14, అక్టోబర్ 2025, మంగళవారం

ఓం శాంతిః శాంతిః శాంతిః

 


(పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?)
ఓం శాంతిః శాంతిః శాంతిః
ప్రతీ ఆత్మ శాంతి కోసం పరితపిస్తూ ఉంటుంది. శాంతి లేకపోయినట్లయితే ఏ పనీ సరిగ్గా జరుగదు. మనశ్శాంతి అవసరం ఇంత-అంతా కాదు. సమస్త సృష్టే శాంతి కోసం తపిస్తూ ఉంటుంది. ఈ సృష్టిలో జరిగే సమస్త కదలికలూ, సూక్ష్మ కదలికల నుండి స్థూల కదలికల వరకూ కూడా శాంతి కోసమే. మన వేదాల్లో కూడా, ప్రతీ మంత్రమూ ఓం శాంతిః శాంతిః శాంతిః తో ముగుస్తుంది. శాంతి మంత్రాలని వేదాలలో ప్రత్యేకంగా ఉన్నాయి కూడా. 

వేదశాస్త్రాల్లో శాంతి
శాంతికి మూడు పార్శ్వాలున్నాయి :
1) ఆధ్యాత్మిక శాంతి - మనసుకు, హృదయానికి  సంబంధించిన అంతరంగ శాంతి 
2) ఆధిభౌతిక శాంతి - ప్రకృతికి, సమాజానికి, తోటి జీవులకు సంబంధించిన శాంతి 
3) ఆధిదైవిక శాంతి - అంతరిక్షంలోని శక్తులకు, విధికి దైవత్వానికి సంబంధించిన శాంతి. 
అందుకే మన శాంతి మాత్రాల్లో మూడు సార్లు ఓం, శాంతిః శాంతిః శాంతిః అని భగవంతుని ప్రార్థించేది. 
సంగచ్ఛధ్వం, సంవదధ్వం, సం వో మనాంసి జానతాం  
- ఋగ్వేదం  (10.191.4)
అర్థం: అందరూ సామరస్యంగా కదలండి, అందరూ ఒక్క గళంతో మాట్లాడండి, మీ మనసులన్నీ సామరస్యంగా ఉండేలా హూసుకోండి. 
ఓం, శాంతిః శాంతిః శాంతిః
- అథర్వ వేదం (19.9 .14)
అర్థం: శరీరంలోనూ (ఆధ్యాత్మికం), వాతావరణంలోను (ఆధిభౌతికం), అంతరిక్షంలోనూ(ఆధిదైవికం) శాంతి ఉండాలని ప్రార్థన. 
అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ 
- బృహదారణ్యక ఉపనిషత్తు (1.3.28)
 శాంతి అంటే అర్థం
 లోపల బయట ఉండవలసిన సామరస్యం, ప్రశాంతత; నిశ్చలత్వం; నిశ్శబ్దం; ఒకరకమైన శూన్యత్వం. 
అంతరంగంలో శాంతి ఎలా కలుగుతుంది?
ధ్యానం తరువాత వచ్చేదే శాంతి అంటుంది సహజ మార్గం. అభ్యాసం చేయగా-చేయగా శరీర వ్యవస్థలో అణువణువూ శాంతితో నిండిపోతుంది.
శాంతి కర్మఫల త్యాగం వల్ల వస్తుందంటుంది భగవద్గీత; మనలో ఉన్న భయం, చింతలు, అరిషడ్వర్గాల వంటి వికారాలు, సంస్కారాలు  తొలగిపోవడం వల్ల అపరిమితమైన గాఢమైన శాంతి కలుగుతుంది.

పైన చిత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ధ్యానంలో.. సృష్టిస్థితిలయకారులు, వీళ్ళు ధ్యానం ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ధ్యానం చేస్తున్నదెవరిపైన?
సమాధానం: బ్రహ్మ సృష్టించే ప్రక్రియపైన ధ్యానిస్తున్నాడు. విష్ణువు స్థితికార్యంపై ధ్యానిస్తున్నాడు; లయకారుడు లయంపై ధ్యానిస్తున్నాడు. వీరు ముగ్గురూ కూడా తమలో బీజస్థితిలో ఉన్న ఒకే పరబ్రహ్మ తత్త్వంపై  ధ్యానిస్తూ ఉంటారు. మనుషులకైనా, దేవతలకైనా, సృష్టిస్థితిలయకారులయినా ధ్యానం అనివార్యం.  

2 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఎంత చక్కగా, సూక్ష్మమంగా విశ దీకరించారు కృష్ణారావు గారు. మనం కూడా మన హార్ట్ ఫుల్ నేస్ లో వారు ముగ్గురూ ఎవరినైతే ప్రార్థిస్తున్నారో ఆ తత్వాననే ప్రార్థిస్తూ ఉన్నాం అన్నట్లు చెప్పారు. ఆహా ! అద్భుతం.

    రిప్లయితొలగించండి

తెలంగాణాలో శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా నా ప్రస్థానం - 5

  జయ్యారం గ్రామ ఆశ్రమం - ధ్యాన మందిరం  తెలంగాణాలో  శ్రీ రామ చంద్ర మిషన్ స్వచ్ఛంద సేవకుడిగా  నా ప్రస్థానం - 5 పూజ్య గురుదేవల కృపా దృష్టి కొనస...