ఈ ఏడు శ్లోకాలను పరిశీలిస్తే, శ్రీకృష్ణుడు అర్జునుడిలో ఏ విధంగా ఆతనిలో వివిధ రకాల స్థితులను అనుభవింపజేసి, ఆతని చైతన్యంలో పరివర్తన కలిగేలా చూశాడో అర్థమవుతుంది.
మొదటి శ్లోకం ద్వారా అందించిన స్థితి - స్థితప్రజ్ఞత్వం
రెండవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - క్రోధం ఎలా ఉద్భవిస్తుంది?
మూడవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - క్రోధం ఏ విధంగా మనిషిని అథోగతిపాలు చేస్తుంది?
నాల్గవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - మనోనిగ్రహం ద్వారా మనిషి ఏ విధంగా విముక్తుడవుతాడు?
అయిదవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - మనశ్శాంతి లేకుండా సంతోషం లేదు.
ఆరవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - పరధర్మం కంటే స్వధర్మమే మేలు
ఏడవ శ్లోకం ద్వారా అందించిన స్థితి - కర్మ చెయ్యకుండా నైష్కర్మ్య సిద్ధి పొందలేము
కృంగిపోయిన అర్జునుడు, ఇలా ఏడు రత్నాల ద్వారా పరివర్తన చెందిన చైతన్యంతో, తిరిగి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి సిద్ధమవుతాడు.
భౌతిక ప్రపంచంలో మానవులకు ధర్మాధర్మాల మధ్య యుద్ధం అంతరంగంలో నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక సాధకులు ఆత్మ-అనాత్మ వివేకం కోసం నిత్యం పరితపిస్తూ ఉంటారు. ఈ యుద్ధాలన్నీ హృదయంలోనే ప్రతీ మనిషిలోనూ జరుగుతూ ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుడు బోధించినది అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ వర్తిస్తుంది.
కావున పూజ్య బాబూజీ పూజ్య దాజీ ద్వారా ఆగష్టు 29, 2021 న వెల్లడి చేయించిన ఈ గీతాహృదయంలోని ఈ ఏడు రత్నాలను కేవలం శ్రవణమే గాక, మనన, నిధిధ్యాసనల ద్వారా సాక్షాత్కారింపజేసుకుని మనందరమూ మన జీవితాలను తరింపజేసుకొనే ప్రయత్నంలో ఎల్లప్పుడూ ఉందాం.
తరువాయి భాగాల్లో ఈ శ్లోకాలను వివరంగా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం.
(సశేషం)
Thank you sir,wonderful explanation
రిప్లయితొలగించండి