21, మార్చి 2025, శుక్రవారం

ఇప్పుడే, ఇక్కడే

ఇప్పుడే, ఇక్కడే 

84 లక్షల యోనుల  గుండా ప్రయాణం పూర్తయిన తరువాత, కనీసం 84 లక్షల జన్మల తరువాత మానవజన్మ అంటారు పెద్దలు; అందుకే మనుష్యత్వం దుర్లభం అంటారు ఆది శంకరులు. 

అలా  ఎందరో మానవులు ఈ భూమ్మీద జన్మించారుఇంత  మంది మానవుల్లో ఒక  ఆలుమగల జంట  ఏర్పడటంవాళ్ల కలయికలో ఎన్నో లక్షల పురుష వీర్యకణాల్లో  ఒక్క వీర్యకణం ఎన్నో లక్షల స్త్రీ అండాలలోని  ఒక అండంతో ముడిపడి ఒక పిండం తయారవడంతల్లి గర్భంలో ఆ పిండం పెరగడంఆ పిండంలోకి మూడు మాసాలకు ఆత్మ ప్రవేశించడంనవమాసాల తరువాత పిండం మానవ శిశువుగా ఆవిర్భవించడం జరిగిపోతున్నది.

ఆ ఆత్మ ఎక్కడి నండి వస్తుందో, దాని ప్రయాణం ఎక్కడికో యేమీ తెలియదు కదా!!!

అక్కడి నుండి ప్రారంభమవుతుంది మనిషిపై అనేక పొరలు ఏర్పడటం; యే  విధంగా? మొదట  ఆడబిడ్డా, మగ  బిడ్డా అని అడుగుతాం లింగం

ఆ తరువాత తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నడా అంటాం రంగు.

ఆ తరువాత జాతి, కులం, భాష, మతం. ఇదంతా బిడ్డ పుట్టగానే మనకు ఏర్పడిపోతాయి. ఇక  జీవితాంతం ఇవి మన  తోడుగానే ఉంటాయి; వీటిల్లో కొట్టుకుంటూఎ మన జీవితం తరచూ కడతేరుతూ ఉంటుంది.

మనం మనిషి బిడ్డగా జన్మించావన్న సత్యాన్నే మరచిపోతాం.

వాటితోనే మన మనుగడను కొనసాగిస్తూఁటాం. అసంపూర్ణంగా మిగిలిపోతాం.

మనలను మనం యథాతథంగా ఈ పొరల మాటున ఉన్న అసలు తత్త్వాన్ని తెలుసుకోవడమే తనను తాను తెలుసుకోవడం అంటే బహుశా; దాన్నే ఆత్మ సాక్షాత్కారం అని కూడా అంటారు పెద్దలు.

చిక్కు ఏమిటంటే ఇది తెలుసుకునే వరకూ ఆత్మకు నిద్ర పట్టదు, యేదో తెలియని పూడ్చలేని వెలితి, యేదో చెప్పలేని తీవ్ర అసంతృప్తి. దీన్నే ఆధ్యాత్మిక తృష్ణ అని కూడా అంటారు పండితులు. ఈ దాహాన్ని తీర్చడమే మానవ జన్మ ప్రయోజనమేమోనని అనిపిస్తూ ఉంటుంది.  

 ఇవి ఉన్నంతవరకూ మనిషిలో వికాసం జరిగే అవకాశం ఉన్నట్లే. ఇది లేకపోతే మాత్రం, ఆదిశంకరులు చెప్పిన పునరపి జననం, పునరపి మరణం తప్పకపోవచ్చు. అలా ఎన్ని జన్మలో!!, 84 లక్షల జీవరాసుల్లో ఎక్కడ జన్మిస్తామో!! ఎవ్వరికీ తెలియదు.

అందుకే ఇప్పుడే, ఇక్కడే పని పూర్తయిపోవాలంటుంది ఆధ్యాత్మికత. మహర్షులు, అవతారా పురుషులు, మహాత్ములెందరో కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారు. పరిష్కార మార్గాలు చూపించారు, చూపిస్తున్నారు, బహుశా భవిష్యత్తులోనూ చూపిస్తూనే ఉంటారు కూడా.

ఈ పరిష్కార మార్గాలే మనకు మత గ్రంథాలుగా, వివిధ సాంప్రదాయాల ఆధ్యాత్మిక పద్ధతులుగా, శాస్త్రాలుగా భూమ్మీద మనకు అందుబాటులో ఉన్నాయి. 

