ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ
మతం బాహ్యోన్ముఖ సాధన అని, ఆధ్యాత్మికం అంతర్ముఖ సాధన అని మనం అర్థం చేసుకున్నాం. మతం యదార్థ సత్యాన్ని యదార్థ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత అంతర్ముఖంగా దాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ తరువాతి దశలో, ఆధ్యాత్మికత పరిపక్వత చెందినప్పుడు, ఆ అనుభూతి యదార్థ సత్యంగా మారుతుంది; అంటే ఉదాహరణకు శాంతిని అనుభూతి చెందిన వ్యక్తి శాంతిస్వరూపుడుగా మారతాడు; ప్రేమను అనుభూతి చెందిన వ్యక్తి ప్రేమగా మారతాడు; దివ్యత్వాన్ని అనుభూతి చెందిన వ్యక్తి దివ్యంగా మారతాడు. దీన్నే ఆధ్యాత్మికతను దాటి యదార్థసత్యంగా వికాసం చెందడం అని అర్థం చేసుకోవచ్చు.
ఇక మాటలు తగ్గిపోతాయి; తనను తాను మరచిపోయే స్థితి ప్రారంభమవుతుంది. అయినా యాత్ర ఇంకా పూర్తి కాలేదంటారు బాబూజీ.
ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుందన్నారు బాబూజీ.
AVUNU. IDOKA ANANTAMAINA YAATRA.
రిప్లయితొలగించండి