14, జూన్ 2023, బుధవారం

మానవ ప్రయత్నం - భగవంతుని కృప/అనుగ్రహం

మనం నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలుసుకున్న తెలుసుకోకపోయినా, మానవ ప్రయత్నం, భగవంతుని కృప, ఈ  రెండూ  లేకుండా ఎ పనీ  జరగదు. కేవలం మానవ ప్రయత్నం సరిపోదు; అందుకే అన్ని పనులూ జరుగకపోవడానికి  కారణం. అలాగే కేవలం భగవంతుని కృప మాత్రమే సరిపోదు; భగవంతుని కృప ఎల్లప్పుడూ ఉంటుంది; లేనిది మానవ ప్రయత్నం;  అందుకే ఆయన కృప ఉన్నా పనులు జరుగకపోవడానికి కారణం. 

ఇక్కడ మరొక్క విషయం తెలుసుకోవాలి; భగవత్సంకల్పానికి అనుగుణంగా మానవ సంకల్పం ఉంటేనే అది దివ్య జీవనం అవుతుంది; యోగాభ్యాసం యొక్క పరమ లక్ష్యం అదే. యోగాభ్యాసం, ఆధ్యాత్మిక సాధన అనేవి భగవత్ కృపను ఆకర్షించే విధంగా మన జీవితాలను మలచుకునే ప్రయత్నమే. 

భగవద్గీత 18 అధ్యాయంలో 78 వ శ్లోకంలో చెప్పినది దీనికి నిదర్శనం. 

యత్ర యోగీశ్వర కృష్ణో యాత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ||

పైన చిత్రంలో శ్రీకృష్ణ భగవానుడు భాగవతకృపాకు ప్రతీక; ధనుర్ధరుడైన అర్జునుడు మానవ ప్రయత్నానికి ప్రతీక. ఒక విధంగా మానవ ప్రయత్నం భగవంతుని కృపాను ఆకర్షించే విధంగా, అనుగుణంగా ఉండాలని భగవద్గీత బోధిస్తున్నది. 
భగవంతుని కృపను గురించి మన గురుదేవులు చెప్పినవి ఇక్కడ స్మరించుకోవాలి. కృప అనేది కోరుకుంటే కలిగేది కాదు. కృప అనేది యోగ్యత సంపాదించుకొని ఒక విధంగా నిరీక్షించేది. కోరుకునేవాడికి సాధారణంగా  యోగ్యత ఉండదు; యోగ్యత ఉన్నవాడు సాధారణంగా కోరుకోవాలసిన పని లేదు; అనేవారు గురుదేవులు. కాబట్టి  భగవంతుని కృపను ఆకర్షించే విధంగా మన జీవితాన్ని మాలచుకోవడమే ఆధ్యాత్మిక సాధన లేక యోగాభ్యాసం.  యోగ్యతను పెంచుకునే దిశలో కృషి చేస్తూ, దేనికోసం తపిస్తున్నామో తెలియనటువంటి  ఒక విధమైన తీవ్రమైన తపనతో జీవితం కొనసాగించడమే మన విధి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం -మహోన్నత వ్యక్తిత్వం

పూజ్య గురుదేవులు పార్థసారథి రాజగోపాలాచారీజీ పై ధ్యానం - మహోన్నత వ్యక్తిత్వం   పూజ్య గురుదేవులను చూస్తే మహోన్నత వ్యక్తిత్వం అంటే ఇదేనేమోననిపి...