మరల మనిషి అసలు అన్వేషనఊ మరచిపోయి వీటిని తనకున్న పరిమితమైన శక్తులతో అర్థం చేసుకోవడానికి సతమతమవుతూ ఉంటాడు. తనను తాను ఈ శబ్దారణ్యంలో, తెలివితేటల వలల్లో, వాదోపవాదాల్లో, పడిపోయి, ప్రామాణికమైన అన్వేషణ అంతర్ముఖంగా చేసే అన్వేషణేనని తెలుసుకునే సరికి జీవితం గడచిపోతుంది; అప్పటి వరకూ బహుశా అసలైన మార్గం తటస్థం కూడా కాదేమోననిపిస్తుంది; ఎందుకంటే తటస్థమైనా మనకు మనం ఉన్న పరిస్థితుల్లో గుర్తించడం జరగదు. 

ఒక్కసారి అటువంటి ఆధ్యాత్మిక పాఠము, అటువంటి సమర్థుడైన గురువు తటస్థించినప్పుడు, హృదయంలో అపరిమితమైన ప్రశాంతతను అనుభూతి చెందడం జరుగుతుంది. అప్పుడు, ఇప్పుడే, ఇక్కడే మన జీవిత పరిష్కారం ఉందని ప్రామాణికంగా హృదయానికి స్పష్టమవుతుంది. అక్కడి నుండి అసలు ప్రయాణం ప్రారంభమవుతుంది. 

7, మార్చి 2025, శుక్రవారం

గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ - భారత మండపం - న్యూఢిల్లీ - ఫిబ్రవరి 21, 2025

 


గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ 
భారత మండపం - న్యూఢిల్లీ
ఫిబ్రవరి 21, 2025


పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ (PSSM) 2025, ఫిబ్రవరి 20 నుండి 23, వరకూ న్యూఢిల్లీలోని  ప్రతిష్ఠిత భారత మండపంలో, గ్లోబల్ మెడిటేషన్ లీడర్స్ కాన్ఫెరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 21, 2025 న హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో పూజ్య దాజీ ధ్యానాన్ని గురించి ప్రసంగం చేయడం, ఆ తరువాత అక్కడున్నవారికి, ధ్యానం యొక్క అనుభూతిని కలుగజేయడం జరిగింది. 

