15, డిసెంబర్ 2025, సోమవారం

ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ

 ఆధ్యాత్మికత ఎక్కడ అంతమవుతుందో అక్కడ యదార్థ సత్యం ప్రారంభమవుతుంది - బాబూజీ 

మతం బాహ్యోన్ముఖ సాధన అని, ఆధ్యాత్మికం అంతర్ముఖ సాధన అని మనం అర్థం చేసుకున్నాం. మతం యదార్థ సత్యాన్ని యదార్థ సత్యాన్ని గుర్తించేలా చేస్తుంది; ఆధ్యాత్మికత అంతర్ముఖంగా దాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. ఆ తరువాతి దశలో, ఆధ్యాత్మికత పరిపక్వత చెందినప్పుడు, ఆ అనుభూతి యదార్థ సత్యంగా మారుతుంది; అంటే ఉదాహరణకు శాంతిని  అనుభూతి చెందిన వ్యక్తి శాంతిస్వరూపుడుగా మారతాడు; ప్రేమను అనుభూతి చెందిన వ్యక్తి ప్రేమగా మారతాడు; దివ్యత్వాన్ని అనుభూతి చెందిన వ్యక్తి దివ్యంగా మారతాడు. దీన్నే ఆధ్యాత్మికతను దాటి యదార్థసత్యంగా వికాసం చెందడం అని అర్థం చేసుకోవచ్చు. 

ఇక మాటలు తగ్గిపోతాయి; తనను తాను మరచిపోయే స్థితి ప్రారంభమవుతుంది. అయినా యాత్ర ఇంకా పూర్తి కాలేదంటారు బాబూజీ. 

ఎక్కడ యదార్థ సత్యం అంతమవుతుందో అక్కడ పరమానంద స్థితి ప్రారంభమవుతుందన్నారు బాబూజీ. 


1 కామెంట్‌:

ఒత్తిళ్ళు

ఒత్తిళ్ళు  ఒత్తిడి. మనిషి జీవితం ఒత్తిళ్ళ మయం. పుట్టుకే ఒక ఒత్తిడి, తల్లి గర్భంలో ఒత్తిడి, తల్లికి ఒత్తిడి. బయట  పడ్డాక యేడ్చే దాకా ఒత్తిడి....