పూజ్య దాజీ నూతన సంవత్సర సందేశాల మననం-4
మన వంతుగా చేయవలసిన కృషి
పూజ్య గురుదేవుల సందేశాల నుండి ఏడు మాసాలలోనే సంపూర్ణ యాత్ర పూర్తి చేయడానికి పూజ్య దాజీ సూచించిన మార్గదర్శక సూత్రాలు :
1) ప్రతి మనిషిలోనూ ఉన్న పసిహృదయాన్ని నిలుపుకునే ప్రయత్నం
2) నిర్దేశించిన విధంగా సంపూర్ణ అభ్యాసాన్ని అనుసరించడం - ఉదయం ధ్యానం, సాయంకాల శుద్ధీకరణ, రాత్రి ప్రార్థనా-ధ్యానం, నిరంతర స్మరణను అభ్యాసం చేయడం అనగా ఎ. ఇ. ఐ. ఒ. యు. పద్ధతిని అభ్యసించడం, అంటే ధ్యానం తరువాత కలిగిన ఆధ్యాత్మిక స్థితిని గుర్తించడం, ఆస్వాదించడం, రోజంతా నిలుపుకునే ప్రయత్నంలో ఉండటం.
3) తీవ్ర అభ్యాసం (ఇంటెన్స్ అభ్యాస్) చేయడం అంటే ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా సాధన చేయడం. రోజు-రోజుకీ మరింత మరింత సూక్ష్మమైన భావనతో, మరింత మెరుగైన లోతైన, అవగాహనతో (అంటే మిషన్ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) సాధన చేయడం.
4) సహజమార్గ సిద్ధాంతాలను అనుసరించడం. అంటే బాబూజీ దశ నియమాలు, చారీజీ జోడించిన 2 నియమాలు మన దైనందిక జీవన విధానంగా మారిపోయేలా జీవించే ప్రయత్నంలో నిమగ్నమవడం.