విస్పర్ సందేశాలను చదివే విధానం ... పూజ్య చారీజీ మాటల్లో ...
ఫిబ్రవరి 2, 2009 న సత్ఖోల్ ఆశ్రమంలో "హృదయంతో చదవండి" అన్న శీర్షికతో ఇచ్చిన ప్రసంగంలో పూజ్య చారీజీ ఈ విస్పర్ సందేశాలను హృదయంతో చదవమని చెప్తారు. పూజ్య గురుదేవులు దాజీ ధ్యాన స్థితిలో చదవమని చెప్పడం జరిగింది. ఈ సందేశాలను ఉదయం ధ్యానం తరువాత లేక సత్సంగం (సామూహిక ధ్యానం) తరువాత అందుకే చదవడం శ్రేష్ఠం. ఈ సందేశాల్లో భాష కంటే అందులే ఉండే దివ్య తరంగాలతో ప్రతి స్పందించడం ప్రధానం, ఇంగ్లీషులో రెజొనెన్స్ అంటారు. ఈ సందేశాలు దివ్యలోకం నుండి అందిన సూక్ష్మమైన తరంగాలు లేక ప్రకంపనలు. వీటిని మన హెలీన్ పైరే గారు వారికొచ్చిన ఫ్రెంచ్ భాషలో తర్జుమా చెయ్యడం జరిగింది. ఆమెకు ఫ్రెంచ్ భాష మాత్రమే రావడం వల్ల ఆ భాషలో తర్జుమా చేయడం జరిగింది. ఆమె తెలుగు వారయ్యుంటే తెలుగులో తర్జుమా అయి ఉండెవి. ఆ తరంగాలతో మనం రెజొనేట్ అయినప్పుడు, మన ఆత్మ వాటిని అందుకొని ప్రతిస్పందించినప్పుడు, కలిగే దివ్యానుభూతులు మన చేతనంలో అనేక మార్పులు సంభవించేలా చేస్తాయి. "ఈ సందేశాలు మనలోని సంస్కారాలను చాలా వరకూ తొలగించేస్తాయి, కాని చిత్తశుద్ధితో, ఆ ప్రయోజనం కోసం చదివినప్పుడు మాత్రమే" అని పూజ్య చారీజీ చెప్పారు. మనలను శుద్ధంగా, సరళంగా తయారు చేస్తాయి.
ఇక్కడ ప్రకంపనాలంటే, స్థూలమైన ప్రకంపనలు కావు. అతి సూక్ష్మ ప్రకంపనలు; ఇంకా చెప్పాలంటే ప్రకంపన లేని ప్రకంపనలు. అర్థం చేసుకోవడం కంటే అనుభూతి ద్వారా తెలుసుకోగలం. మాటకు/చేతలకు ముందు ఆలోచన; ఆలోచనకు ముందు భావన; భావనకు ముంంం సూక్ష్మ ప్రకంపన. మనం అందుకోవలసినది ఆ సూక్ష్మ ప్రకంపన. అది ధ్యాన స్థితిలో మాత్రమే సంభవిస్తుంది. హృదయం కూడా మరింత మరింత సున్నితంగా సూక్ష్మంగా తయారయ్యే అవకాశం ఉంది.
"బుర్రను పూర్తిగా ప్రక్కకు పెట్టేసి హృదయంతో చదవమంటారు చారీజీ. పైగా ఇది నా తుదు హెచ్చరిక అని కూడా అన్నారు ఈ సందేశాలు చదివే క్రమాన్ని గురించి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అదెలా సాధ్యం అని అడుగుతారేమో, ప్రయత్నించి చూడండిచూడండి, ఆశ్చర్యపోతారు, మీ మెదడుకు అందనివి కూడా సృష్టిలో ఉన్నాయని తెలుసుకొని ఆశ్చర్యపోతారు" అన్నారు చారీజీ.
కాబట్టి, ప్రతీ సాధకుడు తన నిత్యసాధనలో, ఉదయం ధ్యానం చేసిన తరువాత కలిగిన ధ్యాన స్థితిలో అలాగే కొనసాగుతూ ఈ విస్పర్ సందేశాన్ని సంపూర్ణమైన విశ్వాసంతోనూ, భక్తితోనూ చదివే ప్రయత్నం చెయ్యండి, తర్జుమా కంటే అతీతమైన ప్రకంపనలను, అంటే హెలీన్ పైరే గారు అందుకున్న ప్రకంపనలతో ప్రతిస్పందించే అవకాశం మనకు కలుగుతుంది. ఆ ప్రకంపనలు మనకి నిజమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని సిద్ధింంంంచేలా తోడ్పడతాయి. ఇదెలాగంటే, వేదమంత్రాలు మనకు అర్థం గాకపోయినా, వేదోచ్ఛారణ వల్ల కలిగే ప్రకంపనల వల్ల మనసుకు ఎటువంటి అనిర్వచనీయమైన ప్రశాంతతను చేకూరుస్తాయో, అదే విధంగా ధ్యానస్థితిలో ఈ సందేశాలను మనం చదువుతున్నప్పుడు వినేకారిలోనూ, చదివేవారిలోనూ కూడా అంతకంటే సూక్ష్మ దివ్య తరంగాలను అందుకోవడం జరుగుతుంది.
కావున అమదరూ ప్రతి రోజూ తమ ధ్యానం తరువాత విధిగా ఈ విస్పర్ సందేశాన్ని చదుబుకునే ప్రయత్నించాలని ప్రార్థిస్తూ....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి