11, సెప్టెంబర్ 2024, బుధవారం

సాధనా పంచకం - ఆది శంకరాచార్యులవారు

సాధనా పంచకం 

ఆదిశంకరులవారు సాధకులు పరమ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలంటే ఎక్కవలసిన 40 మెట్లను ఈ చిన్ని 5 శ్లోకాల గ్రంథంలో నిక్షిప్తం చేశారు. దీన్నే సాధనా పంచకం అంటారు. గంభీర సాధకులకు అద్భుత మార్గదర్శకాలివి: 

1. నిత్యం వేదాధ్యయనం చెయ్యండి. అంటే మన శాస్త్రాలను అధ్యయనం చెయ్యండి.  

2. మన శాష్టరాలు నిర్దేశించిన విధంగా మీ ధర్మాలను, మీ కర్మలను మీరు జాగారూకతతో నిర్వర్తించండి. 

3. ఈ కర్మలన్నీటినీ భగవంతునికి అర్పించి ఆరాధించండి. 

4. మనసులో ఉన్న కోరికాలన్నీటినీ తొలగించేయండి. 

5. గుండెల్లో దాచుకున్న పాపాల భారాన్ని కడిగివేయండి. 

6. సాంసారిక విషయాల వల్ల కలిగే సుఖాలన్నీ వేదనపూరితమైనవని గుర్తించండి. 

7. నిత్యానుష్ఠానం ద్వారా పరమాత్మ కోసం తపించండి. 

8. గృహము అనే బంధం నుండి తప్పించుకోండి. అంటే మీ చేతనను గృహానికే పరిమితం గాకుండగా మరింత విస్తృతంగా విస్తరింపజేయండి. 

9. వివేకవంతుల సాంగత్యం కోసం పరితపించండి. 

10. భగవంతుని పట్ల భక్తిలో మిమ్మల్ని మీరు సుస్థిరపరచుకోండి. 

11. శాంతి వంటి సుగుణాలను మీలో పెంపొందించుకోండి. 

12. కోరికతో కూడిన చర్యలన్నీ నివారించుకోండి. 

13. పరిపూర్ణుడైన మాస్టరు పట్ల శరణాగతి కలిగి ఉండండి. 

14. నిత్యం గురువును సేవించండి. 

15. పరివార్తనకు ఆస్కారం లేని ఓంకారం పై ధ్యానించండి. 

16. ఉపనిషత్తుల్లో ఘోషించిన అంశాలను లోతుగా విని అర్థం చేసుకోండి. 

17. ఉపనిషత్తుల్లో నిర్దేశించిన వాటి భావాన్ని నిత్యం మననం చేసుకుంటూ ఉండండి. 

18. బ్రహ్మపదార్థం అనేది సత్యము అన్న సత్యాన్ని ఆశ్రయించండి. 

19. వితండవాదాలకు దూరంగా ఉండండి. 

20. శ్రుతులు నిర్దేశించే వివేకపూరిత విధానాన్ని అనుసరించండి. 

21. 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో ఎప్పుడూ నిమగ్నమై ఉండండి. 

22. దర్పాన్ని విడిచేపెట్టేయండి. 

23. 'నేను శరీరం' అన్న భావాన్ని విడిచి పెట్టేయండి. 

24. విజ్ఞులతో వాదనలు చేయకండి. 

25. ఆకలిని, వ్యాధిని తగిన విధంగా చూసుకోండి. 

26. నిత్యం భిక్ష ద్వారా పొందిన ఆహారం అనే ఔషధాన్ని గ్రహించండి. 

27. రుచికరమైన ఆహారాన్ని యాచించకండి. 

28. లభించినడానితో సంతుష్టులయి భగవంతునిచ్చే ప్రసాదింపబడినట్లుగా స్వీకరించండి. 

29. శీతోష్ణ, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలన్నీటినీ సహనంతో భరించండి. 

30. అర్థంలేని ప్రశంగాలకు దూరంగా ఉండండి. 

31 చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి; వాటిని పట్టించుకోకుండా ఉండండి, 

32. ఇతరుల దాయకు పాత్రులు గాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. 

33. ఏకాంతంలో ఆనందంగా జీఈమచండి. 

34. ఆ పరమాత్మునిలో మీ మనసును ప్రశాంతంగా ఉంచండి. 

35. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించి సాక్షాత్కరించుకోండి. 

36. పరింతమైన ప్రపంచం పరమాత్మ యొక్క మితయేనని గుర్తించండి. 

37. గత జన్మలలో చేసిన కర్మల (సంచిత) ప్రభావాలపై ప్రస్తుతం చేసే సరైన కర్మల ద్వారా జయం సాధించండి. 

38. వివేకం సహాయంతో భవిష్యత్ కర్మల నుండి (ఆగామి నుండి) మామత్వాన్ని పోగొట్టుకోండి. 

39।  గతలోని కర్మల ప్రభావాన్ని (మొదలైన ప్రారబద్ధాన్ని) 

అనుభవించడం ద్వారా పూర్తిగా అవగొట్టండి. 

40. ఆ తరువాత 'అహం బ్రహ్మాస్మి' అన్న భావనలో లీనమై జీవించండి. 


ఆచార్య వినోబా భావే



ఆచార్య వినోబా భావే 
(1895-1982)
ఈ రోజు భారత రత్న ఆచార్య వినోబా భావే జన్మదినోత్సవం. ఆయన సెప్టెంబర్ 11, 1895 న ఒక బ్రాహ్మణ కుటుంబంలో, మహారాష్ట్రలో  జన్మించారు. వీరి అసలు పేరు వినాయక నరహరి. డబ్బు సంపాదించడం కోసం ఆయనకు చదువుకోవడం ఇష్టం ఉండేది కాదు. అందుకే వారు బనారస్ వెళ్ళి, సంస్కృతంలో పట్టు సాధించి, మన శాస్త్రాలన్నీ అధ్యయనం చేయడం జరిగింది. అలాగే కొరాన్ అధ్యయనం చేయడం కోసం వారు అరబిక్ నేర్చుకొని మూలాన్ని చదివి పట్టు సంపాదించారు. అలాగే బైబిల్ చదువుకున్నారు. 
 
వీరు సంఘ-సంస్కర్తగానూ, స్వాతంత్ర్య  సమర యోధుడుగానూ,  ఆధ్యాత్మిక ఆచార్యులుగానూ భారతదేశంలోనే గాక ప్రపంచ వ్యాప్తంగా  ప్రసిద్ధి పొందినవారు. వీరు మానవ హక్కుల కోసం, పోరాడిన వ్యక్తి; అహింసను ఆయుధంగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న వ్యక్తి. 

అంతే కాదు, ఆచార్య వినోబా భావే అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర్యం సాధించిన తరువాత, 1951 లో  వారు నేతృత్వం వహించిన భూదాన్ ఉద్యమం. ఈ ఉద్యమ లక్ష్యం భూమి సేకరణ - భూమి ఎక్కువగా ఉన్నవారు, భూమి లేని వారికి భూదానం చేయడం. దీని కోసం వారు కొన్ని వేల కిలోమీటర్లు నడవడం జరిగింది.  మనకు ప్రత్యేకంగా విశేషం ఏమిటంటే, ఈ ఉద్యమాన్ని, తెలంగాణాలోని హైదరాబాదు శివార్లలో ఉన్న పోచంపల్లి గ్రామం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ ఊరును భూదాన్  పోచంపల్లి అని కూడా అంటారు. 

1940 లో మొట్టమొదటి వ్యక్తిగత సత్యాగ్రహం చేసినవారు వీరే; ఆ తరువాతే నెహ్రూగారు చేయడం జరిగింది. ఈ పోరాటంలో 7 సార్లు ఖైదులో ఉన్నారు. 1958 లో వారు రేమన్ మ్యాగ్సాసే పురస్కారం, మరణానంతరం 1983 లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం అందించడం జరిగింది. 
1932 లో, మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, ఆరు నెలలు ఖైదీగా ఉండవలసి వచ్చినప్పుడు, ఆశువుగా భగవద్గీత మీద, 700 శ్లోకాలపై మరాఠీలో ఇతర ఖైదీలనుద్దేశించి అనర్గళంగా అద్భుతంగా, సమాధి స్థితిలో ఉంటూ ప్రవచనాలివ్వడం జరిగింది.  అవే Talks on the Gita అనే పేరుతో ఆంగ్లంలో ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం అన్ని  భారతీయ భాషలలోనూ, అనేక విదేశీ భాషలలో కూడా ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథాన్ని భారతీయ సంపదగా భావిస్తారు. 

