15, డిసెంబర్ 2025, సోమవారం

పరమానంద స్థితిని కూడా దాటితే పరమగమ్యం చేరుకున్నట్లే - బాబూజీ


పరమానంద స్థితిని కూడా దాటితే పరమగమ్యం చేరుకున్నట్లే - బాబూజీ 

మతం భగవంతుడు లేక పరమసత్యం యేదో ఉందన్న అవగాహనను కల్పిస్తుంది; మతం యొక్క పాత్ర అదే. అలాగే ఆధ్యాత్మికత అంతర్ముఖమై భగవంతుని అంతరంగంలో అనుభూతి పొందేలా చేస్తుంది; ఆధ్యాత్మికతను కూడా దాటి వెళ్ళవలసి ఉంది ఈ వికాస యాత్రలో; ఆధ్యాత్మికతను దాటినప్పుడు యదార్థ సత్యం అనుభవంలోకి వస్తుంది; ఈ స్థితిని కూడా దాటితనప్పుడు పరమానంద స్థితి కలుగుతుంది. 

ఈ పరమానంద స్థితిని కూడా దాటితే సాధకుడు పరమగమ్యాన్ని హేరుకున్నట్లే అంటారు బాబూజీ. అయినా సాధకుడు ఆ క్షేత్రంలో ఈత కొనసాగిస్తూనే ఉంటాడట. ఇక్కడ తన ఉనికి అతి సూక్ష్మాతిసూక్ష్మంగా మారిపోయి గుర్తింపు మాత్రం మిగిలిపోతుందట మహాప్రళయం సంభవించేంత వరకు. 
అంటే ప్రతీ సాధకుడి యాత్ర, స్థూల దశ నుండి, సూక్ష్మం, సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మంగా  ఉన్నత లోకాల్లో తన ఉనికి మారే వరకూ కొనసాగుతూనే ఉంటుంది. 
అందుకే శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, లాలాజీ, బాబూజీ, చారీజీ వంటి మహాత్ములందరూ వారి-వారి గుర్తింపులతో యే లోకాలలోనో ఇప్పటికీ ఉన్నారు; తక్కినవారందరూ మనతో సహా తమ తమ యాత్రలను కొనసాగిస్తూ ఉన్నారు. 

అందుకే ఆధ్యాత్మిక సాధనను అవలంబించవలసిన అవసరం అందరికీ. తథాస్తు. 

 

1 కామెంట్‌:

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...