ప్రసంగంలో పూజ్య దాజీ పలికిన ముఖ్య  పలుకులు ఇలా ఉన్నాయి: 
నన్ను ధ్యానం మీద ముఖ్యంగా నిశ్శబ్దంగా జరుగుతున్న చైతన్య వికాసాన్ని గురించి, అంతరంగ శాంతిని గురించిన సైన్సును, అంతరంగ పరివర్తనకు సంబంధించిన విజ్ఞానాన్ని గురించి మాట్లాడమన్నారు మన నిర్వాహకులు. అదీ 4 నిముషాల్లో! నా పరిస్థితి మహాభారత యుద్ధరంగంలో శ్రీకృష్ణుడి పరిస్థితిలా ఉంది. 18 అధ్యాయాలు 5 నిముషాల్లో చెప్పవలసిన పరిస్థితి ఒకవైపు యుద్ధానికి సన్నద్ధంగా ఇరువైపులా సేన మధ్య ఉన్న పరిస్థితిలా ఉంది. ఇరు పక్షాలూ ఒకర్నొకరు చంపుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయడం నా వల్ల కాదంటాడు. కృష్ణ భగవానుడు నిస్సహాయుడుగా నిలబడ్డాడు. ఈ మూర్ఖుడి అర్థమయ్యేలా ఎలా చెప్పడం అని అనుకుంటూ. నన్ను ఇక్కడ చైతన్య వికాసం గురించి, అంతరంగ పరివర్తనను గురించి మొత్తం అంతా 4 నిముషాల్లో చెప్పమన్నారు, నిర్వాహకులు నన్ను క్షమించాలి, ఈ పనికి మీరు పొరపాటు వ్యక్తిని ఎంపిక చేసుకున్నారు మీరు. ఇది సాధ్యపడే వకాశం కూడా ఉండేది; కానీ వినేవాళ్ళు అర్జునుడిలా ఉండి, చెప్పేవాడు శ్రీకృష్ణుడిలా ఉండుంటే కొద్ది నిముషాల్లోనే ఇది సాధ్యపడుండేది.  కానీ దానికి ప్రాణాహుతి అవసరం. అర్జునుడి మానసిక స్థితిని మార్చడానికి, ఆతని చేతనంలో పరివర్తన తీసుకురావడానికి ఆయనకు ప్రాణాహుతి అవసరం అయ్యింది. ఆ విధంగా అతన్ని యుద్ధానికి సన్నద్ధం చేశాడు. 
ముందు ధ్యానం అంటే ఏమిటో నిర్వచనం చేయాలి. ధ్యానం యొక్క ప్రయోజనం ఏమిటో కూడా తెలియాలి. ఈ చేతనం అంటే ఏమిటి? కాబట్టి మనం ముందుగా ధ్యానం యొక్క ప్రయోజనంతో మొదలు పెడదాం. సరళంగా చెప్పాలంటే చైతన్య వికాసమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి మూడు శరీరాలున్నాయి - స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరలో మనకున్న ఆయుష్షులో వికాసం జరగడం కుదరదు. అందులో వికాసం రావాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆత్మ, వికాసం చెందనవసరం లేదు. అది స్వఛ్ఛమైనది, మార్పులేనిది, నాశనం లేనిది. ముందే పరమ స్వచ్ఛంగా ఉన్నది మారడం గాని వికాసం చెందడం గాని ఎలా జరుగుతుంది? అవసరమే లేదు. కాబట్టి మార్పు చెందేది కేవలం సూక్ష్మ శరీరం మాత్రమే. సూక్ష్మ శరీరంలోని ప్రధాన భాగం చేతనం అనే నది. ఈ చేతనానికి, మనసు, బుద్ధి, అహంకారము సహాయపడతాయి. 
మనం ఈ మనసు, బుద్ధి, అహంకారాలను, చేతనాన్ని ప్రభావితం చేసేలా  మార్చాలనుకున్నప్పుడు ఇవి యే విధంగా పరివర్తన చెందేలా చేయాలి?  తద్వారా ఈ చేతనం, అధిచేతనం అనే ఆకాశంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా, ఉపచేతనం అనే మహాసముద్రం లోలోతుల్లోకి మునక వేసేలా వికాసం చెందడానికి ప్రభావితం అవ్వాలంటే ఏమి చేయాలి? 
మనసు వికసించినప్పుడు, మనసు పరిణతి చెందినప్పుడు, అది చేసే పనిలో కూడా పరిణతి రావాలి. మనసు చేసే పనేమిటి? ఆలోచించడం. కాబట్టి మనసు వికాసం చెందినప్పుడు ఆలోచన కంటే మెరుగైన విధంగా మారాలి; ఆలోచన కంటే మెరుగైనాడేది? యంభూతి. మనసు అనుభూతిగా వికాసం చెండాలి. మెదడుతో ఆలోచించడం కంటే హృదయంతో అనుభూతి చెందడం నేర్చుకోవాలి. అది ధ్యానంతో సాధ్యం. 
ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం అనే సాంకృత పదాన్ని, ఈ సంధిని విడగొడితే, ధీ + యానం అవుతుంది.  ఇక్కడ ధీ అంటే పరమోత్కృష్ట జ్ఞానం, లేక దివ్య జ్ఞానం. యానం అంటే  వాహనం; అంటే ధ్యానం అనేది దివ్యజ్ఞానానికి జేర్చే  వాహనం అన్నమాట. ధ్యానం అంటే అవ్యక్తంపై దృష్టిని కేంద్రీకరించడం. అయితే ప్రతీ వాహనానికి నడవాలంటే ఇంధనం అవసరం; ఇక్కడ ధ్యానంలోని యానానికి అవసరమైన ఇంధనం ఏమిటి? భౌతిక శరీరానికి పోషక విలువలతో కూడిన ఆహారం, అంటే సమతౌల్య ఆహారం ఎలాగో, మనసుకు జ్ఞానం ఎలాగో, ఆత్మకు ఆహారం ప్రాణాహుతి శక్తి అలా  అవసరం.  నేను ఈ రోజు ఈ వేదిక నుండి ఉదఘోషిస్తున్నాను - ప్రాణాహుతి లేకుండా చైతన్య వికాసం అంగుళం కూడా  ముందుకు కదలదు. అందుకే ప్రాణహుతితో కూడిన ధ్యానం అందరికీ అవసరం. 
ఆ తరువాత ధ్యానంతో కార్యక్రమం ముగిసింది. 





ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఒక పెద్ద వరం

  ఆధునిక మానవాళి ఆధ్యాత్మిక వికాసానికి  హార్ట్ఫుల్నెస్ ధ్యానం  ఒక పెద్ద వరం  మనిషిలో శారీరక ఎదుగుదల లేకపోయినా, మానసిక ఎదుగుదల లేకపోయినా అంటే...