ఈ గ్రంథాన్ని గురుదేవులు పూజ్య దాజీ  2019 లో మన సంస్థ ప్రచురణగా విడుదల చేయడం జరిగింది. దాజీ ఈ గ్రంథాన్ని గురించి ముందుమాటలో, ఈ గ్రంథాన్ని గురించి వినోబా భావే స్వయంగా పలికిన మాటలను  సంస్మరించుకున్నారు: "నేను గీతను గురించి వ్రాసిన వ్యాసాలు గాని, ప్రవచనాలు గాని జైల్లో గాక మరెక్కడైనా అయితే అంతా అద్భుత ప్రభావం కలిగి ఉండేవి కావేమో; ఈ ఖైదు మా స్వాతంత్ర్య సమర యోధులందరికీ ఒక యుద్ధ క్షేత్రం అవడం వల్ల ఇంతటి  ప్రభావం కలిగి ఉన్నాయనిపిస్తుంది."

ప్రతి ఒక్కరూ ఈ అద్భుత గ్రంథాన్ని, చక్కటి కథలా చెప్పిన ఈ 18 ప్రసంగాలను ఆస్వాదించి భగవద్గీత యొక్క గొప్ప ప్రయోజనాన్ని సిద్ధించుకొందురుగాక. 


 

5, సెప్టెంబర్ 2024, గురువారం

ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5

 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 
(1888-1975)

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన భారతదేశ రెండవ రాష్ట్రపతిగా (1962-67) ఉన్న విషయం అందరికీ విదితమే. భారతదేశం గర్వించదగ్గ మహాపండితులు, మహా జ్ఞాని. వారు 1962 లో రాష్ట్రపతిగా పదవిని చేపట్టినప్పుడు వారి శిష్యులు వారి జన్మదినోత్సవాన్ని వైభవంగా జరపాలనుకున్నారు. దానికి వారు, నా జన్మదినోత్సవం చేసే బదులుగా ఈ రోజున ఉపాధ్యాయుల దినోత్సవంగా పరిగణించి ఉపాధ్యాయులను గౌరవించమని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ప్రతీ సంవత్సరమూ సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయుల దినోత్సవంగా వారి గౌరవార్థం జరుపుకుంటూ ఉన్నాం. 

మనలో ప్రతి ఒక్కరి జీవితంలో మనలను అనేక రకాలుగా ప్రభావితం చేసి ఉంటారు. సకారాత్మకంగా ప్రభావితం చేసినవాళ్ళూ ఉండవచ్చును, నకారాత్మకంగానూ ప్రభావితం చేసినవాళ్ళు కూడా ఉండి ఉండవచ్చును. మనకు ఈ రెండు రకాల వాళ్ళు జ్ఞాపకం ఉండిపోతారు. ఇరువురి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండవలసినదే. ఒకళ్ళు జీవితంలో ఎలా ఉండాలో మార్గదర్శనం చేస్తే, మరొకరి వద్ద నుండి ఎలా ఉండకూడదో నేర్చుకుంటాం గనుక. 

నా జీవితం మలచడంలో నాకు తెలుగు బోధకులుగా ఉన్న ఉపాధ్యాయులకు ఎంతో ఋణపడి ఉన్నాను. స్కూల్లో శ్రీమతి పద్మజ టీచర్, జూనియర్ కళాశాలలో శ్రీ అక్కిరాజు రామకృష్ణ గారు, డిగ్రీలో డా. అరిపిరాల విశ్వంగారు. అందరూ మహానుభావులే. అలాగే నాలో నాకే తెలియని కళలను వెలికి తీసిన శ్రీమతి విద్యాధరిగారికి నా ప్రత్యేక కృతజ్ఞతాంజలి. 

