15, డిసెంబర్ 2025, సోమవారం

ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుంది - బాబూజీ

 


ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుంది - బాబూజీ

మతం పరమ సత్తా ఉనికిని బాహ్యంగా గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత ఆ ఉనికిని అంతర్ముఖంగా అనుభూతి పొందేలా చేస్తుంది; ఆ తరువాతి దశలో సాధకుడు ఆధ్యాత్మికతను కూడా దాటి దానికి అతీతంగా యదార్థ స్థితిగా మారడం జరుగుతుంది; ఈ యదార్థ స్థితిని కూడా దాటి ఉనికితో ఏకత్వ స్థితిలో పరమానంద స్థితిలో ఉంటాడు; తనను తాను ఇంచుమించుగా మరచిపోతాడు. మాటల్లో వర్ణించరానిది ఈ స్థితి. పరమానంద స్థితి అంటే అర్థం చేసుకోలేనిది కానీ అనుభూతి చెందగలిగినది; అయినా యాత్ర కొనసాగవలైనది ఉందంటారు బాబూజీ. అందుకే ఈ యాత్రను అనంత యాత్ర అంటారు; అంతులేని యాత్ర. ఈ పరమానంద స్థితిని దాటినప్పుడు పరమ గమ్యాన్ని చేరుకున్నట్లే అంటారు బాబూజీ. 

1 కామెంట్‌:

నిరంతర స్మరణ

  నిరంతర స్మరణ  అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి? బాబూజీ: నిరంతర స్మరణ.  నిరంతర స్మరణ అంటే ఏమిటి?   సహజ మార్గ గురువులు...