంటే అవ్యక్తంపై దృష్టిని కేంద్రీకరించడం. అయితే ప్రతీ వాహనానికి నడవాలంటే ఇంధనం అవసరం; ఇక్కడ ధ్యానంలోని యానానికి అవసరమైన ఇంధనం ఏమిటి? భౌతిక శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం, అంటే సమతౌల్య ఆహారం ఎలాగో, మనసుకు జ్ఞానం ఎలాగో, ఆత్మకు ఆహారం ప్రాణాహుతి శక్తి అలా అవసరం. నేను ఈ రోజు ఈ వేదిక నుండి ఉదఘోషిస్తున్నాను - ప్రాణాహుతి లేకుండా చైతన్య వికాసం అంగుళం కూడా ముందుకు కదలదు. అందుకే ప్రాణహుతితో కూడిన ధ్యానం అందరికీ అవసరం.
ఆ తరువాత ధ్యానంతో కార్యక్రమం ముగిసింది.
ధ్యానం మరియు చైతన్య వికాసం, ప్రాణహుతి గురించి పూజ్య దాజీ short time లో ఆ్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదించారు.
రిప్లయితొలగించండిఅనువాదం సరళంగా సులభంగా అర్థమైయెలా ఉంది. Tq sir
రిప్లయితొలగించండిthanks for sharing this valuable message delivered by Daaji, Today i Know the true meaning of Dhyanam
రిప్లయితొలగించండి