ఉపాధ్యాయుడంటే బోధించేవాడు అని అర్థం; విద్యను నేర్పించేవాడు.  నేర్పించాలంటే ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి; అంటే ఎప్పుడూ విద్యార్థిగానే ఉండాలి. కాబట్టి ఎప్పటికీ విద్యార్థిగా ఉండేవాడే సరైన ఉపాధ్యాయుడు. అటువంటివారే విద్యార్థులను సరైన నాగరికులగా, సరైన మానవులుగా, తీర్చి దిద్దగలిగేది.  అటువంటి ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 

అలాగే విద్యార్థులకు కేవలం సమాచారాన్ని అందించడమే గాక, విషయాలను స్పష్టంగా వివరించగలగడమే గాక, వారిని ఆలోచిమపజేసి, ప్రేరణ కలిగించేవాడు శ్రేష్ఠమైన ఉపాధ్యాయుడు. అటువంటి ఉపాధ్యాయులు ధన్యులు. ఎందుకంటే అటువంటి ఉపాధ్యాయులు సజీవ ఉదాహరణలుగా నిలుస్తారు. వీళ్ళ వ్యక్తిత్వాలు అనుసరించదగ్గవిగా ఉంటాయి. వీళ్ళ సంఖ్య అపరిమితంగా పెరగాలని మనందరం  ఆకాంక్షించాలి.  




4, సెప్టెంబర్ 2024, బుధవారం

చైతన్య వికాసం - 1

మానవ జీవిత యదార్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ... నీటి చుక్క మహాసాగరంలో లయమైపోవాలంటే, మనిషిలో అనుక్షణమూ పరిణతి సంభవించలంటే, మానవ పరిపూర్ణాటను సిద్ధింపచేసుకోవాలంటే, ఆత్మవికాసం జరగాలంటే, చైతన్య వికాసం జరగాలంటే, దివ్యప్రేమగా మారాలంటే, జీవిత ప్రయోజనం సిద్ధించాలంటే  మహనీయులు సూచించిన క్రమం ఈ క్రింది విధంగా ఉంది: 

 భగవంతునిలో (ప్రేమలో)సంపూర్ణ ఐక్యం 

అంతరంగం దివ్యప్రేమగా పరివర్తన చెందినప్పుడు  

సమర్పణ, ప్రపత్తి, శరణాగతి సంభవించినప్పుడు 

నిరంతర స్మరణ సిద్ధించినప్పుడు 

సరైన భావనతో నిత్య సాధన నిష్ఠగా కొనసాగించినప్పుడు 

(ధ్యానం, శుద్ధీకరణ, ప్రార్థన, దశ నియమాలకనుగుణంగా జీవిత నిర్వహణ, స్వాధ్యాయం) 

అలసత్వాన్ని అంటే బద్ధకాన్ని ప్రక్కకు పెట్టి, గమ్యం పట్ల ఆసక్తి  పెంచుకున్నప్పుడు 

మనిషి తనను తాను మరింత-మరింత మెరుగైన విధంగా పరివర్తన చెండాలన్న ఆలోచన కలిగినప్పుడు 


8, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 3

 


(సప్తపది)


వివాహ వ్యవస్థ - 3 
వివాహ వ్యవస్థలో, సనాతన ధర్మం ప్రకారం రకరకాలుగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. అతి ప్రసిద్ధమైన అందరూ సాధారణంగా అనుసరించే పద్ధతులు - మాంగల్య ధారణం, పాణిగ్రహణం, కన్యాదానం, సప్తపది, వీటిల్లో ఏదోక తంతు అయినా ఉంటుంది లేక అన్నీ కలిసి కూడా వివాహ మహోత్సవం జరుపుకుంటూ ఉంటారు. 
మాంగల్యధారణంలో , వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేయడం జరుగుతుంది; మూడు ముళ్ళకర్థం: స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు సంకేతం ఈ మూడు ముళ్ళు. మూడు  శరీరాలలోనూ ఇరువురూ ఒక్కటిగా ఉండాలన్నది ఆశయం.   
పాణిగ్రహణంలో వధువు చేయి, వరుడు చేతిలో పెట్టడం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ సాంప్రదాయంలో సజీవ గురువు, గురుదేవులు, మాస్టర్,  సాన్నిధ్యంలో వధూవరులు, పూలదండలు మార్చుకున్న తరువాత (ముందుగా వధువు వరుడి మెడలో దండ వేస్తుంది, ఆ తరువాత వరుడు వధువు మెడలో దండ వేయడం జరుగుతుంది) వరుడు చేతిలో వధువు చేయి ఉంచి ఆశీర్వదించడం జరుగుతుంది. జీవితాంతం అలా ఒకరికొకరు కొనసాగాలని, వరుడు, వధువును ఆ విధంగా చూసుకోవాలని అర్థం. ఒక మహాత్ముని సమక్షంలో పాణి గ్రహణం చేయడం అనేది ఇరువురికీ అమితమైన బాధ్యతను సూచిస్తుంది. 
కన్యాదానం అంటే వధువు యొక్క తల్లిదండ్రులు తమ కుమార్తెను, కన్యను, వరుడిని మహావిష్ణువుగా భావించి, అంటే భగవంతునిగా భావించి తాము అపురూపంగా పెంచిపెద్దచేసిన కన్యను, అపరిమితమైన విశ్వాసంతో  ఆయన చేతిలో పెట్టి, అప్పుడప్పుడు వరుడి కాళ్ళు కడిగి (భగవంతుని పాదాలుగా భావించి), దానం చేయడం జరుగుతుంది. 
సప్తపది అనే నాల్గవ తంతులో అగ్నిహోత్రుని చుట్టూ, అగ్నిసాక్షిగా  వధూవరులిద్దరి చేత, అన్యోన్య దాంపత్యానికి అవసరమైన ఏడు వాగ్దానాలు, చేయిస్తారు.  కలిసి ఏడు అడుగులు వేస్తూ, అందుకే వీటిని సప్తపది అంటారు అంటే ఏడు అడుగులు వేస్తూ ఈ ప్రమాణాలు చేస్తారు. వీటినే పెళ్ళినాటి ప్రమాణాలు అని కూడా అంటారు. 
ఆ విధంగా వివాహ వ్యవస్థ ఒక పవిత్ర వ్యవస్థ, మానవ సమాజాన్ని క్రమశిక్షణలో ఉంచుతూ మనుగడకు ఉపయోగపడే మహత్తరమైన వ్యవస్థ. 
ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడూ, ఇది ఆలుమగలు పరిశుద్ధ ప్రేమతత్త్వాన్ని పెంపొందించుకునే అద్భుత వ్యవస్థ. తద్వారా ఆత్మసాక్షాత్కార దిశగా లేక భగవత్సాక్షాత్కార దిశగా తీసుకువెళ్ళేటువంటి పవిత్ర వ్యవస్థ. ప్రేమ, త్యాగాలను అనుభవపూర్వకంగా శిక్షణనిచ్చే వ్యవస్థ. రోజు-రోజుకూ మరింత మెరుగైన మానవుడిగా మారడానికి అనువైన, వీలుకల్పించే  శిక్షణాస్థలి, అద్భుత అవకాశం. ఇతరులను గురించి ఆలోచింపజేసే ఆశ్రమం గృహస్థాశ్రమం. 



6, జులై 2024, శనివారం

వివాహ వ్యవస్థ - 2

 


(కన్యాదానం)

వివాహ వ్యవస్థ - 2 
వివాహం నా అవగాహన ప్రకారం ఒక దైవ కార్యం; ప్రకృతి నిర్వహించే కార్యం; ప్రేమకు సంబంధించిన కార్యం. 
దైవ కార్యం ఎందుకంటే, రెండు ఆత్మలు సరైన సమయంలో ఎదురుపడటం అనేది సంభవించేది దివ్యపరిణామం వల్ల మాత్రమే. 
ప్రకృతి కార్యం ఎందుకంటే రెండు ఆత్మల సంస్కారాలను బట్టి ఒక్కచోటుకు జేర్చేది ప్రకృతి కాబట్టి, ఆ రెండు ఆత్మల కలయిక, ఆ తరువాత పునరుత్పత్తి, ఇత్యాది కార్యాలు ప్రకృతికి సంబంధించినవి కాబట్టి. 
వివాహం ప్రేమకు సంబంధించినది, ఎందుకంటే వైవాహిక జీవనంలోనే ప్రేమ, త్యాగం వంటివి నేర్చుకునేది. పరిశుద్ధ ప్రేమకు దారితీసే ఒక నిగూఢ వ్యవస్థ వివాహ వ్యవస్థ. 
పరిశుద్ధ ప్రేమ అంటే, భయము, క్రోధము, మోహము, ఈర్ష్య, అహంకారము, ఇత్యాది వికారాలు పూర్తిగా తొలగిపోయిన ఆత్మ స్థితి, శుద్ధ ప్రేమ అంటే. అన్ని ఆధ్యాత్మిక సాధనలు, చివరకు ఈ పరిశుద్ధ ప్రేమ స్థితికి చేరుకోవడానికే ; అదే పరమ లక్ష్యం. అది కానట్లయితే అట్టి సాధనా పద్ధతులను వెనువెంటనే విడిచి పెట్టేయాలి. 
పరిశుద్ధ ప్రేమకు దారితీసే జీవన విధానంలో వివాహ వ్యవస్థ ఒక కీలకమైన భాగం, ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైన అంగం. స్త్రీపురుష జీవనానికి సరైన దిశను ఏర్పరచేది ఈ వివాహ వ్యవస్థ. ఈ దిశ లేనట్లయితే, అది కేవలం పాశవిక జీవనంగా మిగిలిపోతుంది. 
వైవాహిక జీవితం యొక్క ప్రగాఢ ప్రాముఖ్యతను మనిషి జీవితంలో గుర్తించి, తదనుగుణంగా ఆలుమగలు తమ జీవితాలను సరిదిద్దుకోవడం, మానవాళి శ్రేయస్సుకు మంచిది. దీనికి హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యాన విధానం వంటి జీవన విధానం అనుసరించినట్లయితే, మానవ వికాసం త్వరితగతిని జరిగే అవకాశం చాలా ఉంది. 

1, జులై 2024, సోమవారం

వివాహ వ్యవస్థ - 1

(పాణి గ్రహణం)

వివాహ వ్యవస్థ - 1 

వివాహం అవసరమా? వివాహం చేసుకోవాలా, అక్కర్లేదా? అసలు వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా మొదలయ్యింది? వివాహం చేసుకుంటే ఆడపిల్లలు యే వయసులో చేసుకోవడం శ్రేష్ఠం? మగ పిల్లలకు యే వయసు శ్రేష్ఠం?  వివాహం అయ్యాక వైవాహిక జీవనం శ్రేష్ఠంగా గడపాలంటే ఎలా? వైవాహిక జీవనానికి సముచిత అర్థం ఉండాలంటే ఏమి చేయాలి? 

ఈ ప్రశ్నలన్నీటికీ సమాధానాలు ఎవరికి వారు వెతుక్కుని, సంతృప్తికరమైన సమాధానాలు వచ్చే వరకూ జీవితాంతమూ తెలుసుకుంటూనే ఉండటం కొనసాగుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అందరికంటే గొప్పగా మనిషికి తెలియజేసేది సాక్షాత్తూ జీవితమే, ప్రకృతే. కానీ జీవితం నేర్పిస్తే చాలా కఠినంగా నేర్పిస్తుంది, చాలా సమయము, జీవితమూ  రెండూ  వ్యర్థం అవుతాయి కూడా. అందుకే మనం పెద్దల విజ్ఞతను, వారిచ్చిన జ్ఞానాన్ని,  అనుసరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూంటాము; కానీ ఎక్కడో అక్కడ మన తెలివితేటలు, మనలో ప్రతీదానికీ కారణం వెతుక్కునే తత్త్వం అడ్డు వస్తూనే ఉంటుంది. 

నా జీవితానుభవంలోనూ, పెద్దల మాట వినడంలోనూ , స్వంతంగా జీవితం నేర్పిన పాఠాల ద్వారానూ, సహజ మార్గ గురువుల బోధల ద్వారానూ, ఇప్పటి వరకూ తెలుసుకున్నది పంచుకునే ప్రయత్నం చేస్తాను, ఇక్కడ. 

పురుషులు సృష్టింపబడినది భర్తలవడానికి, స్త్రీలు జన్మించినది తల్లులుగా మారడానికేనని ఎక్కడో చదివినట్లు గుర్తు.  అప్పుడే వాళ్ళ జీవితం సార్థకం అవుతుంది. మానవజాతిని పునరుత్పత్తి చేసి వృద్ధి చేయడం, సమాజం పట్ల మానవులు చెయ్యవలసిన  కర్తవ్యం. ఇది వివాహ ధర్మం.  

(సశేషం ... )

అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన 5 ఔషధాలు

  అష్టావక్ర మహాగీత ఆత్మకు నిర్దేశించిన  5 ఔషధాలు  ఇటీవలే పూజ్య దాజీ "ఫైవ్ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ది సోల్ ఫ్రమ్ అష్టావక్ర మహాగీత" అన...